కొత్తగా అంత పేరున్న సినిమాలేవీ రిలీజ్ కాకుంటే, కొత్తగా విడుదలైన సినిమాలకు సరైన టాక్ లేకుంటే.. బాక్సాఫీస్ దగ్గర పాత చిత్రాలు అడ్వాంటేజ్ తీసుకోవడం మామూలే. కానీ బాలీవుడ్ మూవీ బ్రహ్మాస్త్ర ఈ అడ్వాంటేజీని పెద్దగా ఉపయోగించుకుంటున్నట్లుగా కనిపించడం లేదు. ఈ నెల 9న రిలీజైన బ్రహ్మాస్త్ర డివైడ్ టాక్తోనూ భారీ ఓపెనింగ్స్ తెచ్చుకుంది. కానీ దాని ప్రతాపం అంతా తొలి వీకెండ్కే పరిమితం అయింది.
సోమవారం నుంచి సినిమా డల్లయిపోయింది. వసూళ్లు ఒక్కసారిగా పడిపోయాయి. వీక్ డేస్ అంతా నామమాత్రమైన వసూళ్లు రాబట్టింది. ఐతే వీకెండ్ వచ్చాక సినిమా పుంజుకుంటుందని ఆశించారు. కానీ పరిస్థితులు బాగా కలిసొచ్చినా సరే.. సినిమా అనుకున్న స్థాయిలో పెర్పామ్ చేయట్లేదు.
ఈ వీకెండ్లో హిందీలో చెప్పుకోదగ్గ సినిమాలేవీ రిలీజ్ కాలేదు. విడుదలైన వాటిని కూడా అక్కడి జనం పట్టించుకోవట్లేదు. ఇక తెలుగు విషయానికి వస్తే ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, మీకు నేను బాగా కావాల్సిన వాడిని, శాకిని డాకిని చిత్రాల్లో ఏవీ పాజిటివ్ టాక్ తెచ్చుకోలేదు. మిగతా సినిమాలను జనం అసలే పట్టించుకోలేదు. దీంతో రెండో వారం కూడా అటు హిందీలో, ఇటు తెలుగులో బాక్సాఫీస్ లీడర్ బ్రహ్మాస్త్రనే అయింది.
ఐతే మిగతా చిత్రాలతో పోలిస్తే దీనికి వసూళ్లు మెరుగ్గానే ఉన్నాయి కానీ.. బయ్యర్లు ఆశించిన స్థాయిలో మాత్రం కాదు. శుక్రవారం దేశవ్యాప్తంగా ఈ చిత్రం రూ.8.5 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా ఇండియాలో ఆ చిత్రం రూ.200 కోట్ల దాకా రాబట్టాల్సి ఉంది. వీకెండ్లో రోజుకు 30-40 కోట్లు వస్తే తప్ప బయ్యర్లు బయట పడేలా లేరు. తెలుగు వరకు సినిమా బ్రేక్ ఈవెన్ అయినా హిందీలో మాత్రం సగం కూడా రికవరీ అవ్వలేదు. వీకెండ్ మీద ఆశలు పెట్టుకుంటే సినిమా ఓ మోస్తరు వసూళ్లతో సరిపెట్టుకుంటోంది. శని, ఆదివారాల్లో ఏమైనా పరిస్థితి మెరుగుపడుతుందేమో చూడాలి.
This post was last modified on September 17, 2022 6:57 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…