ఈ దసరా కి రెండు పెద్ద సినిమాలతో పాటు స్వాతి ముత్యం అనే ఓ చిన్న సినిమా రిలీజవుతుంది. ఇటు చిరు గాడ్ ఫాదర్ అటు నాగార్జున ది ఘోస్ట్ విజయదసమి రోజు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడబోతున్నాయి. అయితే ఈ సినిమాలకు సంబంధించి ఇప్పుడు థియేటర్స్ చిక్కు వచ్చి పడిందట. రెండు పెద్ద సినిమాలకు థియేటర్స్ అడ్జస్ట్ చేయడం డిస్ట్రిబ్యూటర్స్ కి పెద్ద సమస్యగా మారిందని అంటున్నారు. ముఖ్యంగా ఈ రెండు సినిమాలకు నైజాం లో పెద్ద సమస్య ఉందట.
దానికి కారణం నాగార్జున సినిమా నిర్మాత ఎశియన్ సునీల్. నైజాంలో ఎశియన్ వాళ్లకి అధిక థియేటర్స్ ఉన్నాయి. వాళ్ళ బేనర్ లో తెరకెక్కిన సినిమా ది ఘోస్ట్ కి ఆ థియేటర్స్ కేటాయించుకుంటున్నారు. దీంతో చిరు గాడ్ ఫాదర్ కి తెలంగాణాలో ఆశించిన థియేటర్స్ దక్కడం లేదని మెగా ఫ్యాన్స్ వాపోతున్నారు. మెగా స్టార్ కి నైజాంలో భారీ థియేటర్స్ దక్కాలని వారు డిమాండ్ చేస్తూ నిర్మాతల మీద డిస్ట్రిబ్యూటర్స్ మీద ఒత్తిడి తెస్తున్నారట.
చిన్న సినిమానే కానీ స్వాతి ముత్యం కి కూడా నైజాంలో మంచి థియేటర్స్ పడనున్నాయి. ఎందుకంటే సినిమా నిర్మాత నాగ వంశీ బడా ప్రొడ్యూసర్. పైగా ఈ సినిమాకు దిల్ రాజు సపోర్ట్ ఉంది. పెద్ద సినిమాలు నిర్మిస్తున్న బడా నిర్మాత సంస్థ నుండి వస్తున్న సినిమా కావడంతో డిస్ట్రిబ్యూటర్స్ కూడా స్వాతి ముత్యం కి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏదేమైనా ఇటు చిరు అటు నాగ్ మధ్యలో స్వాతి ముత్యంకు థియేటర్స్ కేటాయించడం డిస్ట్రిబ్యూటర్స్ పెద్ద సవాల్ గా మారింది. ఈ రెండు సినిమాలు పోటా పోటీ మీద ఎంత వసూళ్ళు చేస్తాయి ? ముఖ్యంగా నైజాంలో చిరు ది పై చేయి గా ఉంటుందా ? లేదా నాగ్ చిరు మీద పై చేయి సాదిస్తాడా ? అనేది ఆసక్తిగా మారింది. రెండు సినిమాలకు మంచి బజ్ ఉంది. మరి
This post was last modified on October 1, 2022 10:07 pm
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…