Movie News

వందల కోట్లు కుమ్మరిస్తున్న నెట్ ఫ్లిక్స్

విపరీతమైన పోటీ నెలకొన్న ఓటిటి ప్రపంచంలో వరల్డ్ వైడ్ నెంబర్ వన్ గా ఉన్న నెట్ ఫ్లిక్స్ ఇండియాలో మాత్రం తడబడుతూనే ఉంది. మొదట్లో దీని ధరలు మధ్యతరగతి ప్రేక్షకులు భరించేలా లేవనే ఫిర్యాదు బలంగా వినిపించేది. ప్రైమ్ లాంటి భారీ కంటెంట్ ఉన్న ప్లాట్ ఫార్మ్ ఏడాదికి పదిహేను వందలు తీసుకుంటూ నలుగురు పంచుకునే వెసులుబాటు ఇస్తుండగా అదే సౌకర్యం పొందాలంటే నెట్ ఫ్లిక్స్ కు మాత్రం చాలా ఎక్కువ మొత్తం కట్టాలి. అందుకే గత ఏడాది ఈ సంస్థకు మన దేశపు ఆర్థిక ఫలితాలు తీవ్ర నిరాశను కలిగించాయి. యుద్ధ ప్రాతిపదికన రేట్లు తగ్గించింది కానీ పూర్తిగా కోలుకోలేదు .

తానేం మిస్ అవుతోందో ఆలస్యంగా అయినా నెట్ ఫ్లిక్స్ ఎట్టకేలకు గుర్తించింది. రీజనల్ కంటెంట్ ని నిర్లక్ష్యం చేస్తూ కేవలం ఇంటర్నేషనల్ మూవీస్, వెబ్ సిరీస్ ఇచ్చినంత మాత్రాన సగటు ఇండియన్ వ్యూయర్ ఆసక్తి చూపించడని అర్థమైపోయింది. అందుకే ఇప్పుడు బడ్జెట్ లెక్కలు వేసుకోకుండా భారీ ప్రోజెక్టులను ఏకమొత్తంగా కొనేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ ని 57 కోట్లకు, వాల్తేర్ వీరయ్యను 50 కోట్లకు డీల్ చేసుకుందనే న్యూస్ ఆల్రెడీ డిజిటల్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇంత భారీ మొత్తంలో చిరు రెండు సినిమాలు ఒకేసారి అమ్మడం ఇదే మొదటిసారి.

ఇక్కడితో అయిపోలేదు. లారెన్స్ చంద్రముఖి 2, రణ్వీర్ సింగ్ నటించిన సర్కస్ లను కనివిని ఎరుగని క్రేజీ ఆఫర్లకు సొంతం చేసుకుంది. షారుఖ్ ఖాన్ జవాన్ ని ఏకంగా రెండు వందల యాభై కోట్లకు ఇచ్చారనే వార్త ఇతర నిర్మాతలకు కునుకు రానివ్వడం లేదు. ఇవే కాదు కన్నడ, మలయాళంలోనూ ప్యాన్ ఇండియా మూవీస్ ని ఎంత సొమ్మైనా సరే లెక్కచేయకుండా కొనేసుకుంటోంది. ప్రైమ్ కూడా తక్కువ తినలేదు. నువ్వా నేనా అనే రీతిలో ప్రొడ్యూసర్లకు గేలం వేస్తోంది. మొత్తానికి అంతర్జాతీయ సంస్థలు సైతం మన దక్షిణాది సినిమాల విలువను తెలుసుకుంటున్నాయి. మన నిర్మాతలకు అంతకన్నా కావాల్సింది ఏముంది.

This post was last modified on September 28, 2022 10:12 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

49 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago