ఈ మధ్య చిన్నా పెద్దా అని తేడా లేకుండా అందరు హీరోలూ పాన్ ఇండియా సినిమాలు చేసేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల అవతల ఏ స్థాయిలో సినిమాలు రిలీజవుతాయి.. వేరే భాషల వాళ్లు అసలు సినిమాను పట్టించుకుంటారా లేదా అని చూడకుండా పాన్ ఇండియా సినిమా అంటూ ఘనంగా అనౌన్స్మెంట్లు అయితే చేసేస్తున్నారు. ఘనంగా పోస్టర్లూ రిలీజ్ చేస్తున్నారు. అయితే వాటిలో కొన్ని మాత్రమే పాన్ ఇండియా స్థాయిలో ప్రభావం చూపుతున్నాయి. ఇటీవల కార్తికేయ-2తో నిఖిల్ అనే చిన్న హీరో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు సంపాదించాడు.
ఇప్పుడు మరో యంగ్ హీరో శ్రీ విష్ణు పాన్ వరల్డ్ మూవీకి రెడీ అవుతుండడం విశేషం. తనకు తాను ఇది పాన్ వరల్డ్ మూవీ అనేమీ చెప్పుకోవట్లేదు కానీ.. నిజంగానే అతను ఆ స్థాయి సినిమా చేయబోతుండడం విశేషం.
ఒక యూరోపియన్ ప్రొడక్షన్ హౌస్ నిర్మించబోయే అంతర్జాతీయ స్థాయి సినిమాలో శ్రీ విష్ణు ముఖ్య పాత్ర పోషించనున్నాడట. ఇది చాలా మంచి ప్రాజెక్ట్, పెద్ద ప్రాజెక్ట్ అంటూ దీని వివరాలు వెల్లడించాడు విష్ణు. ప్రస్తుతం స్క్రిప్టు పనులు జరుగుతున్నాయని, ఇందులో చాలా పెద్ద పెద్ద నటులు కీలక పాత్రలు చేస్తారని.. వాళ్లతో పాటు తనకూ ఓ పాత్ర దక్కిందని.. ఇందులో ఒక్కో పాత్ర ఒక్కో భాష మాట్లాడుతుందని, తాను తెలుగులో మాట్లాడతానని.. ఇది గమ్మత్తయిన సినిమా అని శ్రీ విష్ణు తెలిపాడు.
త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వస్తుందని.. ఇది పాన్ ఇండియా, పాన్ వరల్డ్ మూవీ అని చెప్పనని.. కానీ పెద్ద రేంజ్ మూవీ అని శ్రీ విష్ణు చెప్పాడు. దీంతో పాటు తాను రాజ రాజ చోర దర్శకుడు హాసిత్ గోలితో మైత్రీ మూవీస్ బేనర్లో ఓ సినిమా, హుషారు ఫేమ్ హర్షతో ఓ చిత్రం, సాయి అనే కొత్త దర్శకుడితో మరో సినిమా చేయబోతున్నట్లు శ్రీ విష్ణు వెల్లడించాడు.
This post was last modified on September 21, 2022 5:13 pm
అమెరికాలో గ్రీన్కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…
పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…
AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్తో టీ20 సిరీస్కు ముందు ఢిల్లీలో జరిగిన…