విపరీతమైన పోటీ నెలకొన్న ఓటిటి ప్రపంచంలో వరల్డ్ వైడ్ నెంబర్ వన్ గా ఉన్న నెట్ ఫ్లిక్స్ ఇండియాలో మాత్రం తడబడుతూనే ఉంది. మొదట్లో దీని ధరలు మధ్యతరగతి ప్రేక్షకులు భరించేలా లేవనే ఫిర్యాదు బలంగా వినిపించేది. ప్రైమ్ లాంటి భారీ కంటెంట్ ఉన్న ప్లాట్ ఫార్మ్ ఏడాదికి పదిహేను వందలు తీసుకుంటూ నలుగురు పంచుకునే వెసులుబాటు ఇస్తుండగా అదే సౌకర్యం పొందాలంటే నెట్ ఫ్లిక్స్ కు మాత్రం చాలా ఎక్కువ మొత్తం కట్టాలి. అందుకే గత ఏడాది ఈ సంస్థకు మన దేశపు ఆర్థిక ఫలితాలు తీవ్ర నిరాశను కలిగించాయి. యుద్ధ ప్రాతిపదికన రేట్లు తగ్గించింది కానీ పూర్తిగా కోలుకోలేదు .
తానేం మిస్ అవుతోందో ఆలస్యంగా అయినా నెట్ ఫ్లిక్స్ ఎట్టకేలకు గుర్తించింది. రీజనల్ కంటెంట్ ని నిర్లక్ష్యం చేస్తూ కేవలం ఇంటర్నేషనల్ మూవీస్, వెబ్ సిరీస్ ఇచ్చినంత మాత్రాన సగటు ఇండియన్ వ్యూయర్ ఆసక్తి చూపించడని అర్థమైపోయింది. అందుకే ఇప్పుడు బడ్జెట్ లెక్కలు వేసుకోకుండా భారీ ప్రోజెక్టులను ఏకమొత్తంగా కొనేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ ని 57 కోట్లకు, వాల్తేర్ వీరయ్యను 50 కోట్లకు డీల్ చేసుకుందనే న్యూస్ ఆల్రెడీ డిజిటల్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇంత భారీ మొత్తంలో చిరు రెండు సినిమాలు ఒకేసారి అమ్మడం ఇదే మొదటిసారి.
ఇక్కడితో అయిపోలేదు. లారెన్స్ చంద్రముఖి 2, రణ్వీర్ సింగ్ నటించిన సర్కస్ లను కనివిని ఎరుగని క్రేజీ ఆఫర్లకు సొంతం చేసుకుంది. షారుఖ్ ఖాన్ జవాన్ ని ఏకంగా రెండు వందల యాభై కోట్లకు ఇచ్చారనే వార్త ఇతర నిర్మాతలకు కునుకు రానివ్వడం లేదు. ఇవే కాదు కన్నడ, మలయాళంలోనూ ప్యాన్ ఇండియా మూవీస్ ని ఎంత సొమ్మైనా సరే లెక్కచేయకుండా కొనేసుకుంటోంది. ప్రైమ్ కూడా తక్కువ తినలేదు. నువ్వా నేనా అనే రీతిలో ప్రొడ్యూసర్లకు గేలం వేస్తోంది. మొత్తానికి అంతర్జాతీయ సంస్థలు సైతం మన దక్షిణాది సినిమాల విలువను తెలుసుకుంటున్నాయి. మన నిర్మాతలకు అంతకన్నా కావాల్సింది ఏముంది.
This post was last modified on September 28, 2022 10:12 pm
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష(ప్రధాన కాదు) నాయకుడు, వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అన్యాయంగా…