టాలీవుడ్ మరో దిగ్గజాన్ని కోల్పోయింది. రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున 3.25 నిమిషాలకు తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలిసి ఆయన కుటుంబ సభ్యులే కాక లక్షల మంది అభిమానులు కూడా శోకసంద్రంలో మునిగిపోయారు.
నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన ఉజ్వల కెరీర్లో నటుడిగా నిర్మాతగా ఆయన ఎన్నో ఘన విజయాలు అందుకున్నారు. ఆయన నట వారసుడు ప్రభాస్ ఇండియా లోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా ఎదగడం… అంతర్జాతీయ స్థాయిలో కీర్తి సంపాదించడం కృష్ణంరాజుకు అమిత ఆనందాన్ని ఇచ్చే విషయం. కాకపోతే సినిమాల పరంగా, అలాగే వ్యక్తిగతంగా రెండు ముఖ్యమైన కోరికలు తీరకుండానే వెళ్లిపోవడం బాధాకరం.
సినిమాల విషయానికి వస్తే ప్రభాస్ తో భక్త కన్నప్ప చిత్రాన్ని భారీ స్థాయిలో తీయాలని ఆయన ఆశ పడ్డారు. తన కెరీర్లో మైలురాయిలా నిలిచిన చిత్రాన్ని ప్రస్తుత అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి స్వీయ దర్శకత్వంలో రీమేక్ చేయాలన్నది నా కోరిక. ఈ విషయాన్ని పలు సందర్భంలో ఆయన చెప్పారు. కానీ ప్రభాస్ కు కుదరకో, మరో కారణంతోనో ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు.
ఇక వ్యక్తిగతంగా చూస్తే కృష్ణంరాజుకు తీరని మరో కోరిక ప్రభాస్ పెళ్లి చూడటం. ఈ విషయం గురించి కృష్ణంరాజు దశాబ్దం కిందటి నుంచే మాట్లాడుతూ వస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ పెళ్లి చేయాలని ఆయన గట్టిగా ప్రయత్నించారు. కానీ అది జరగలేదు. చివరగా ఈ పెళ్లి గురించి కృష్ణంరాజు- ప్రభాస్ మధ్యలో ఏం చర్చ జరిగిందో కాని.. ఆయన కూడా ఈ విషయం గురించి మీడియా దగ్గర మాట్లాడట్లేదు. మొత్తంగా చూస్తే ప్రభాస్ కు సంబంధించిన రెండు విషయాల్లో కృష్ణంరాజు కోరికలు తీరలేదన్నది వాస్తవం.
This post was last modified on September 11, 2022 10:18 am
అమెరికాలో గ్రీన్కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…
పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…
AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్తో టీ20 సిరీస్కు ముందు ఢిల్లీలో జరిగిన…