తమిళంలో వ్యక్తిగతంగా చాలా బ్యాడ్ ఇమేజ్ ఉన్న హీరోల్లో శింబు ఒకడు. హీరోయిన్లతో ప్రేమాయణాల విషయంలోనే కాక వేరే విషయాల్లోనూ అతడి మీద తీవ్ర ఆరోపణలున్నాయి. చాలా వివాదాలతో అతడి పేరు ముడిపడింది గతంలో. ఒక దశలో శింబు మీద నిషేధం పడే పరిస్థితులు కూడా కనిపించాయి. దీనికి తోడు వరుసగా పరాజయాలు కూడా పలకరించడంతో శింబు కెరీర్ తిరోగమనంలో పయనించింది. అందరూ అతణ్ని లైట్ తీసుకోవడం మొదలు పెట్టారు. అభిమానులు సైతం అతడి మీద ఆశలు కోల్పోయిన పరిస్థితి. దీనికి తోడు శింబు నటించిన కొన్ని సినిమాలు సుదీర్ఘ కాలం విడుదలకు నోచుకోకుండా ఆగిపోయాయి. దీంతో అతను ఇక పుంజుకోవడం కష్టమని అంతా ఒక నిర్ణయానికి వచ్చేశారు. కానీ గత రెండేళ్లలో కథ పూర్తిగా మారిపోయింది.
గత ఏడాది సంక్రాంతికి శింబు ఈశ్వరన్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా కోసం బరువు తగ్గడంతో పాటు చాలా కష్టపడ్డాడతను. తొలిసారి పూర్తిగా స్థాయి గ్రామీణ కథలో అతను నటించిన సినిమా మంచి విజయం సాధించింది. ఇక గత ఏడాది నవంబర్లో రిలీజైన మానాడు అయితే పెద్ద బ్లాక్బస్టర్ అయి కూర్చుంది. వెంకట్ ప్రభు డైరెక్ట్ చేసిన ఈ చిత్రం తమిళనాడు బాక్సాఫీస్ను షేక్ చేసింది.
తర్వాత ఓటీటీలో కూడా ఈ సినిమాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగు ప్రేక్షకులను కూడా ఈ సినిమా ఆకట్టుకుంది. శింబు ఇప్పుడు వెందు తనిందద కాదు అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అతడితో విన్నైతాండి వరువాయ (తెలుగులో ఏమాయ చేసావె) లాంటి క్లాసిక్ తీసిన గౌతమ్ మీనన్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ కాంబినేషన్ మీద ఉన్న అంచనాలకు తగ్గట్లే సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. తమిళనాట ఈ బ్లాక్బస్టర్ అయ్యే దిశగా అడుగులేస్తోంది. ప్యాక్డ్ హౌసెస్తో సినిమా నడుస్తోంది. 18 నెలల వ్యవధిలో ఇలా మూడు ఘనవిజయాలు ఖాతాలో వేసుకున్న శింబు పేరు ఇప్పుడు కోలీవుడ్లో మార్మోగుతోంది.
This post was last modified on September 19, 2022 3:58 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…