సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే గొప్ప నటుల్లో విక్రమ్ ఒకడు. ఐతే కేవలం నటనలోనే కాదు.. మన చరిత్ర మీద పరిజ్ఞానంలోనూ అతను వన్ ఆఫ్ ద బెస్ట్ అనే విషయం రుజువైంది. మనం తక్కువ చేసుకునే మన చరిత్ర గురించి పొన్నియన్ సెల్వన్ సినిమా ప్రెస్ మీట్లో విక్రమ్ చెప్పిన మాటలు చూసిన ఎవ్వరైనా ఫిదా అవ్వకుండా ఉండలేరు. నిన్నట్నుంచి ఆ వీడియో వైరల్ అవుతోంది. ఇంతకీ విక్రమ్ ఈ వీడియోలో ఏమన్నాడంటే..
‘‘ప్యారిస్ లోని లీనింగ్ టవర్ ఆఫ్ పీసా నిర్మాణంలో లోపం వల్ల బలంగా నిలబడలేక పక్కకు ఒరిగింది. కానీ అది మనకు గొప్పగా అనిపిస్తుంది. దాని ముందు నిలబడి ఫొటోలు దిగుతాం. కానీ మన దగ్గర వేల ఏళ్ల నాటి నిర్మాణాలు ఇప్పటికీ దృఢంగా ఉన్నా వాటి గొప్పదనం మనకు అర్థం కాదు. కనీసం గోడలకు ప్లాస్టింగ్ కూడా చేయకుండానే అవి వేల ఏళ్లు చెక్కు చెదరకుండ ఉండేలా వాటి నిర్మాణం చేపట్టారు మన పూర్వీకులు. ఎన్నో భూకంపాలను తట్టుకుని నిలబడ్డ ఆలయాలు, కోటలు మన దగ్గర ఎన్నో ఉన్నాయి. చోళ రాజులు అద్భుతమైన నిర్మాణాలు చేపట్టారు. ఐదో శతాబ్దంలో అంత అద్భుతమైన నిర్మాణాలు ఎలా చేశారో అర్థం కాదు. ఆ రోజుల్లోనే మన దగ్గర గ్రామ పంచాయితీలకు ఎన్నికలు జరిగాయి. ఎన్నో నిర్మాణాలకు మహిళల పేర్లు పెట్టారు. ఆ రోజుల్లోనే మనకు అంత గొప్ప నాగరికత ఉంది.
ఇప్పుడు ఎంతో నాగరికమైన దేశంగా చెప్పుకునే అమెరికాను కొలంబస్ కనిపెట్టడానికి 500 ఏళ్ల ముందే మన దగ్గర గొప్ప నాగరికత, సంస్కృతి ఉన్నాయి. దాన్ని చూసి మనమంతా గర్వపడాలి. మన చరిత్ర గురించి అందరూ తెలుసుకోవాలి. ఇక్కడ సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అంటూ తేడాలు చూపించకూడదు. మనందరం ఇండియన్స్. మన చరిత్రను చూసి మనందరం గర్వించాలి. ఆ చరిత్రను అందరూ తెలుసుకోవాలి’’ అంటూ చోళరాజుల గురించి తీసిన ‘పొన్నియన్ సెల్వన్’ను అందరూ ఆదరించాలని పిలుపునిచ్చాడు విక్రమ్. ఏదో సినిమా కోసమని కాకుండా మన హిస్టరీ గురించి చాలా నిజాయితీగా, గొప్పగా చెప్పిన విక్రమ్ మీద సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది.
This post was last modified on September 25, 2022 4:31 pm
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…