ఈ దసరా కి రెండు పెద్ద సినిమాలతో పాటు స్వాతి ముత్యం అనే ఓ చిన్న సినిమా రిలీజవుతుంది. ఇటు చిరు గాడ్ ఫాదర్ అటు నాగార్జున ది ఘోస్ట్ విజయదసమి రోజు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడబోతున్నాయి. అయితే ఈ సినిమాలకు సంబంధించి ఇప్పుడు థియేటర్స్ చిక్కు వచ్చి పడిందట. రెండు పెద్ద సినిమాలకు థియేటర్స్ అడ్జస్ట్ చేయడం డిస్ట్రిబ్యూటర్స్ కి పెద్ద సమస్యగా మారిందని అంటున్నారు. ముఖ్యంగా ఈ రెండు సినిమాలకు నైజాం లో పెద్ద సమస్య ఉందట.
దానికి కారణం నాగార్జున సినిమా నిర్మాత ఎశియన్ సునీల్. నైజాంలో ఎశియన్ వాళ్లకి అధిక థియేటర్స్ ఉన్నాయి. వాళ్ళ బేనర్ లో తెరకెక్కిన సినిమా ది ఘోస్ట్ కి ఆ థియేటర్స్ కేటాయించుకుంటున్నారు. దీంతో చిరు గాడ్ ఫాదర్ కి తెలంగాణాలో ఆశించిన థియేటర్స్ దక్కడం లేదని మెగా ఫ్యాన్స్ వాపోతున్నారు. మెగా స్టార్ కి నైజాంలో భారీ థియేటర్స్ దక్కాలని వారు డిమాండ్ చేస్తూ నిర్మాతల మీద డిస్ట్రిబ్యూటర్స్ మీద ఒత్తిడి తెస్తున్నారట.
చిన్న సినిమానే కానీ స్వాతి ముత్యం కి కూడా నైజాంలో మంచి థియేటర్స్ పడనున్నాయి. ఎందుకంటే సినిమా నిర్మాత నాగ వంశీ బడా ప్రొడ్యూసర్. పైగా ఈ సినిమాకు దిల్ రాజు సపోర్ట్ ఉంది. పెద్ద సినిమాలు నిర్మిస్తున్న బడా నిర్మాత సంస్థ నుండి వస్తున్న సినిమా కావడంతో డిస్ట్రిబ్యూటర్స్ కూడా స్వాతి ముత్యం కి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏదేమైనా ఇటు చిరు అటు నాగ్ మధ్యలో స్వాతి ముత్యంకు థియేటర్స్ కేటాయించడం డిస్ట్రిబ్యూటర్స్ పెద్ద సవాల్ గా మారింది. ఈ రెండు సినిమాలు పోటా పోటీ మీద ఎంత వసూళ్ళు చేస్తాయి ? ముఖ్యంగా నైజాంలో చిరు ది పై చేయి గా ఉంటుందా ? లేదా నాగ్ చిరు మీద పై చేయి సాదిస్తాడా ? అనేది ఆసక్తిగా మారింది. రెండు సినిమాలకు మంచి బజ్ ఉంది. మరి
This post was last modified on October 1, 2022 10:07 pm
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…