కొత్తగా అంత పేరున్న సినిమాలేవీ రిలీజ్ కాకుంటే, కొత్తగా విడుదలైన సినిమాలకు సరైన టాక్ లేకుంటే.. బాక్సాఫీస్ దగ్గర పాత చిత్రాలు అడ్వాంటేజ్ తీసుకోవడం మామూలే. కానీ బాలీవుడ్ మూవీ బ్రహ్మాస్త్ర ఈ అడ్వాంటేజీని పెద్దగా ఉపయోగించుకుంటున్నట్లుగా కనిపించడం లేదు. ఈ నెల 9న రిలీజైన బ్రహ్మాస్త్ర డివైడ్ టాక్తోనూ భారీ ఓపెనింగ్స్ తెచ్చుకుంది. కానీ దాని ప్రతాపం అంతా తొలి వీకెండ్కే పరిమితం అయింది.
సోమవారం నుంచి సినిమా డల్లయిపోయింది. వసూళ్లు ఒక్కసారిగా పడిపోయాయి. వీక్ డేస్ అంతా నామమాత్రమైన వసూళ్లు రాబట్టింది. ఐతే వీకెండ్ వచ్చాక సినిమా పుంజుకుంటుందని ఆశించారు. కానీ పరిస్థితులు బాగా కలిసొచ్చినా సరే.. సినిమా అనుకున్న స్థాయిలో పెర్పామ్ చేయట్లేదు.
ఈ వీకెండ్లో హిందీలో చెప్పుకోదగ్గ సినిమాలేవీ రిలీజ్ కాలేదు. విడుదలైన వాటిని కూడా అక్కడి జనం పట్టించుకోవట్లేదు. ఇక తెలుగు విషయానికి వస్తే ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, మీకు నేను బాగా కావాల్సిన వాడిని, శాకిని డాకిని చిత్రాల్లో ఏవీ పాజిటివ్ టాక్ తెచ్చుకోలేదు. మిగతా సినిమాలను జనం అసలే పట్టించుకోలేదు. దీంతో రెండో వారం కూడా అటు హిందీలో, ఇటు తెలుగులో బాక్సాఫీస్ లీడర్ బ్రహ్మాస్త్రనే అయింది.
ఐతే మిగతా చిత్రాలతో పోలిస్తే దీనికి వసూళ్లు మెరుగ్గానే ఉన్నాయి కానీ.. బయ్యర్లు ఆశించిన స్థాయిలో మాత్రం కాదు. శుక్రవారం దేశవ్యాప్తంగా ఈ చిత్రం రూ.8.5 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా ఇండియాలో ఆ చిత్రం రూ.200 కోట్ల దాకా రాబట్టాల్సి ఉంది. వీకెండ్లో రోజుకు 30-40 కోట్లు వస్తే తప్ప బయ్యర్లు బయట పడేలా లేరు. తెలుగు వరకు సినిమా బ్రేక్ ఈవెన్ అయినా హిందీలో మాత్రం సగం కూడా రికవరీ అవ్వలేదు. వీకెండ్ మీద ఆశలు పెట్టుకుంటే సినిమా ఓ మోస్తరు వసూళ్లతో సరిపెట్టుకుంటోంది. శని, ఆదివారాల్లో ఏమైనా పరిస్థితి మెరుగుపడుతుందేమో చూడాలి.
This post was last modified on September 17, 2022 6:57 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…