మన్మథ సినిమాతో అప్పట్లో తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించాడు తమిళ కథానాయకుడు శింబు. ఆ సినిమా వసూళ్లు చూసి టాలీవుడ్ ఉలిక్కి పడింది. ఓ ఇంటర్వ్యూలో శింబు చెప్పిన ప్రకారం ఈ చిత్ర తెలుగు డబ్బింగ్ హక్కుల రూ.30 లక్షలకు ఇస్తే.. వసూళ్లు రూ.9 కోట్లకు పైగా వచ్చాయట. దీన్ని బట్టి అదెంత పెద్ద హిట్టో అర్థం చేసుకోవచ్చు.
ఈ సినిమా అంత పెద్ద హిట్ కావడంతో తర్వాత వల్లభకు భారీ క్రేజ్ వచ్చింది. కానీ ఆ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. తర్వాత వచ్చిన శింబు సినిమాలేవీ తెలుగు ప్రేక్షకులను మెప్పించలేదు. ఐతే చాన్నాళ్ల తర్వాత శింబు కొంచెం ప్రత్యేక శ్రద్ధ పెట్టి తన కొత్త చిత్రం వెందు తనిందద కాదును తెలుగులో కొంచెం ప్లాన్ చేసి రిలీజ్ చేయించాలని చూశాడు.
లైఫ్ ఆఫ్ ముత్తు పేరుతో ఈ సినిమాను డబ్ చేశారు. కాస్త ప్రమోషన్లు కూడా బాగానే చేశారు. కానీ తమిళంతో పాటుగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయించడం మాత్రం కుదరలేదు. గురువారమే విడుదల కావాల్సిన సినిమా.. రెండు రోజులు వాయిదా పడింది. మరి శనివారం అయినా సవ్యంగా సినిమా రిలీజైందా అంటే అదీ లేదు. తమిళంలో సినిమాకు మంచి టాక్ రావడంతో టికెట్లు కొని శనివారం మార్నింగ్ షోలకు వెళ్లిన వాళ్లకు నిరాశ తప్పలేదు.
ఏవో ఇష్యూల కారణంగా మార్నింగ్ షోలు పడలేదు. మ్యాట్నీలకు బుకింగ్స్ బుకింగ్స్ ఆపేశారు. జనాలు కూడా ఇక థియేటర్ల వైపు చూడలేదు. మధ్యాహ్నం తర్వాత క్లియరెన్స్ వచ్చి షోలు మొదలైనా సరైన రెస్పాన్స్ లేదు. సాయంత్రానికి పరిస్థితి మెరుగుపడుతుందేమో చూడాలి. ఈ వారం వచ్చిన తెలుగు సినిమాలన్నీ డివైడ్, నెగెటివ్ టాక్ తెచ్చుకున్న నేపథ్యంలో లైఫ్ ఆఫ్ ముత్తు రిలీజ్ సరిగ్గా జరిగి ఉంటే అడ్వాంటేజ్ అయ్యేది. కానీ ప్లానింగ్ లోపం వల్ల జనాల్లోఇ సినిమా వెళ్లడం కష్టంగానే ఉంది.
This post was last modified on September 17, 2022 6:53 pm
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…