ఎప్పుడో రెండు వారాల క్రితం సెప్టెంబర్ 16ని నేషనల్ సినిమా డేగా ప్రకటించి ఆ రోజు మల్టీప్లెక్సులన్నీ టికెట్ రేట్ ని కేవలం 75 రూపాయలకు అమ్ముతామని ప్రకటించడం మూవీ లవర్స్ గుర్తు పెట్టుకున్నారు. అయితే హఠాత్తుగా దాన్ని వారం వాయిదా వేసి సెప్టెంబర్ 23కి షిఫ్ట్ చేయడం ఆశ్చర్యపరిచింది. ఈ ఆఫర్ బాగుంది కదాని అడ్వాన్స్ బుకింగ్ కోసం ఎదురు చూస్తున్న ఆడియన్స్ కు సదరు అసోసియేషన్ స్వీట్ షాక్ ఇచ్చింది. అయితే ఈ నిర్ణయం వెనుక ప్రధానంగా బ్రహ్మాస్త్ర పార్ట్ వన్ శివ ప్రభావం ఉందని ముంబై టాక్. వివరాల్లోకి వెళ్తే మీకే అర్థమవుతుంది.
బ్రహ్మాస్త్ర తెలుగు రాష్ట్రాల్లో మొన్న సోమవారం నుంచి నెమ్మదించింది కానీ ఉత్తరాదిలో మాత్రం నాన్ స్టాప్ గా దూసుకుపోతోంది. కనీసం పది రోజుల పాటు ఈ కలెక్షన్లు స్టడీగా ఉంటాయని ట్రేడ్ నమ్మకంతో ఉంది. ఢిల్లీ, ముంబై, కోల్కతా, బెంగళూరు లాంటి నగరాల్లో ముఖ్యంగా ఐమ్యాక్స్ స్క్రీన్లలో టికెట్ ధర 200 నుంచి 900 రూపాయల పైమాటే ఉంటుంది. అయినా కూడా హై క్లాస్ జనాలు చూస్తున్నారు. ఇప్పుడు ఎనిమిదో రోజే వాటిని 75 రూపాయలకు ఇచ్చేస్తే రెవిన్యూ చాలా తీవ్రంగా దెబ్బ తింటుంది. జనాలు ఫుల్లుగా వస్తారు కానీ గల్లా పెట్టెలు డల్లుగా ఉంటాయి.
అందుకే అలోచించి ఇలా అయితే వర్కౌట్ కాదని గుర్తించి నీట్ గా షిఫ్ట్ చేశారన్న మాట. ఆ తేదీకి పెద్ద బాలీవుడ్ సినిమాలేం లేవు. అవతార్ కూడా పాత రీ రిలీజ్ కాబట్టి భారీ రేట్లకేం అమ్మలేదు. ఎటొచ్చి తెలుగులో అదే రోజు వస్తున్న అల్లూరి, గుర్తుందా శీతాకాలం, దొంగలున్నారు జాగ్రత్త, కృష్ణ వృందా విహారి లాంటి వాటికి కొన్ని ఇబ్బందులు తప్పవు. హిందీలో దుల్కర్ సల్మాన్ చుప్ ఉంది కానీ అదేమీ ప్యాన్ ఇండియా మూవీ కాదు. మొత్తానికి బ్రహ్మాస్త్ర కోసమే మల్టీప్లెక్సులు డెసిషన్ మార్చుకున్నాయన్న కామెంట్ లో లాజిక్ ఉంది. బయటికి చెప్పలేదు కానీ ఈజీగా అర్థం చేసుకోవచ్చు.
This post was last modified on September 13, 2022 10:24 pm
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…