‘ఆచార్య’ విడుదలకు ముందు, తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఆ సినిమా, అలాగే దాని దర్శకుడు కొరటాల శివ గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి. సినిమా విడుదలకు ముందు కొరటాల శివను చిరు ఎంతగా పొగిడాడో, ఆయనకు ఎంత ఎలివేషన్ ఇచ్చారో అందరికీ తెలుసు. కానీ రిలీజ్ తర్వాత మాత్రం ‘ఆచార్య’ డిజాస్టర్ కావడానికి కొరటాలదే బాధ్యత అన్నట్లుగా మాట్లాడుతుండడం విమర్శలకు దారి తీస్తోంది. ఈ విషయంలో ఇంతకుముందే ఒకట్రెండు సందర్భాల్లో పరోక్షంగా చిరు చేసిన వ్యాఖ్యలు చాలామందికి రుచించలేదు.
తాజాగా ఫిల్మ్ కంపానియన్ ఇంటర్వ్యూలో.. ఆ సినిమా విషయంలో రిగ్రెట్ లేదని, ఎందుకంటే అది డైరెక్టర్ ఛాయిస్ అని, ఆయన చెప్పిందే తాము చేశామని అన్నాడు చిరు. హిట్టయితే క్రెడిట్ తీసుకుని, ఫ్లాప్ అయితే మాత్రం దర్శకుడి మీదికి తోసేస్తారా అంటూ చిరు మీద యాంటీ ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారిప్పుడు.
ఈ సందర్భంగా మహేష్ బాబు ఒక సందర్భంలో అన్న మాటలను గుర్తు చేస్తున్నారు. ఒక సినిమా ఫ్లాప్ అయితే అందుకు ప్రధాన బాధ్యత తానే తీసుకుంటానని మహేష్ అన్నాడు అప్పుడు. అందుకు కారణమేంటో కూడా వివరించాడు. సినిమా కథను ఓకే చేసింది తనే కాబట్టి.. తాను నో చెప్పి ఉంటే ఆ సినిమా తెరకెక్కేదే కాదు కదా.. కాబట్టి తాను బాధ్యత వహించాల్సిందే అని మహేష్ తెలిపాడు. హిట్టయితే ఆ క్రెడిట్ అందరికీ దక్కుతుందని కూడా చెప్పాడు.
ఇక మరో సందర్భంలో మహేష్ గురించి దర్శక రత్న దాసరి నారాయణరావు మాట్లాడుతూ.. ‘దూకుడు’ సినిమా అంత పెద్ద హిట్టవడం పూర్తిగా శ్రీను వైట్ల క్రెడిటే అని, అతను చెప్పినట్లే తాను చేశానని మహేష్ తనతో అన్నాడని, అలాగే ‘బిజినెస్ మేన్’ విషయంలోనూ క్రెడిట్ అంతా పూరీ జగన్నాథ్కే ఇచ్చాడని.. ఇది మహేష్లో ఉన్న గొప్ప లక్షణం అని దాసరి కొనియాడిన వీడియోను కూడా నెటిజన్లు ఇప్పుడు షేర్ చేస్తూ చిరును విమర్శిస్తున్నారు.
మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ గురించి రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో చెబుతూ.. తారక్కు ఫ్లాపులు ఇచ్చిన దర్శకుల గురించి ఒక్క సందర్భంలోనూ నెగెటివ్గా మాట్లాడలేదని, ఎవరినీ పల్లెత్తు మాట అనలేదని చెప్పిన మాటలను కూడా గుర్తు చేస్తూ చిరు మీద విమర్శలు గుప్పిస్తున్నారు. మొత్తంగా చూస్తే ఈ వ్యవహారంలో చిరు బాగానే అన్ పాపులర్ అయ్యాడన్నది వాస్తవం. సినిమా హిట్టయితే తన ఇన్పుట్స్ గురించి, తన జడ్జిమెంట్ గురించి చెప్పుకునే చిరు.. ఫ్లాప్ అయితే అందుకు తన బాధ్యతేమీ లేదని, పూర్తిగా దర్శకుడిదే రెస్పాన్సిబిలిటీ అని మాట్లాడడం ఎంత వరకు కరెక్ట్ అని, ఇకనైనా ఆయన మారాల్సిన అవసరం ఉందని నెటిజన్లు హితవు పలుకుతున్నారు.
This post was last modified on October 2, 2022 5:37 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…