మంచి పాజిటివ్ టాక్ వచ్చి మొదటి మూడు రోజులు చెప్పుకోదగ్గ వసూళ్లు రాబట్టిన ఒకే ఒక జీవితం ఆ తర్వాత వీక్ డేస్ లో నెమ్మదించింది. కొత్త రిలీజులు ఎక్కువగా ఉండటంతో మళ్ళీ పికప్ ఉండదేమో అనుకున్నారు. అయితే అనూహ్యంగా వచ్చినవేవీ కనీస స్థాయిలో మెప్పించేలా లేకపోవడంతో శర్వా సినిమాకు మళ్ళీ కలెక్షన్లు పెరిగాయి. ముఖ్యంగా ఆదివారం చాలా చోట్ల ఫుల్స్ పడటం దానికి సంకేతంగా చెప్పుకోవచ్చు. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని కీలక నగరాలు, పట్టణాలు ఊహించని ఆక్యుపెన్సీని నమోదు చేశాయి. బాగా డల్ అయిన బ్రహ్మాస్త్ర సైతం ఒక్కసారిగా ఊపందుకుంది.
అంతో ఇంతో అంచనాలతో వచ్చిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలికి డివైడ్ టాక్ మళ్ళీ రికవర్ అయ్యే సూచనలు కనిపించడం లేదు. నేను మీకు బాగా కావాల్సినవాడినికి నిన్న ఈవెనింగ్ షోల నుంచే డెఫిషిట్లు స్టార్ట్ అయ్యాయని ట్రేడ్ టాక్. ఇక శాకినీ డాకిని మీద జనానికి కనీస ఆసక్తి లేకపోవడం తోడు రెస్పాన్స్ కూడా సోసోగా రావడంతో దాని పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. ఈ నేపథ్యంలో సన్ డే టైం పాస్ కోసం ఒకే ఒక జీవితంనే ఆడియెన్స్ బెస్ట్ ఆప్షన్ గా తీసుకుంటున్నారు. ఇది శర్వానంద్ అనుకోకుండా కలిసి వచ్చిన సానుకూల అంశమే.
ఇంకో అయిదు రోజులు ఈ ఛాన్స్ ని వాడుకోవచ్చు. థియేటర్లకు పబ్లిక్ బాగా రావాలంటే కంటెంట్ ఎంత కీలకమో గత రెండు నెలల బాక్సాఫీసు పరిణామాలు గమనిస్తే చెప్పొచ్చు. పబ్లిసిటీ గిమ్మిక్కులు, ప్రీ రిలీజ్ స్టంట్లు ఎన్ని చేసినా మ్యాటర్ ఉన్న బొమ్మలకే బ్రహ్మరథం పడతామని స్పష్టంగా తీర్పులిస్తున్నారు. ఈ నేపథ్యంలో సాదాసీదా కథలతో తిరస్కారం తప్పదనే వాస్తవం అందరికీ అర్థమవుతోంది. కృష్ణంరాజుగారి హఠాన్మరణం ఆయనకు నివాళి ఇచ్చే కారణంగా ఒకే ఒక జీవితం ప్రమోషన్లకు బ్రేక్ వేసింది కానీ లేదంటే ఇంకొంత రీచ్ ఎక్కువగా ఉండేదన్న కామెంట్లో నిజం లేకపోలేదు.
This post was last modified on September 18, 2022 7:03 pm
నిన్న ఇరుముడి ఓటిటిలో వచ్చేసింది. థియేటర్ రన్ ఇంకా కొనసాగుతున్నప్పటికీ ముందస్తు అగ్రిమెంట్ వల్ల కేవలం 28 రోజుల విండోతో…
తెలంగాణాలోని రైల్వే స్టేషన్ వద్ద చెత్త ఏరుకునే ఒక మహిళ మీద హోం గార్డు చేసిన దౌర్జన్యం తీవ్ర దుమారం…
ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…
నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…
పార్టీ ఏదైనా.. నాయకుడు ఎవరైనా సొంత సామాజిక వర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేకపోతే.. ప్రజాబలం అయినా…
ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…