విక్టరీ వెంకటేష్ అభిమానులకు ఘర్షణతో చాలా స్పెషల్ కనెక్షన్ ఉంది. వెంకీ అంతకు ముందు ఖాకీ డ్రెస్సులో కొన్ని సినిమాలు చేసినప్పటికీ ఇందులో కనిపించినంత సీరియస్ గా స్టైలిష్ గా మరెందులోనూ లేరు. తమిళ బ్లాక్ బస్టర్ కాకాకాకాకు రీమేక్ గా రూపొందిన ఈ కాప్ డ్రామా 2004లో దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ కు టాలీవుడ్ డెబ్యూ ఎంట్రీ. అందుకే ఆయనకూ ఇది స్పెషల్ మూవీగా నిలిచిపోయింది. వచ్చి పద్దెనిమిదేళ్లు అవుతున్నా దానికి సీక్వెల్ కావాలన్న డిమాండ్ ఫ్యాన్స్ నుంచి క్రమం తప్పకుండా వస్తూనే ఉంది కానీ ఆ ఆశలు నెరవేరే సూచనలు కనిపించలేదు.
ఎట్టకేలకు వాటికి గౌతమ్ మీననే చెక్ పెట్టారు. ఘర్షణ కొనసాగింపు కోసం ఇటీవలే వెంకటేష్ ను కలిశానని, సానుకూల స్పందన వచ్చిందని, భవిషత్తులో ఖచ్చితంగా ఎక్స్ పెక్ట్ చేయొచ్చని భరోసా ఇచ్చాడు. అయితే ఇక్కడే ఒక ట్విస్టు ఉంది. ఇంకా స్క్రిప్ట్ వర్క్ అయితే మొదలుపెట్టనేలేదు. త్వరలో స్టార్ట్ చేస్తారట. గౌతమ్ లేటెస్ట్ మూవీ శింబు ది లైఫ్ అఫ్ ముత్తు ప్రమోషన్ల కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయనే ఈ కబుర్లను పంచుకున్నారు. ఇదొక్కటే కాదు కమల్ హాసన్ కు సైతం ల్యాండ్ మార్క్ గా నిలిచిన రాఘవన్ కు సెకండ్ పార్ట్ వచ్చే ఏడాది షురూ చేస్తారట.
ఇదంతా ఒక ఎత్తు అయితే మెగాస్టార్ చిరంజీవితోనూ ఇలాంటి సీరియస్ డ్రామాను తీయాలనే కాంక్షను వెలిబుచ్చారు. నిజానికి ఈ కాంబో మూవీ లవర్స్ ఎప్పుడో కోరుకున్నారు. కానీ సాధ్యపడలేదు. పదే పదే రీమేకులు, రొటీన్ కమర్షియల్ కథలను చేయడం కంటే ఇలాంటి సబ్జెక్టులు చేస్తే చిరుకి కూడా విక్రమ్ హిట్ లిస్ట్ లాగా ఏదైనా కంబ్యాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొంత కాలంగా దర్శకత్వానికి గ్యాప్ ఇస్తూ నటన మీద ఎక్కువ ఫోక్స్ చేసిన గౌతమ్ మీనన్ నిజంగా ఇప్పుడు చెప్పినవన్నీ కార్యరూపంలోకి తీసుకొస్తే చిరు, కమల్, వెంకీలను మరోసారి కిక్ యాస్ యాక్షన్ లో చూడొచ్చు .
This post was last modified on September 18, 2022 4:51 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…