పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్న హరిహర వీరమల్లు తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతుందో అర్థం కాక అయోమయంలో ఉన్న అభిమానులకు ఎట్టకేలకు టెన్షన్ తగ్గించేశారు. అక్టోబర్ మూడో వారంలో స్టార్ట్ చేయబోతున్న కొత్త షెడ్యూల్ కు సంబంధించి ఒక వర్క్ షాప్ పెట్టి దాని తాలూకు వీడియోని సోషల్ మీడియాలో కూడా చేశారు. మంచి అవుట్ ఫిట్ తో చాలా గ్లామరస్ గా కనిపిస్తున్న పవన్ ని చూసి ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. సో ఇది మొదలైతే నాన్ స్టాప్ గా పూర్తయ్యేవరకు కొనసాగనుంది. ఆ మేరకు దర్శకుడు క్రిష్ పక్కా ప్లానింగ్ రెడీ చేసుకున్నారు.
ఈ వర్క్ షాప్ లో యూనిట్ సభ్యులతో పాటు కొందరు యాక్టర్లు కూడా పాల్గొనడం విశేషం. రఘుబాబు, సుబ్బరాజు తదితరులు ఇందులో కనిపించారు. సంభాషణలు, వాటిని డెలివరీ చేయడం గురించి కొన్ని కీలకమైన ఇన్ ఫుట్స్ ని ఇచ్చిపుచ్చుకున్నారు. ఈ మీటింగ్ లో సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి భాగం పంచుకోవడం విశేషం. 2023 వేసవిని టార్గెట్ చేసుకున్న హరిహర వీరమల్లు ఖఛ్చితమైన విడుదల తేదీని ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఆ మధ్య ఏదో ఫంక్షన్ లో నిర్మాత ఏఎం రత్నం క్యాజువల్ గా మార్చి 30 అన్నారు కానీ ఎలా చూసినా అది మీట్ కావడం కష్టమే.
గాంధీ జయంతి సందర్భంగా ప్లాన్ చేసుకున్న పవన్ పాదయాత్ర వాయిదా వేసుకోవడం వీరమల్లుకి కలిసి వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ సమయం అవసరమయ్యే ఇలాంటి గ్రాండియర్స్ కి వీలైనంత త్వరగా షూట్ పూర్తి చేయడం చాలా అవసరం. అందుకే ఇప్పుడు ఆఘమేఘాల మీద షెడ్యూల్స్ ని ప్లాన్ చేసుకున్నారు. ఇదయ్యాక వినోదయ సితం రీమేక్, సుజిత్ తో అనుకున్న మూవీ, సురేందర్ రెడ్డికి ఇచ్చిన కమిట్ మెంట్ నెరవేరుస్తారా లేదా చూడాలి. వీటి సంగతేమో కానీ అన్నిటికన్నా ముందు వరుసలో ఉన్న భవదీయుడు భగత్ సింగ్ ఒక్కటి చేసి నెక్స్ట్ జనసేనతో బిజీ కావాలని అభిమానుల ఆకాంక్ష. మరి పవన్ మనసులో ఏముందో
This post was last modified on September 30, 2022 7:38 pm
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో వారమే సమయం ఉంది. ఈ ఎన్నికలు ఇటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్కు, అటు ప్రతిపక్ష…
‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్టో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో అత్యంత ఆదరణ పొందిన…
ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా జగన్ ప్రబుత్వం అమలు చేస్తున్న పథకాలను ఎన్నికల…
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ 'ప్రజాగళం'లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో…
మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…