దసరా పోటీ రానురాను మరింత రంజుగా మారేలా కనిపిస్తోంది. ఇప్పటికే గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ క్లాష్ పట్ల ట్రేడ్ విపరీతమైన అంచనాల్లో ఉండగా ఎలాంటి సౌండ్ లేకుండా బెల్లంకొండ గణేష్ స్వాతిముత్యం కూడా బరిలో దిగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తాజాగా మంచు విష్ణు జిన్నా సైతం అక్టోబర్ 5నే టార్గెట్ చేసుకోవాలనే ప్లాన్ లో ఉన్నట్టు లేటెస్ట్ అప్ డేట్. ఇప్పటిదాకా ఈ సినిమాకు సంబంధించి ఒక చిన్న టీజర్, గోలీసోడా లిరికల్ వీడియో మాత్రమే బయటికి వచ్చాయి. ఇంకా ట్రైలర్ కట్, బ్యాలన్స్ పాటలు చాలానే ఉన్నాయి.
ఒకవేళ ఇది నిజమే అయితే మంచు బ్యానర్ పెద్ద రిస్క్ చేస్తున్నట్టే. కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ఇద్దరు సీనియర్లకు ఎదురెళ్ళడం అంత ఈజీ కాదు. పైగా వాటి మీదున్న అంచనాలు వేరే. విష్ణు ముందు నుంచి జిన్నా మీద చాలా కాన్ఫిడెన్స్ చూపిస్తున్నాడు. ఢీని మించిన కెరీర్ బెస్ట్ అవుతుందని హామీ ఇస్తున్నాడు. పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ ల గ్లామర్ ని గట్టిగానే వాడేశారు. ఇదంతా సరే కానీ ఒక విలేజ్ డ్రామాతో ఏదో అద్భుతం జరిగిపోతుందని ఆశిస్తున్న విష్ణు ఒకవేళ పోటీ లేకుండా సోలోగా వేరే టైంలో వచ్చి ఉంటే మంచి ఫలితం దక్కేదేమో కానీ ఇంత కాంపిటీషన్ మధ్య నెగ్గుకురావడం అంత సులభం కాదు.
పండగ సీజన్ లో మూడు నాలుగు సినిమాలకు స్పేస్ ఉంటుంది నో డౌట్. కానీ మార్కెట్ లో హీరోల ఇమేజ్ క్యాలికులేషన్లు ఎక్కువగా ఉంటాయి. అసలే విష్ణు గ్రాఫ్ 2016 తర్వాత అస్సలు బాలేదు. లక్కున్నోడు, గాయత్రి, ఆచారి అమెరికా యాత్ర, ఓటర్, మోసగాళ్లు ఇవన్నీ మాములు డిజాస్టర్లు కాదు. నిర్మాతగానూ సన్ అఫ్ ఇండియా లాంటి ట్రాక్ రికార్డు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ట్రోలింగ్ రూపంలో విపరీతమైన నెగిటివిటీ చుట్టుముట్టిన తరుణంలో జిన్నా ఓ రేంజ్ లో ఉంటేనే ఫలితం దక్కుతుంది. అధికారికంగా ప్రకటించలేదు కానీ ఆల్మోస్ట్ ఫిక్స్ అయ్యారట.
This post was last modified on September 21, 2022 9:38 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…