రెబెల్ స్టార్ కృష్ణంరాజు సంతాపసభను పురస్కరించుకుని.. మొగల్తూరులో ప్రభాస్ ఓ రేంజు లంచ్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ లంచ్ లో పెట్టిన రకరకాలు డిష్ లు, వాటి రేట్లు ఇప్పుడు టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయాయ్. సరే మన ప్రభాస్ రేంజి అది అని చాలామంది ఎంజాయ్ చేస్తుంటే, కొంతమంది ట్రోలర్లు మాత్రం దీన్నో ఫ్యాన్ వార్ గా మార్చేశారు. ఏకంగా ఇప్పుడు అది మెగా వర్సెస్ నందమూరి వార్ అన్నట్లు తయారైంది.
ప్రభాస్ అంతటి రిచ్ భోజనం పెట్టాడు సరే.. వేల కోట్లు సంపాదించుకున్న మీ హీరో కనీసం కాఫీ నీళ్ళు కూడా పొయ్యలేందంటూ ఒక వర్గం కామెంట్ చెయ్యగా.. మరి మీ హీరో ఏం చేశాడు అంటూ మరో వర్గం బ్యాటింగ్ స్టార్ట్ చేసింది. అంతటితో ఆగకుండా.. కొన్ని మార్ఫింగ్ ఫోటోలు తయారుచేసి.. ఎప్పుడో చిరంజీవి లంచ్ చేస్తున్న పిక్ ఒకటి బయటకు తీసి.. అన్నేసి డిష్ లు వండారని తెలిసి ఆపుకోలేక చిరంజీవి లంచ్ కి వెళ్ళిపోయారంటూ కొంతమంది కామెంట్లు చేశారు. దీనికి మరో వర్గం అయితే.. జూనియర్ ఎన్టీఆర్ ఏకంగా భోజనం చేసి క్యారేజ్ కూడా పట్టుకెళ్ళాడని కామెంట్లు చేస్తున్నారు.
ట్రోలింగ్ అనేది కాస్త పాజిటివ్ గా ఉంటే ఓకే కాని, మరీ ఈ లెవెల్లో ఉంటే చూసేవారికి చదివేవారికి కూడా ఏహ్యంగా అనిపిస్తుంది. ఒక హీరోకు వీరాభిమానులు అయినంత మాత్రాన మరో హీరోను కించపరచాల్సిన అవసరమేలేదు. మా హీరో సినిమా వందరోజులు ఆడింది, మా హీరో పలానా రికార్డులు కొట్టాడు అంటూ ఫ్యాన్స్ చెబుతుంటే ఒకప్పుడు సదరు హీరో మీద వాళ్ళ గుండెల్లో ఉన్న ప్రేమే కనిపించేది. కాని ఇప్పుడు పక్క హీరోలను ట్రోల్ చేస్తుంటే మాత్రం.. వీళ్ళ హార్టులో ఇంతటి నెగెటివిటీ ఉందా అనిపిస్తోంది.
This post was last modified on September 30, 2022 12:12 pm
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…
దేశంలో గత కొంతకాలం నుంచి బీజేపీ హవా నడుస్తోంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఆశించిన మేర విజయాలు…