ఎప్పుడో రెండు వారాల క్రితం సెప్టెంబర్ 16ని నేషనల్ సినిమా డేగా ప్రకటించి ఆ రోజు మల్టీప్లెక్సులన్నీ టికెట్ రేట్ ని కేవలం 75 రూపాయలకు అమ్ముతామని ప్రకటించడం మూవీ లవర్స్ గుర్తు పెట్టుకున్నారు. అయితే హఠాత్తుగా దాన్ని వారం వాయిదా వేసి సెప్టెంబర్ 23కి షిఫ్ట్ చేయడం ఆశ్చర్యపరిచింది. ఈ ఆఫర్ బాగుంది కదాని అడ్వాన్స్ బుకింగ్ కోసం ఎదురు చూస్తున్న ఆడియన్స్ కు సదరు అసోసియేషన్ స్వీట్ షాక్ ఇచ్చింది. అయితే ఈ నిర్ణయం వెనుక ప్రధానంగా బ్రహ్మాస్త్ర పార్ట్ వన్ శివ ప్రభావం ఉందని ముంబై టాక్. వివరాల్లోకి వెళ్తే మీకే అర్థమవుతుంది.
బ్రహ్మాస్త్ర తెలుగు రాష్ట్రాల్లో మొన్న సోమవారం నుంచి నెమ్మదించింది కానీ ఉత్తరాదిలో మాత్రం నాన్ స్టాప్ గా దూసుకుపోతోంది. కనీసం పది రోజుల పాటు ఈ కలెక్షన్లు స్టడీగా ఉంటాయని ట్రేడ్ నమ్మకంతో ఉంది. ఢిల్లీ, ముంబై, కోల్కతా, బెంగళూరు లాంటి నగరాల్లో ముఖ్యంగా ఐమ్యాక్స్ స్క్రీన్లలో టికెట్ ధర 200 నుంచి 900 రూపాయల పైమాటే ఉంటుంది. అయినా కూడా హై క్లాస్ జనాలు చూస్తున్నారు. ఇప్పుడు ఎనిమిదో రోజే వాటిని 75 రూపాయలకు ఇచ్చేస్తే రెవిన్యూ చాలా తీవ్రంగా దెబ్బ తింటుంది. జనాలు ఫుల్లుగా వస్తారు కానీ గల్లా పెట్టెలు డల్లుగా ఉంటాయి.
అందుకే అలోచించి ఇలా అయితే వర్కౌట్ కాదని గుర్తించి నీట్ గా షిఫ్ట్ చేశారన్న మాట. ఆ తేదీకి పెద్ద బాలీవుడ్ సినిమాలేం లేవు. అవతార్ కూడా పాత రీ రిలీజ్ కాబట్టి భారీ రేట్లకేం అమ్మలేదు. ఎటొచ్చి తెలుగులో అదే రోజు వస్తున్న అల్లూరి, గుర్తుందా శీతాకాలం, దొంగలున్నారు జాగ్రత్త, కృష్ణ వృందా విహారి లాంటి వాటికి కొన్ని ఇబ్బందులు తప్పవు. హిందీలో దుల్కర్ సల్మాన్ చుప్ ఉంది కానీ అదేమీ ప్యాన్ ఇండియా మూవీ కాదు. మొత్తానికి బ్రహ్మాస్త్ర కోసమే మల్టీప్లెక్సులు డెసిషన్ మార్చుకున్నాయన్న కామెంట్ లో లాజిక్ ఉంది. బయటికి చెప్పలేదు కానీ ఈజీగా అర్థం చేసుకోవచ్చు.
This post was last modified on September 13, 2022 10:24 pm
సోషల్ మీడియాలో ఓ రెస్టారెంట్ బిల్లు హాట్ టాపిక్గా మారింది. ఇడ్లీ, వడతో పాటు గ్యాస్ ఖర్చును కూడా విడిగా…
అనిల్ రావిపూడిని టాలీవుడ్లో అందరూ హిట్ మెషీన్ అంటారు. తన సినిమాల ఫలితాలను చూస్తే.. ఇందులో అతిశయోక్తి ఏమీ లేదనిపిస్తుంది.…
మాస్ రాజా రవితేజ, స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘షాక్’ ఆ ఇద్దరికీ పెద్ద…
ఇటీవలే కాంతారావు పురస్కారం అందుకున్న సందర్భంగా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ తమిళ లెజెండరీ నటులు ఎంజీఆర్ ని ఉద్దేశించి అన్న…
జనవరిలో సంక్రాంతి పండక్కు నారి నారి నడుమ మురారితో సూపర్ హిట్ కొట్టిన శర్వానంద్ మూడు నెలలు దాటడం ఆలస్యం…
కన్నడలో ‘కిరిక్ పార్టీ’ అనే చిన్న సినిమాతో కెరీర్ను మొదలుపెట్టి.. ఇప్పుడు ఇండియాలోనే టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఎదిగింది రష్మిక…