పాద యాత్ర ఈ పదం పొలిటికల్ లో బాగా వినిపిస్తుంటుంది. ప్రజల యోగక్షేమాలు తెలుసుకోవడానికి లీడర్స్ చేసే కాలి నడక యాత్రను పాద యాత్ర అంటారు. చాలా మంది రాజకీయ నాయకులు పాద యాత్ర చేసి సక్సెస్ అయ్యారు. మంచి వోట్ బ్యాంక్ దక్కించుకున్నారు. అయితే ఇప్పుడు ఆ పాద యాత్రతో సినిమాను ప్రమోట్ చేసుకుంటూ హిట్టు కొట్టడానికి కుర్ర హీరో నాగ శౌర్య టూర్లు మొదలు పెట్టాడు.
నాగ శౌర్య నటించిన ‘కృష్ణ వ్రిందా విహారి’ ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో ప్రీవియస్ ఫ్లాప్స్ అన్నీ మర్చిపోయేలా ఓ సూపర్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు శౌర్య. అందుకే ప్రమోషన్స్ కూడా గట్టిగా చేస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పుడు ఆడియన్స్ లోకి సినిమాను తీసుకెళ్లేందుకు ఓ పాద యాత్ర చేయబోతున్నాడు. ఇందుకోసం ఓ రూట్ సెలెక్ట్ చేసుకున్నాడు. తిరుపతి నుండి మొదలు పెట్టి నెల్లూరు , ఒంగోలు , విజయవాడ , గుంటూరు , ఏలూరు , భీమవరం , రాజమండ్రి , కాకినాడ మీదుగా వైజాగ్ తో శౌర్య పాద యాత్ర ముగియనుంది.
అయితే శౌర్య తిరుపతి నుండి వైజాగ్ వరకూ కాలి నడక యాత్ర చేయడు. ప్రతీ ఊరిలో కొంత దూరం మాత్రమే ప్రేక్షకులతో కలిసి నడుస్తూ వారికి ఫోటోలు ఇస్తుంటాడు. ఏదేమైనా రాజకీయంలో చూసే పాద యాత్ర శౌర్య ఇప్పుడు సినిమా పరిశ్రమకు పరిచయం చేశాడు. ఒక వేళ ఈ యాత్ర సక్సెస్ అయి శౌర్య కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తే మిగతా యంగ్ హీరోలు రిలీజ్ కి ముందు ఇలా పాద యాత్రలంటూ సరికొత్త ప్రమోషన్ ని ఫాలో అవ్వడం ఖాయం.
ఢిల్లీలోని మాళవియా నగర్లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఫ్లోరిష్ స్టే అనే హోటల్లో ఉదయం చెలరేగిన మంటలు…
గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ తర్వాత వెంకటేష్ బాగా గ్యాప్ తీసుకున్నారు. అతిథి పాత్ర కాబట్టి మన…
తెలంగాణ… 4 కోట్ల మంది తెలంగాణ భూమిపుత్రుల జాగీరేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.…
గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక అభిమానులను బాధ పెడుతున్న మాస్ మహారాజ రవితేజ ఎట్టకేలకు రూటు మార్చేశారు. రొటీన్…
ఇవాళ సాయంత్రం ప్రీమియర్లతో విడుదల కాబోతున్న పెద్దికి సంబంధించి అందరు దృష్టి సారిస్తున్న ప్రధానాంశాల్లో ఏఅర్ రెహమాన్ సంగీతం ఒకటి.…
మెగా కౌంట్ డౌన్ లో సంవత్సరాలు నెలలుగా మారిపోయి, రోజులకు దిగిపోయి, ఇప్పుడు గంటల్లోకి వచ్చేసింది. మెగాభిమానులు, సినీ ప్రియులు…