ఇండస్ట్రీకి ఎప్పుడో వచ్చినా సత్యదేవ్ లోని అసలైన నటుడు బయటికి వచ్చింది మాత్రం బ్లఫ్ మాస్టర్ తోనే. అదేమీ బ్లాక్ బస్టర్ కాదు కానీ దానికి పెట్టిన బడ్జెట్ కి, రీమేక్ హక్కులకు సరిపడా గిట్టుబాటు చేసుకుంది. అయితే ఆ తర్వాత చేసినవి ఈ విలక్షణ నటుడికి అంతగా అచ్చి రాలేదు. ఒకవైపు తమన్నాతో జంట కట్టిన గుర్తుందా శీతాకాలం విడుదల కోసం నానా కష్టాలు పడుతోంది. డేట్లు మారుతున్నాయి తప్ప థియేటర్లలో ఎప్పుడు వస్తుందో తనకూ తెలియదు. తనకు బ్రేక్ ఇచ్చిన దర్శకుడు గోపి గణేష్ తో ఆ మధ్య చేసిన గాడ్సే డిజాస్టర్ ఇచ్చిన షాక్ అలాంటిది. కృష్ణమ్మ సైతం తేదీ కోసం ఎదురు చూస్తోంది
ఇప్పుడు సత్యదేవ్ కు ఒకే నెలలో రెండు కీలక పరీక్షలు ఎదురు కాబోతున్నాయి. మొదటిది అక్టోబర్ 5న రానున్న గాడ్ ఫాదర్. నెగటివ్ షేడ్స్ లో చిరంజీవిని ఢీ కొట్టే ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఇది. నయనతార భర్తనే పేరే కానీ మంచి విలనిజం ఉంటుంది ఈ పాత్రలో. కొన్ని సీన్లలో మెగాస్టార్ నే ఎదిరించే డైలాగులకు చాలా పేరొస్తుందని ఇప్పటికే టాక్ ఉంది. ఇది క్లిక్ అయితే హిందీలోనూ గుర్తింపు వస్తుంది. సల్మాన్ ఖాన్ క్యామియో చేసినందుకు బాలీవుడ్ లోనూ భారీ ఎత్తున పబ్లిసిటీతో ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి హిట్ కొడితే ఆటోమేటిక్ గా అవకాశాలు పెరుగుతాయి.
రెండోది రామ్ సేతు. అక్షయ్ కుమార్ హీరోగా రూపొందిన ఈ విజువల్ ఫాంటసీ అక్టోబర్ 25న రిలీజ్ కానుంది. విజువల్ ఫాంటసీ బ్యాక్ డ్రాప్ తో అయోధ్య రాముడి సెంటిమెంట్ ని టచ్ చేస్తూ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందించారు. ఎప్పుడూ అక్షయ్ వెన్నంటే ఉండే ఓ ముఖ్యమైన పాత్రను సత్యదేవ్ కి ఇచ్చారు. కార్తికేయ 2 తరహాలో దీనికి మంచి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. టీజర్ ప్రామిసింగ్ గా అనిపించింది. ఒకే దెబ్బకు డబుల్ పిట్టలన్నట్టు గాడ్ ఫాదర్, రామ్ సేతులు సక్సెస్ అయితే తెలుగు హిందీలో సత్యదేవ్ మార్కెట్ మళ్ళీ పుంజుకుంటుంది. వేచి చూడాలి మరి.
This post was last modified on September 27, 2022 9:02 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…