టాలీవుడ్ మరో దిగ్గజాన్ని కోల్పోయింది. రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున 3.25 నిమిషాలకు తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలిసి ఆయన కుటుంబ సభ్యులే కాక లక్షల మంది అభిమానులు కూడా శోకసంద్రంలో మునిగిపోయారు.
నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన ఉజ్వల కెరీర్లో నటుడిగా నిర్మాతగా ఆయన ఎన్నో ఘన విజయాలు అందుకున్నారు. ఆయన నట వారసుడు ప్రభాస్ ఇండియా లోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా ఎదగడం… అంతర్జాతీయ స్థాయిలో కీర్తి సంపాదించడం కృష్ణంరాజుకు అమిత ఆనందాన్ని ఇచ్చే విషయం. కాకపోతే సినిమాల పరంగా, అలాగే వ్యక్తిగతంగా రెండు ముఖ్యమైన కోరికలు తీరకుండానే వెళ్లిపోవడం బాధాకరం.
సినిమాల విషయానికి వస్తే ప్రభాస్ తో భక్త కన్నప్ప చిత్రాన్ని భారీ స్థాయిలో తీయాలని ఆయన ఆశ పడ్డారు. తన కెరీర్లో మైలురాయిలా నిలిచిన చిత్రాన్ని ప్రస్తుత అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి స్వీయ దర్శకత్వంలో రీమేక్ చేయాలన్నది నా కోరిక. ఈ విషయాన్ని పలు సందర్భంలో ఆయన చెప్పారు. కానీ ప్రభాస్ కు కుదరకో, మరో కారణంతోనో ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు.
ఇక వ్యక్తిగతంగా చూస్తే కృష్ణంరాజుకు తీరని మరో కోరిక ప్రభాస్ పెళ్లి చూడటం. ఈ విషయం గురించి కృష్ణంరాజు దశాబ్దం కిందటి నుంచే మాట్లాడుతూ వస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ పెళ్లి చేయాలని ఆయన గట్టిగా ప్రయత్నించారు. కానీ అది జరగలేదు. చివరగా ఈ పెళ్లి గురించి కృష్ణంరాజు- ప్రభాస్ మధ్యలో ఏం చర్చ జరిగిందో కాని.. ఆయన కూడా ఈ విషయం గురించి మీడియా దగ్గర మాట్లాడట్లేదు. మొత్తంగా చూస్తే ప్రభాస్ కు సంబంధించిన రెండు విషయాల్లో కృష్ణంరాజు కోరికలు తీరలేదన్నది వాస్తవం.
This post was last modified on September 11, 2022 10:18 am
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…