ఈ మధ్య చిన్నా పెద్దా అని తేడా లేకుండా అందరు హీరోలూ పాన్ ఇండియా సినిమాలు చేసేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల అవతల ఏ స్థాయిలో సినిమాలు రిలీజవుతాయి.. వేరే భాషల వాళ్లు అసలు సినిమాను పట్టించుకుంటారా లేదా అని చూడకుండా పాన్ ఇండియా సినిమా అంటూ ఘనంగా అనౌన్స్మెంట్లు అయితే చేసేస్తున్నారు. ఘనంగా పోస్టర్లూ రిలీజ్ చేస్తున్నారు. అయితే వాటిలో కొన్ని మాత్రమే పాన్ ఇండియా స్థాయిలో ప్రభావం చూపుతున్నాయి. ఇటీవల కార్తికేయ-2తో నిఖిల్ అనే చిన్న హీరో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు సంపాదించాడు.
ఇప్పుడు మరో యంగ్ హీరో శ్రీ విష్ణు పాన్ వరల్డ్ మూవీకి రెడీ అవుతుండడం విశేషం. తనకు తాను ఇది పాన్ వరల్డ్ మూవీ అనేమీ చెప్పుకోవట్లేదు కానీ.. నిజంగానే అతను ఆ స్థాయి సినిమా చేయబోతుండడం విశేషం.
ఒక యూరోపియన్ ప్రొడక్షన్ హౌస్ నిర్మించబోయే అంతర్జాతీయ స్థాయి సినిమాలో శ్రీ విష్ణు ముఖ్య పాత్ర పోషించనున్నాడట. ఇది చాలా మంచి ప్రాజెక్ట్, పెద్ద ప్రాజెక్ట్ అంటూ దీని వివరాలు వెల్లడించాడు విష్ణు. ప్రస్తుతం స్క్రిప్టు పనులు జరుగుతున్నాయని, ఇందులో చాలా పెద్ద పెద్ద నటులు కీలక పాత్రలు చేస్తారని.. వాళ్లతో పాటు తనకూ ఓ పాత్ర దక్కిందని.. ఇందులో ఒక్కో పాత్ర ఒక్కో భాష మాట్లాడుతుందని, తాను తెలుగులో మాట్లాడతానని.. ఇది గమ్మత్తయిన సినిమా అని శ్రీ విష్ణు తెలిపాడు.
త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వస్తుందని.. ఇది పాన్ ఇండియా, పాన్ వరల్డ్ మూవీ అని చెప్పనని.. కానీ పెద్ద రేంజ్ మూవీ అని శ్రీ విష్ణు చెప్పాడు. దీంతో పాటు తాను రాజ రాజ చోర దర్శకుడు హాసిత్ గోలితో మైత్రీ మూవీస్ బేనర్లో ఓ సినిమా, హుషారు ఫేమ్ హర్షతో ఓ చిత్రం, సాయి అనే కొత్త దర్శకుడితో మరో సినిమా చేయబోతున్నట్లు శ్రీ విష్ణు వెల్లడించాడు.
This post was last modified on September 21, 2022 5:13 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…