ఇస్మార్ట్ శంకర్ మూవీతో లేక లేక కెరీర్లో ఒక లైఫ్ లైన్ దొరికింది పూరి జగన్నాథ్ కు. గత దశాబ్ద కాలంలో తన సొంత కథతో పూరి కొట్టిన ఏకైక హిట్ ఇది. దీంతో అభిమానులకు మళ్లీ ఆయన మీద గురి కుదిరింది. విజయ్ దేవరకొండ లాంటి సెన్సేషనల్ హీరో ఆయన్ని నమ్మి సినిమా చేశాడు. కానీ ఇటు అభిమానులు, అటు విజయ్ నమ్మకాన్ని పూరి నిలబెట్టుకోలేకపోయాడు. లైగర్ మూవీతో అందరినీ తీవ్ర నిరాశకు గురి చేశాడు.
సినిమా యావరేజ్ అనే స్థాయిలో ఉన్నా విజయ్ తన పెర్ఫామెన్స్ తో దాన్ని మరో స్థాయికి తీసుకెళ్లేవాడు. కానీ పూరి మరీ పేలవమైన సినిమా తీయడంతో విజయ్ పెర్ఫామెన్స్ కూడా సినిమాను నిలబెట్టలేకపోయింది. ఈ దెబ్బతో పూరి పరిస్థితి ఘోరంగా తయారైంది. పెద్ద స్టార్ల సంగతి పక్కన పెట్టేస్తే మిడ్ రేంజ్ హీరోలు కూడా ఆయనకు డేట్లు ఇవ్వడం కష్టంగానే కనిపిస్తోంది.
ఈ స్థితిలో తన కొడుకు ఆకాశ్ తో పూరి ఓ సినిమా చేయబోతున్నట్లుగా ఇటీవల ప్రచారం జరిగింది. దాని గురించి క్లారిటీ లేదు. కానీ ఈలోపు పూరి చూపు రామ్ మీద పడిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పూరి వరుస ఫ్లాపుల్లో కొట్టుమిట్టాడుతున్న టైంలో ఆయన్ని నమ్మి ఇస్మార్ట్ శంకర్ చేశాడు రామ్. ఆ సినిమా ఊహించిన స్థాయిలో బ్లాక్ బస్టర్ అయింది. ఇద్దరి కెరీర్లకూ ఊపు తెచ్చింది. ఈ సినిమాకు సీక్వెల్ చేస్తామని గతంలో ఇద్దరూ ప్రకటించారు. కానీ తర్వాత వేర్వేరు ప్రాజెక్టులతో బిజీ అయ్యారు. ఇప్పుడు పూరీకి ఇంకే హీరో దొరికే పరిస్థితి లేదు.
ఇటీవల ది వారియర్ తో గట్టి ఎదురు దెబ్బ తిన్న రామ్.. బోయపాటి శ్రీను సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈలోపు పూరి అతణ్ని కలిశాడని.. తనతో సినిమా చేసేందుకు కమిట్మెంట్ తీసుకున్నాడని అంటున్నారు. రామ్ తో కుదిరినపుడు పూరి సినిమా చేయాలనుకుంటున్నాడని.. ఇస్మార్ట్ శంకర్-2 కోసమే ఇద్దరూ జట్టు కట్టే అవకాశాలున్నాయని అంటున్నారు.
This post was last modified on September 23, 2022 3:12 pm
ఐతే అతివృష్టి లేదంటే అనావృష్టి అన్నట్లే ఉంటుంది బాక్సాఫీస్ వ్యవహారం. సంక్రాంతికి ఒకేసారి అయిదు సినిమలు రిలీజయ్యాయి. కానీ తర్వాతి…
రెండు నెలల కిందట రిలీజైన దురంధర్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవలం…
బుల్లితెరపై ఘన చరిత్ర ఉన్న ఈటీవీ ప్రభాకర్ నట వారసత్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్రహాస్.. తన…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని.. పంది, ఆవు కొవ్వులను కూడా వినియోగించారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో ప్రత్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్దగా కేటాయింపులు ఏమీ…