పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్న హరిహర వీరమల్లు తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతుందో అర్థం కాక అయోమయంలో ఉన్న అభిమానులకు ఎట్టకేలకు టెన్షన్ తగ్గించేశారు. అక్టోబర్ మూడో వారంలో స్టార్ట్ చేయబోతున్న కొత్త షెడ్యూల్ కు సంబంధించి ఒక వర్క్ షాప్ పెట్టి దాని తాలూకు వీడియోని సోషల్ మీడియాలో కూడా చేశారు. మంచి అవుట్ ఫిట్ తో చాలా గ్లామరస్ గా కనిపిస్తున్న పవన్ ని చూసి ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. సో ఇది మొదలైతే నాన్ స్టాప్ గా పూర్తయ్యేవరకు కొనసాగనుంది. ఆ మేరకు దర్శకుడు క్రిష్ పక్కా ప్లానింగ్ రెడీ చేసుకున్నారు.
ఈ వర్క్ షాప్ లో యూనిట్ సభ్యులతో పాటు కొందరు యాక్టర్లు కూడా పాల్గొనడం విశేషం. రఘుబాబు, సుబ్బరాజు తదితరులు ఇందులో కనిపించారు. సంభాషణలు, వాటిని డెలివరీ చేయడం గురించి కొన్ని కీలకమైన ఇన్ ఫుట్స్ ని ఇచ్చిపుచ్చుకున్నారు. ఈ మీటింగ్ లో సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి భాగం పంచుకోవడం విశేషం. 2023 వేసవిని టార్గెట్ చేసుకున్న హరిహర వీరమల్లు ఖఛ్చితమైన విడుదల తేదీని ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఆ మధ్య ఏదో ఫంక్షన్ లో నిర్మాత ఏఎం రత్నం క్యాజువల్ గా మార్చి 30 అన్నారు కానీ ఎలా చూసినా అది మీట్ కావడం కష్టమే.
గాంధీ జయంతి సందర్భంగా ప్లాన్ చేసుకున్న పవన్ పాదయాత్ర వాయిదా వేసుకోవడం వీరమల్లుకి కలిసి వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ సమయం అవసరమయ్యే ఇలాంటి గ్రాండియర్స్ కి వీలైనంత త్వరగా షూట్ పూర్తి చేయడం చాలా అవసరం. అందుకే ఇప్పుడు ఆఘమేఘాల మీద షెడ్యూల్స్ ని ప్లాన్ చేసుకున్నారు. ఇదయ్యాక వినోదయ సితం రీమేక్, సుజిత్ తో అనుకున్న మూవీ, సురేందర్ రెడ్డికి ఇచ్చిన కమిట్ మెంట్ నెరవేరుస్తారా లేదా చూడాలి. వీటి సంగతేమో కానీ అన్నిటికన్నా ముందు వరుసలో ఉన్న భవదీయుడు భగత్ సింగ్ ఒక్కటి చేసి నెక్స్ట్ జనసేనతో బిజీ కావాలని అభిమానుల ఆకాంక్ష. మరి పవన్ మనసులో ఏముందో
This post was last modified on September 30, 2022 7:38 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…