పాద యాత్ర ఈ పదం పొలిటికల్ లో బాగా వినిపిస్తుంటుంది. ప్రజల యోగక్షేమాలు తెలుసుకోవడానికి లీడర్స్ చేసే కాలి నడక యాత్రను పాద యాత్ర అంటారు. చాలా మంది రాజకీయ నాయకులు పాద యాత్ర చేసి సక్సెస్ అయ్యారు. మంచి వోట్ బ్యాంక్ దక్కించుకున్నారు. అయితే ఇప్పుడు ఆ పాద యాత్రతో సినిమాను ప్రమోట్ చేసుకుంటూ హిట్టు కొట్టడానికి కుర్ర హీరో నాగ శౌర్య టూర్లు మొదలు పెట్టాడు.
నాగ శౌర్య నటించిన ‘కృష్ణ వ్రిందా విహారి’ ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో ప్రీవియస్ ఫ్లాప్స్ అన్నీ మర్చిపోయేలా ఓ సూపర్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు శౌర్య. అందుకే ప్రమోషన్స్ కూడా గట్టిగా చేస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పుడు ఆడియన్స్ లోకి సినిమాను తీసుకెళ్లేందుకు ఓ పాద యాత్ర చేయబోతున్నాడు. ఇందుకోసం ఓ రూట్ సెలెక్ట్ చేసుకున్నాడు. తిరుపతి నుండి మొదలు పెట్టి నెల్లూరు , ఒంగోలు , విజయవాడ , గుంటూరు , ఏలూరు , భీమవరం , రాజమండ్రి , కాకినాడ మీదుగా వైజాగ్ తో శౌర్య పాద యాత్ర ముగియనుంది.
అయితే శౌర్య తిరుపతి నుండి వైజాగ్ వరకూ కాలి నడక యాత్ర చేయడు. ప్రతీ ఊరిలో కొంత దూరం మాత్రమే ప్రేక్షకులతో కలిసి నడుస్తూ వారికి ఫోటోలు ఇస్తుంటాడు. ఏదేమైనా రాజకీయంలో చూసే పాద యాత్ర శౌర్య ఇప్పుడు సినిమా పరిశ్రమకు పరిచయం చేశాడు. ఒక వేళ ఈ యాత్ర సక్సెస్ అయి శౌర్య కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తే మిగతా యంగ్ హీరోలు రిలీజ్ కి ముందు ఇలా పాద యాత్రలంటూ సరికొత్త ప్రమోషన్ ని ఫాలో అవ్వడం ఖాయం.
This post was last modified on September 14, 2022 7:10 pm
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…