20 ఏళ్ల ముందు నందమూరి బాలకృష్ణ, వి.వి.వినాయక్ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. చెన్నకేశవరెడ్డి. ఆది లాంటి బ్లాక్బస్టర్తో దర్శకుడిగా అరంగేట్రం చేసిన వినాయక్ దర్శకత్వంలో నరసింహనాయుడు లాంటి బ్లాక్బస్టర్ కొట్టి ఊపుమీదున్న బాలయ్య సినిమా చేస్తున్నాడనేసరికి భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇలాంటి క్రేజీ ప్రాజెక్టులో ఓ పాత్ర చేయమని అప్పటి కథానాయిక లయను దర్శకుడు వినాయక్ అడిగితే.. ఆమె చాలా హర్టయిందట. కన్నీళ్లు కూడా పెట్టుకుందట. అందుక్కారణం.. బాలయ్యకు సోదరిగా నటించమని వినాయక్ అడగడమేనట. ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లడానికి బాలయ్య సోదరి పాత్రకు లయ లాంటి అమాయకంగా కనిపించే అమ్మాయి అయితే బాగుంటుందని వినాయక్కు అనిపించి.. రామోజీ ఫిలిం సిటీలో ఒక సినిమా చిత్రీకరణలో ఉన్న లయను కలిసి విషయం చెప్పాడట.
ఐతే బాలకృష్ణ సరసన కథానాయిక పాత్రకు కాకుండా, చెల్లెలి పాత్రకు తనను అడగడంతో లయ నొచ్చుకుందట. తెలుగు హీరోయిన్లంటే ఎందుకు అందరూ తక్కువగా చూస్తారు, మేం హీరోయిన్లుగా పనికిరామా, చెల్లెలు పాత్రలకే సూటవుతామా అంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ ఆవేదన వ్యక్తం చేసిందట. ఐతే తన ఉద్దేశం అది కాదని, ఈ పాత్రకు మీరు బాగా సూటవుతారనే ఉద్దేశంతో అడిగానని, మరోలా అనుకోవద్దని చెప్పాడట. మీరు హీరోయిన్గా వేరే సినిమా చేద్దాం అని చెప్పి వచ్చేశాడట వినాయక్. తర్వాత ఈ పాత్రకు తమిళ నటి దేవయానిని అడగ్గా.. ఆమె వెంటనే ఒప్పుకున్నారట.
మరోవైపు టబు చేసిన పెద్ద బాలయ్య భార్య పాత్రకు సౌందర్యను అడగ్గా.. తల్లి పాత్ర చేస్తే తర్వాత అన్నీ అలాంటివే వస్తాయని, ఇప్పుడే ఈ పాత్ర వద్దని సున్నితంగా తిరస్కరించిందట. టబును అడగ్గా ఆమె వెంటనే ఓకే చేసిందని వినాయక్ తెలిపాడు. చెన్నకేశవరెడ్డి 20వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 24న రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున స్పెషల్ షోలు పడబోతున్న సంగతి తెలిసిందే.
This post was last modified on September 23, 2022 9:26 am
తెలుగు సినిమా స్థాయి ఇంటర్నేషనల్ లెవెల్ కి చేరుకుందని ఒకవైపు మురిసిపోతూనే, ఇంకోవైపు చాలా విషయాల్లో ఆందోళన కలిగిస్తున్న పరిణామాలు…
శ్రీకాకుళం జిల్లా వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును జైల్లో పరామర్శించేందుకు వెళ్లిన వైసీపీ అధినేత జగన్.. అప్పలరాజును…
రాష్ట్రంలో ఎవరి దయాదాక్షిణ్యాలపైనా తాను ముఖ్యమంత్రిని కాలేదని.. 4 కోట్ల మంది ఓటర్లు ఓటేసి తనను గెలిపించుకున్నారని.. వారి ఆశీర్వాదం,…
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి... పాలిటిక్స్ తో పాటు ఇతరత్రా అంశాలపైనా ఓ రేంజి అవగాహన కలిగిన నేతగా…
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తనయుడు ఆరవ్ యాక్సిడెంట్ చేయడంతో దానయ్య అనే గొర్రెల కాపరి మృతి చెందిన సంగతి…
తెలుగులో గత కొన్నేళ్లలో వచ్చిన ఉత్తమ ప్రేమకథా చిత్రాల్లో ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ ఒకటి. ఎక్కువగా అగ్రెసివ్ క్యారెక్టర్లు…