పేరుకి డబ్బింగ్ సినిమాలంటాం కానీ ఒకప్పుడవి స్ట్రెయిటే అనిపించేంత సహజంగా వాటిలో సంభాషణలు, పాటలు ఉండేవి. ఎంత జాగ్రత్తగా లిప్ సింక్ ని గమనించినా గుర్తుపట్టడం కష్టమనేంత స్థాయిలో రైటర్లు, అనువాద గాత్రదాతలు విపరీతంగా కష్టపడేవారు. సుప్రసిద్ధ రచయిత రాజశ్రీ ఇందులోనే అపార అనుభవం గడించడంతో పాటు ఎందరికో స్ఫూర్తినిచ్చారు. ఆయన దారిలోనే వెన్నెలకంటి తదితరులు మంచి పేరు తెచ్చుకున్నారు. సాంగ్స్ విషయంలోనూ ఏ మాత్రం నిర్లక్ష్యం కనిపించేది కాదు. సాహిత్య విలువలు కొట్టొచ్చినట్టు ఉండేవి.
మణిరత్నం చిత్రాలకు వేటూరి, రామ్ గోపాల్ వర్మ మూవీస్ కి సిరివెన్నెల సీతారామశాస్త్రి లాంటి ఉద్దండులు పాటలు రాసినప్పుడు ఒరిజినల్ కంటే బాగున్నాయనే ఫీలింగ్ కలిగేది. ఇప్పుడు మాత్రం ప్రాస కోసం ప్రయాసలో అసలేం రాస్తున్నారో అర్థం కాని అయోమయం నెలకొంటోంది. ఇటీవలే విడుదలైన పొన్నియన్ సెల్వన్ 1లో సై అనే పాట బాషా ప్రేమికులకు ఆగ్రహం తెప్పిస్తోంది. దీన్ని రాసింది అనంత శ్రీరామ్. గందరగోళుడు, అయోమయుడు లాంటి చిత్ర విచిత్ర పదప్రయోగాలన్నీ ఇందులో చేశారాయన. ఒరిజినల్ పదాలు ఎలా ఉన్నా ఆ అర్థం వచ్చేలా మన బాష వాడాలి కానీ మరీ ఇంతగా కాదు.
ఎవరూ సృష్టించకాపోతే మాటలెలా పుడతాయని మాయాబజార్ లో ఎస్విఆర్ చెప్పినట్టు ఇప్పటి పాటల్లో ఈ సూత్రాన్ని తూచ తప్పకుండా పాటిస్తున్నారు. ఆ మధ్య ఆచార్య నీలాంబరిలో నన్నారి అని వాడటం, సర్కారు వారి పాట కళావతిలో, వరుడు కావలెను దిగుదిగునాగలో వెరైటీగా ఎక్స్ పరిమెంట్లు చేసినప్పుడు కామెంట్లు వచ్చి పడ్డాయి. అయినా నిజంగా వాడుకలో ఉన్న లేదా భాషలో ఉన్న పదాలను వాడుకుంటే తప్పు కాదు. అది విద్వత్తు కూడా. అలా కాకుండా ప్రాస కోసం లేని ప్రయోగాలు చేస్తే భవిష్యత్తు తరాలు ఇదే తెలుగనే ప్రమాదం లేకపోలేదు. అడిగితే అనంతుడు పలురకాలుగా సమర్ధించుకోవచ్చు కానీ ఇది మాత్రం రాంగే.
This post was last modified on September 17, 2022 10:28 pm
ఏపీలో కూటమి ప్రభుత్వం చేసే ఖర్చులు, తీసుకునే నిర్ణయాలను సమీక్షించి.. నిర్ణయం తీసుకునేందుకు ప్రత్యేకంగా మూడు కమిటీలు ఉంటాయి. ఇది…
ఏపీలో కూటమి ప్రభుత్వం పాలన ప్రారంభించి.. ఏడు మాసాలు పూర్తయింది. ఈ నేపథ్యంలో ప్రజలు ఏమనుకుంటున్నారు? ఫీడ్ బ్యాక్ ఏంటి?…
పాతికేళ్ల క్రితం 2001 సంవత్సరంలో ఇండస్ట్రీకి వచ్చిన శ్రియ టాలీవుడ్ అగ్ర హీరోలందరితోనూ ఆడిపాడింది. చిరంజీవి, బాలకృష్ణతో మొదలుపెట్టి ప్రభాస్,…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్.. లండన్ నుంచి ఇలా వచ్చారో లేదో.. కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు,…
జూనియర్ ఎన్టీఆర్ తన ఫ్యాన్స్ ని కలుసుకోవడానికి త్వరలోనే ఒక వేడుక ఏర్పాటు చేస్తానని, అప్పటిదాకా ఓపిగ్గా ఎదురు చూడమని…
బెంగళూరులో ఇటీవల అరెస్టైన ఓ దొంగ కథ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. 37 ఏళ్ల పంచాక్షరి స్వామి అనే…