ఇండియాలో సైన్స్ ఫిక్షన్ సినిమాలు తక్కువ. అందులోనూ టైం ట్రావెల్ మూవీస్ మరీ తక్కువ. అలా అని ఈ సినిమాలు ఇక రాదా… ఆ జానర్ సినిమాలు సరిగా ఆడవా అంటే అదేమీ లేదు. తెలుగులో ఈ నేపథ్యంలో వచ్చిన ఆదిత్య 369 ఎలా ఆల్ టైం క్లాసిక్ గా నిలబడింది తెలిసిందే. ఆ సినిమా కమర్షియల్ గానూ మంచి ఫలితమే అందుకుంది. ఇక కొన్నేళ్ల ముందు సూర్య హీరోగా విక్రమ్ కుమార్ రూపొందించిన 24 మూవీ కూడా ట్రైన్ ట్రావెల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
అయితే ఈ జానర్ ను డీల్ చేయడం అంత తేలిక అయితే కాదు. అందుకే ఎక్కువ మంది ఈ నేపథ్యంలో సినిమాలు తీయలేదు. ఇప్పుడు శ్రీ కార్తీక్ అనే కొత్త దర్శకుడు శర్వానంద్ హీరోగా ఒకే ఒక జీవితం చిత్రాన్ని టైం ట్రావెల్ బ్యాక్ డ్రాప్ లోనే చాలా ఆసక్తికరంగా తీర్చిదిద్ది ప్రేక్షకుల మనసులు గెలిచాడు. పైన చెప్పుకున్న మూడు చిత్రాలు ఈ నేపథ్యంలోనే సాగినప్పటికీ అవి నడిచే తీరు వేరుగా ఉంటుంది. వాటి కథలు భిన్నం. అలాగే ఒకే ఒక జీవితం కూడా దానికి అదే స్పెషల్. దేనితోనూ పోల్చలేము. ముఖ్యంగా ఇందులోని ఎమోషన్లు, అమ్మ సెంటిమెంట్ దీన్ని భిన్నంగా నిలబెట్టాయి. సినిమాకు అదే ఒక హైలెట్ గా నిలిచింది.
దీనికితోడు త్రిల్ ఫ్యాక్టర్, కామెడీ కూడా బాగానే వర్కవుట్ కావడంతో సినిమా జనరంజకంగా తయారయింది. తొలి రోజు ఉదయం డల్ గానే మొదలైనప్పటికీ పాజిటివ్ టాక్ వేగంగా స్ప్రెడ్ కావడంతో వసూళ్లు పుంజుకున్నాయి. సినిమా మంచి హిట్ అయ్యేలా కనిపిస్తోంది. కాబట్టి టైం ట్రావెల్ హిట్ ఫార్ములా అని మరోసారి రుజువైంది.
This post was last modified on September 11, 2022 10:53 am
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…