Movie News

రామ్ వైపు పూరి చూపు?

ఇస్మార్ట్ శంకర్ మూవీతో లేక లేక కెరీర్లో ఒక లైఫ్ లైన్ దొరికింది పూరి జగన్నాథ్ కు. గత దశాబ్ద కాలంలో తన సొంత కథతో పూరి కొట్టిన ఏకైక హిట్ ఇది. దీంతో అభిమానులకు మళ్లీ ఆయన మీద గురి కుదిరింది. విజయ్ దేవరకొండ లాంటి సెన్సేషనల్ హీరో ఆయన్ని నమ్మి సినిమా చేశాడు. కానీ ఇటు అభిమానులు, అటు విజయ్ నమ్మకాన్ని పూరి నిలబెట్టుకోలేకపోయాడు. లైగర్ మూవీతో అందరినీ తీవ్ర నిరాశకు గురి చేశాడు.

సినిమా యావరేజ్ అనే స్థాయిలో ఉన్నా విజయ్ తన పెర్ఫామెన్స్ తో దాన్ని మరో స్థాయికి తీసుకెళ్లేవాడు. కానీ పూరి మరీ పేలవమైన సినిమా తీయడంతో విజయ్ పెర్ఫామెన్స్ కూడా సినిమాను నిలబెట్టలేకపోయింది. ఈ దెబ్బతో పూరి పరిస్థితి ఘోరంగా తయారైంది. పెద్ద స్టార్ల సంగతి పక్కన పెట్టేస్తే మిడ్ రేంజ్ హీరోలు కూడా ఆయనకు డేట్లు ఇవ్వడం కష్టంగానే కనిపిస్తోంది.

ఈ స్థితిలో తన కొడుకు ఆకాశ్ తో పూరి ఓ సినిమా చేయబోతున్నట్లుగా ఇటీవల ప్రచారం జరిగింది. దాని గురించి క్లారిటీ లేదు. కానీ ఈలోపు పూరి చూపు రామ్ మీద పడిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పూరి వరుస ఫ్లాపుల్లో కొట్టుమిట్టాడుతున్న టైంలో ఆయన్ని నమ్మి ఇస్మార్ట్ శంకర్ చేశాడు రామ్. ఆ సినిమా ఊహించిన స్థాయిలో బ్లాక్ బస్టర్ అయింది. ఇద్దరి కెరీర్లకూ ఊపు తెచ్చింది. ఈ సినిమాకు సీక్వెల్ చేస్తామని గతంలో ఇద్దరూ ప్రకటించారు. కానీ తర్వాత వేర్వేరు ప్రాజెక్టులతో బిజీ అయ్యారు. ఇప్పుడు పూరీకి ఇంకే హీరో దొరికే పరిస్థితి లేదు.

ఇటీవల ది వారియర్ తో గట్టి ఎదురు దెబ్బ తిన్న రామ్.. బోయపాటి శ్రీను సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈలోపు పూరి అతణ్ని కలిశాడని.. తనతో సినిమా చేసేందుకు కమిట్మెంట్ తీసుకున్నాడని అంటున్నారు. రామ్ తో కుదిరినపుడు పూరి సినిమా చేయాలనుకుంటున్నాడని.. ఇస్మార్ట్ శంకర్-2 కోసమే ఇద్దరూ జట్టు కట్టే అవకాశాలున్నాయని అంటున్నారు.

This post was last modified on September 23, 2022 3:12 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

మోడీని మెస్మరైజ్ చేసిన లోకేష్

రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన కూటమి పార్టీల‌(జ‌న‌సేన‌-బీజేపీ-టీడీపీ) ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ 'ప్ర‌జాగ‌ళం'లో చంద్ర‌బాబు పాల్గొన లేక పోయారు. ఆయ‌న వేరే స‌భ‌లో…

2 hours ago

క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా మారితే

మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…

3 hours ago

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

4 hours ago

వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…

4 hours ago

రాజ్ తరుణ్ నిర్మాతల భలే ప్లాన్

కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…

5 hours ago

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

7 hours ago