పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్న హరిహర వీరమల్లు తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతుందో అర్థం కాక అయోమయంలో ఉన్న అభిమానులకు ఎట్టకేలకు టెన్షన్ తగ్గించేశారు. అక్టోబర్ మూడో వారంలో స్టార్ట్ చేయబోతున్న కొత్త షెడ్యూల్ కు సంబంధించి ఒక వర్క్ షాప్ పెట్టి దాని తాలూకు వీడియోని సోషల్ మీడియాలో కూడా చేశారు. మంచి అవుట్ ఫిట్ తో చాలా గ్లామరస్ గా కనిపిస్తున్న పవన్ ని చూసి ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. సో ఇది మొదలైతే నాన్ స్టాప్ గా పూర్తయ్యేవరకు కొనసాగనుంది. ఆ మేరకు దర్శకుడు క్రిష్ పక్కా ప్లానింగ్ రెడీ చేసుకున్నారు.
ఈ వర్క్ షాప్ లో యూనిట్ సభ్యులతో పాటు కొందరు యాక్టర్లు కూడా పాల్గొనడం విశేషం. రఘుబాబు, సుబ్బరాజు తదితరులు ఇందులో కనిపించారు. సంభాషణలు, వాటిని డెలివరీ చేయడం గురించి కొన్ని కీలకమైన ఇన్ ఫుట్స్ ని ఇచ్చిపుచ్చుకున్నారు. ఈ మీటింగ్ లో సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి భాగం పంచుకోవడం విశేషం. 2023 వేసవిని టార్గెట్ చేసుకున్న హరిహర వీరమల్లు ఖఛ్చితమైన విడుదల తేదీని ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఆ మధ్య ఏదో ఫంక్షన్ లో నిర్మాత ఏఎం రత్నం క్యాజువల్ గా మార్చి 30 అన్నారు కానీ ఎలా చూసినా అది మీట్ కావడం కష్టమే.
గాంధీ జయంతి సందర్భంగా ప్లాన్ చేసుకున్న పవన్ పాదయాత్ర వాయిదా వేసుకోవడం వీరమల్లుకి కలిసి వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ సమయం అవసరమయ్యే ఇలాంటి గ్రాండియర్స్ కి వీలైనంత త్వరగా షూట్ పూర్తి చేయడం చాలా అవసరం. అందుకే ఇప్పుడు ఆఘమేఘాల మీద షెడ్యూల్స్ ని ప్లాన్ చేసుకున్నారు. ఇదయ్యాక వినోదయ సితం రీమేక్, సుజిత్ తో అనుకున్న మూవీ, సురేందర్ రెడ్డికి ఇచ్చిన కమిట్ మెంట్ నెరవేరుస్తారా లేదా చూడాలి. వీటి సంగతేమో కానీ అన్నిటికన్నా ముందు వరుసలో ఉన్న భవదీయుడు భగత్ సింగ్ ఒక్కటి చేసి నెక్స్ట్ జనసేనతో బిజీ కావాలని అభిమానుల ఆకాంక్ష. మరి పవన్ మనసులో ఏముందో
This post was last modified on September 30, 2022 7:38 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…