తమిళంలో వ్యక్తిగతంగా చాలా బ్యాడ్ ఇమేజ్ ఉన్న హీరోల్లో శింబు ఒకడు. హీరోయిన్లతో ప్రేమాయణాల విషయంలోనే కాక వేరే విషయాల్లోనూ అతడి మీద తీవ్ర ఆరోపణలున్నాయి. చాలా వివాదాలతో అతడి పేరు ముడిపడింది గతంలో. ఒక దశలో శింబు మీద నిషేధం పడే పరిస్థితులు కూడా కనిపించాయి. దీనికి తోడు వరుసగా పరాజయాలు కూడా పలకరించడంతో శింబు కెరీర్ తిరోగమనంలో పయనించింది. అందరూ అతణ్ని లైట్ తీసుకోవడం మొదలు పెట్టారు. అభిమానులు సైతం అతడి మీద ఆశలు కోల్పోయిన పరిస్థితి. దీనికి తోడు శింబు నటించిన కొన్ని సినిమాలు సుదీర్ఘ కాలం విడుదలకు నోచుకోకుండా ఆగిపోయాయి. దీంతో అతను ఇక పుంజుకోవడం కష్టమని అంతా ఒక నిర్ణయానికి వచ్చేశారు. కానీ గత రెండేళ్లలో కథ పూర్తిగా మారిపోయింది.
గత ఏడాది సంక్రాంతికి శింబు ఈశ్వరన్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా కోసం బరువు తగ్గడంతో పాటు చాలా కష్టపడ్డాడతను. తొలిసారి పూర్తిగా స్థాయి గ్రామీణ కథలో అతను నటించిన సినిమా మంచి విజయం సాధించింది. ఇక గత ఏడాది నవంబర్లో రిలీజైన మానాడు అయితే పెద్ద బ్లాక్బస్టర్ అయి కూర్చుంది. వెంకట్ ప్రభు డైరెక్ట్ చేసిన ఈ చిత్రం తమిళనాడు బాక్సాఫీస్ను షేక్ చేసింది.
తర్వాత ఓటీటీలో కూడా ఈ సినిమాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగు ప్రేక్షకులను కూడా ఈ సినిమా ఆకట్టుకుంది. శింబు ఇప్పుడు వెందు తనిందద కాదు అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అతడితో విన్నైతాండి వరువాయ (తెలుగులో ఏమాయ చేసావె) లాంటి క్లాసిక్ తీసిన గౌతమ్ మీనన్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ కాంబినేషన్ మీద ఉన్న అంచనాలకు తగ్గట్లే సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. తమిళనాట ఈ బ్లాక్బస్టర్ అయ్యే దిశగా అడుగులేస్తోంది. ప్యాక్డ్ హౌసెస్తో సినిమా నడుస్తోంది. 18 నెలల వ్యవధిలో ఇలా మూడు ఘనవిజయాలు ఖాతాలో వేసుకున్న శింబు పేరు ఇప్పుడు కోలీవుడ్లో మార్మోగుతోంది.
This post was last modified on September 19, 2022 3:58 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…