Movie News

అమ‌ల‌.. అంత భారీ చిత్రానికి నో చెప్పిందా?

మ‌ణిర‌త్నం సినిమాలో అవకాశం అంటే ఏ హీరో, హీరోయిన్ కూడా నో చెప్పే సాహ‌సం చేయ‌రు. ద‌క్షిణాదినే కాక ఇండియా మొత్తంలో త‌ప్ప‌క ఓ సినిమా చేయాల‌ని ఆర్టిస్టులు కోరుకునే ద‌ర్శ‌కుల్లో మ‌ణిర‌త్నం ఒక‌డు. అలాంటి ద‌ర్శ‌కుడికి నో చెప్పింద‌ట అమ‌లా పాల్. అది కూడా మ‌ణిర‌త్నం మెగా ప్రాజెక్ట్ పొన్నియ‌న్ సెల్వ‌న్‌లో కావ‌డం ఆశ్చ‌ర్యం కలిగించే విష‌యం. ఈ విష‌యాన్ని స్వ‌యంగా అమ‌లా పాలే ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించ‌డం విశేషం. కొన్నేళ్ల కింద‌టే పొన్నియ‌న్ సెల్వ‌న్ సినిమాలో ఓ పాత్ర కోసం మ‌ణిర‌త్నం.. అమ‌ల‌ను ఆడిష‌న్ చేశాడ‌ట‌.

ఐతే ఆ ఆడిష‌న్ స‌రిగా జ‌ర‌గ‌లేద‌ని.. ఆ పాత్ర‌కు తాను న‌ప్ప‌న‌ని ప‌క్క‌న పెట్టార‌ని అమ‌ల వెల్ల‌డించింది. కాగా గ‌త ఏడాది మ‌ళ్లీ మ‌ణిర‌త్నం టీం త‌న‌ను అదే పాత్ర‌కు సంప్ర‌దించింద‌ని, కానీ త‌న‌కు అప్పుడు ఆ పాత్ర చేసే ఆస‌క్తి పోయింద‌ని, దీంతో తాను ఆ సినిమాను వ‌దులుకున్నాన‌ని అమ‌ల తెలిపింది. మ‌రి పొన్నియ‌న్ సెల్వ‌న్‌లో న‌టించ‌లేక‌పోయినందుకు ప‌శ్చాత్తాప‌ప‌డుతున్నారా అని అడిగితే అలాంటిదేమీ లేద‌ని, కొన్నిసార్లు కొన్ని విష‌యాలు ఇలా జ‌రుగుతుంటాయ‌ని అమ‌ల పేర్కొంది. ఐతే తాను మ‌ణిర‌త్నంకు పెద్ద అభిమానిన‌ని.. ఆయ‌న దర్శ‌క‌త్వంలో న‌టించ‌డానికి ఎదురు చూస్తున్నాన‌ని అమ‌ల చెప్పింది.

పొన్నియ‌న్ సెల్వ‌న్ సినిమాలో కీల‌క‌మైన లేడీ క్యారెక్ట‌ర్స్ చెప్పుకోద‌గ్గ సంఖ్య‌లోనే ఉన్నాయి. క‌థ‌లో అత్యంత కీల‌క‌మైన నందిని పాత్ర‌లో ఐశ్వ‌ర్యారాయ్ న‌టించ‌గా.. మ‌రో ముఖ్య పాత్ర‌ను త్రిష పోషించింది. అమ‌ల స్థాయికి ఈ రెండు పాత్ర‌ల్లో ఒక‌టి ద‌క్కే అవ‌కాశం లేదు. బ‌హుశా ఐశ్వ‌ర్యా ల‌క్ష్మి చేసిన పాత్ర‌ను అమ‌ల‌కు మ‌ణిర‌త్నం ఆఫ‌ర్ చేసి ఉండొచ్చేమో. మ‌రి అమ‌ల ఈ పాత్ర చేయ‌నందుకు నిజంగా రిగ్రెట్ అవుతుందా లేదా అన్న‌ది ఈ నెల 30న పొన్నియ‌న్ సెల్వ‌న్ రిలీజ‌య్యాక తెలుస్తుంది.

This post was last modified on September 13, 2022 12:20 pm

Share

Recent Posts

అవతార్ పోలికంటే అతిశయోక్తి అవుతుందేమో

నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…

2 minutes ago

సాయిరెడ్డి వెంట న‌డిచే రెడ్లు ఉన్నారా?

పార్టీ ఏదైనా.. నాయ‌కుడు ఎవ‌రైనా సొంత సామాజిక వ‌ర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేక‌పోతే.. ప్ర‌జాబ‌లం అయినా…

3 minutes ago

దాయ్‌రాగా మారిన దిశా… బాగా లేటయ్యింది

ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…

4 hours ago

షర్మిల కూతురి పెళ్ళికి జగన్ డుమ్మా ?

వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…

4 hours ago

ప్యారడైజ్ పోటీ నుండి తప్పుకున్న కీర్తి సురేష్

ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…

5 hours ago

టార్గెట్ గ‌జ్వేల్‌.. కాంగ్రెస్ వ్యూహం ఇదీ!

గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గం.. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కంచుకోట‌. అయితే.. ఇక్క‌డే పాగా వేయాల‌ని.. వ‌చ్చే…

6 hours ago