తమిళంలో వ్యక్తిగతంగా చాలా బ్యాడ్ ఇమేజ్ ఉన్న హీరోల్లో శింబు ఒకడు. హీరోయిన్లతో ప్రేమాయణాల విషయంలోనే కాక వేరే విషయాల్లోనూ అతడి మీద తీవ్ర ఆరోపణలున్నాయి. చాలా వివాదాలతో అతడి పేరు ముడిపడింది గతంలో. ఒక దశలో శింబు మీద నిషేధం పడే పరిస్థితులు కూడా కనిపించాయి. దీనికి తోడు వరుసగా పరాజయాలు కూడా పలకరించడంతో శింబు కెరీర్ తిరోగమనంలో పయనించింది. అందరూ అతణ్ని లైట్ తీసుకోవడం మొదలు పెట్టారు. అభిమానులు సైతం అతడి మీద ఆశలు కోల్పోయిన పరిస్థితి. దీనికి తోడు శింబు నటించిన కొన్ని సినిమాలు సుదీర్ఘ కాలం విడుదలకు నోచుకోకుండా ఆగిపోయాయి. దీంతో అతను ఇక పుంజుకోవడం కష్టమని అంతా ఒక నిర్ణయానికి వచ్చేశారు. కానీ గత రెండేళ్లలో కథ పూర్తిగా మారిపోయింది.
గత ఏడాది సంక్రాంతికి శింబు ఈశ్వరన్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా కోసం బరువు తగ్గడంతో పాటు చాలా కష్టపడ్డాడతను. తొలిసారి పూర్తిగా స్థాయి గ్రామీణ కథలో అతను నటించిన సినిమా మంచి విజయం సాధించింది. ఇక గత ఏడాది నవంబర్లో రిలీజైన మానాడు అయితే పెద్ద బ్లాక్బస్టర్ అయి కూర్చుంది. వెంకట్ ప్రభు డైరెక్ట్ చేసిన ఈ చిత్రం తమిళనాడు బాక్సాఫీస్ను షేక్ చేసింది.
తర్వాత ఓటీటీలో కూడా ఈ సినిమాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగు ప్రేక్షకులను కూడా ఈ సినిమా ఆకట్టుకుంది. శింబు ఇప్పుడు వెందు తనిందద కాదు అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అతడితో విన్నైతాండి వరువాయ (తెలుగులో ఏమాయ చేసావె) లాంటి క్లాసిక్ తీసిన గౌతమ్ మీనన్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ కాంబినేషన్ మీద ఉన్న అంచనాలకు తగ్గట్లే సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. తమిళనాట ఈ బ్లాక్బస్టర్ అయ్యే దిశగా అడుగులేస్తోంది. ప్యాక్డ్ హౌసెస్తో సినిమా నడుస్తోంది. 18 నెలల వ్యవధిలో ఇలా మూడు ఘనవిజయాలు ఖాతాలో వేసుకున్న శింబు పేరు ఇప్పుడు కోలీవుడ్లో మార్మోగుతోంది.
This post was last modified on September 19, 2022 3:58 pm
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…