విక్టరీ వెంకటేష్ అభిమానులకు ఘర్షణతో చాలా స్పెషల్ కనెక్షన్ ఉంది. వెంకీ అంతకు ముందు ఖాకీ డ్రెస్సులో కొన్ని సినిమాలు చేసినప్పటికీ ఇందులో కనిపించినంత సీరియస్ గా స్టైలిష్ గా మరెందులోనూ లేరు. తమిళ బ్లాక్ బస్టర్ కాకాకాకాకు రీమేక్ గా రూపొందిన ఈ కాప్ డ్రామా 2004లో దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ కు టాలీవుడ్ డెబ్యూ ఎంట్రీ. అందుకే ఆయనకూ ఇది స్పెషల్ మూవీగా నిలిచిపోయింది. వచ్చి పద్దెనిమిదేళ్లు అవుతున్నా దానికి సీక్వెల్ కావాలన్న డిమాండ్ ఫ్యాన్స్ నుంచి క్రమం తప్పకుండా వస్తూనే ఉంది కానీ ఆ ఆశలు నెరవేరే సూచనలు కనిపించలేదు.
ఎట్టకేలకు వాటికి గౌతమ్ మీననే చెక్ పెట్టారు. ఘర్షణ కొనసాగింపు కోసం ఇటీవలే వెంకటేష్ ను కలిశానని, సానుకూల స్పందన వచ్చిందని, భవిషత్తులో ఖచ్చితంగా ఎక్స్ పెక్ట్ చేయొచ్చని భరోసా ఇచ్చాడు. అయితే ఇక్కడే ఒక ట్విస్టు ఉంది. ఇంకా స్క్రిప్ట్ వర్క్ అయితే మొదలుపెట్టనేలేదు. త్వరలో స్టార్ట్ చేస్తారట. గౌతమ్ లేటెస్ట్ మూవీ శింబు ది లైఫ్ అఫ్ ముత్తు ప్రమోషన్ల కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయనే ఈ కబుర్లను పంచుకున్నారు. ఇదొక్కటే కాదు కమల్ హాసన్ కు సైతం ల్యాండ్ మార్క్ గా నిలిచిన రాఘవన్ కు సెకండ్ పార్ట్ వచ్చే ఏడాది షురూ చేస్తారట.
ఇదంతా ఒక ఎత్తు అయితే మెగాస్టార్ చిరంజీవితోనూ ఇలాంటి సీరియస్ డ్రామాను తీయాలనే కాంక్షను వెలిబుచ్చారు. నిజానికి ఈ కాంబో మూవీ లవర్స్ ఎప్పుడో కోరుకున్నారు. కానీ సాధ్యపడలేదు. పదే పదే రీమేకులు, రొటీన్ కమర్షియల్ కథలను చేయడం కంటే ఇలాంటి సబ్జెక్టులు చేస్తే చిరుకి కూడా విక్రమ్ హిట్ లిస్ట్ లాగా ఏదైనా కంబ్యాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొంత కాలంగా దర్శకత్వానికి గ్యాప్ ఇస్తూ నటన మీద ఎక్కువ ఫోక్స్ చేసిన గౌతమ్ మీనన్ నిజంగా ఇప్పుడు చెప్పినవన్నీ కార్యరూపంలోకి తీసుకొస్తే చిరు, కమల్, వెంకీలను మరోసారి కిక్ యాస్ యాక్షన్ లో చూడొచ్చు .
This post was last modified on September 18, 2022 4:51 pm
నిన్న ఇరుముడి ఓటిటిలో వచ్చేసింది. థియేటర్ రన్ ఇంకా కొనసాగుతున్నప్పటికీ ముందస్తు అగ్రిమెంట్ వల్ల కేవలం 28 రోజుల విండోతో…
తెలంగాణాలోని రైల్వే స్టేషన్ వద్ద చెత్త ఏరుకునే ఒక మహిళ మీద హోం గార్డు చేసిన దౌర్జన్యం తీవ్ర దుమారం…
ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…
నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…
పార్టీ ఏదైనా.. నాయకుడు ఎవరైనా సొంత సామాజిక వర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేకపోతే.. ప్రజాబలం అయినా…
ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…