ఈ మధ్య కాలంలో ప్రేక్షకులు మళ్ళీ మళ్ళీ చూసి మంచి కలెక్షన్స్ అందించిన సినిమాల్లో ‘సీతారామం’ మొదటి స్థానంలో ఉంటుంది. రిలీజ్ రోజు ఓ మోస్తారు ఓపెనింగ్ తెచ్చుకున్న ఈ సినిమా రోజు రోజు కి పబ్లిక్ టాక్ తో వేగంగా దూసుకెళ్ళింది. ముఖ్యంగా ఓవర్సీస్ ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. అక్కడ అలవోకగా 1 మిలియన్ దాటేసిన ఈ సినిమా ఫైనల్ గా మంచి కలెక్షన్స్ తెచ్చిపెట్టింది.
అయితే ఈ ప్రేమకథకి హను రాఘవపూడి ముందుగా కొందరు హీరోలను అనుకున్నారని కానీ ఫైనల్ గా దుల్కర్ చేతికి ప్రాజెక్ట్ వెళ్లిందని ఓ రూమర్ ఉంది. దానిపై లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు హను. సీతారామం కథను ముందుగా నాని , విజయ్ దేవరకొండ , రామ్ లకు చెప్పారట నిజమేనా ? అనే ప్రశ్నకు సమాధానంగా అవన్నీ అవాస్తవాలే అంటూ కొట్టి పారేశాడు. నాని తో రెండో ప్రపంచ యుద్ధం కథతో సినిమా అనుకున్నానని కచ్చితంగా అది చేస్తానని చెప్పుకున్నాడు. అలాగే విజయ్ దేవరకొండ ను కూడా కలిశానని కానీ అది కూడా వేరే కథ కోసమని తెలిపాడు.
ఇక రామ్ తో తను ‘చాణుక్య’ అనే కథతో సినిమా అనుకున్నాని కానే అది కుదరలేదని చెప్పాడు. ఇక దుల్కర్ చాయిస్ ఎవరు ? అంటే టక్కున చెప్పలేనని అది కలెక్టివ్ డిసిషన్ అని అన్నాడు. ఇంకా ఇంటర్వ్యూలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు హను రాఘవపూడి.
This post was last modified on September 16, 2022 8:14 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…