రెబెల్ స్టార్ కృష్ణంరాజు సంతాపసభను పురస్కరించుకుని.. మొగల్తూరులో ప్రభాస్ ఓ రేంజు లంచ్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ లంచ్ లో పెట్టిన రకరకాలు డిష్ లు, వాటి రేట్లు ఇప్పుడు టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయాయ్. సరే మన ప్రభాస్ రేంజి అది అని చాలామంది ఎంజాయ్ చేస్తుంటే, కొంతమంది ట్రోలర్లు మాత్రం దీన్నో ఫ్యాన్ వార్ గా మార్చేశారు. ఏకంగా ఇప్పుడు అది మెగా వర్సెస్ నందమూరి వార్ అన్నట్లు తయారైంది.
ప్రభాస్ అంతటి రిచ్ భోజనం పెట్టాడు సరే.. వేల కోట్లు సంపాదించుకున్న మీ హీరో కనీసం కాఫీ నీళ్ళు కూడా పొయ్యలేందంటూ ఒక వర్గం కామెంట్ చెయ్యగా.. మరి మీ హీరో ఏం చేశాడు అంటూ మరో వర్గం బ్యాటింగ్ స్టార్ట్ చేసింది. అంతటితో ఆగకుండా.. కొన్ని మార్ఫింగ్ ఫోటోలు తయారుచేసి.. ఎప్పుడో చిరంజీవి లంచ్ చేస్తున్న పిక్ ఒకటి బయటకు తీసి.. అన్నేసి డిష్ లు వండారని తెలిసి ఆపుకోలేక చిరంజీవి లంచ్ కి వెళ్ళిపోయారంటూ కొంతమంది కామెంట్లు చేశారు. దీనికి మరో వర్గం అయితే.. జూనియర్ ఎన్టీఆర్ ఏకంగా భోజనం చేసి క్యారేజ్ కూడా పట్టుకెళ్ళాడని కామెంట్లు చేస్తున్నారు.
ట్రోలింగ్ అనేది కాస్త పాజిటివ్ గా ఉంటే ఓకే కాని, మరీ ఈ లెవెల్లో ఉంటే చూసేవారికి చదివేవారికి కూడా ఏహ్యంగా అనిపిస్తుంది. ఒక హీరోకు వీరాభిమానులు అయినంత మాత్రాన మరో హీరోను కించపరచాల్సిన అవసరమేలేదు. మా హీరో సినిమా వందరోజులు ఆడింది, మా హీరో పలానా రికార్డులు కొట్టాడు అంటూ ఫ్యాన్స్ చెబుతుంటే ఒకప్పుడు సదరు హీరో మీద వాళ్ళ గుండెల్లో ఉన్న ప్రేమే కనిపించేది. కాని ఇప్పుడు పక్క హీరోలను ట్రోల్ చేస్తుంటే మాత్రం.. వీళ్ళ హార్టులో ఇంతటి నెగెటివిటీ ఉందా అనిపిస్తోంది.
This post was last modified on September 30, 2022 12:12 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…