టాలీవుడ్ మరో దిగ్గజాన్ని కోల్పోయింది. రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున 3.25 నిమిషాలకు తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలిసి ఆయన కుటుంబ సభ్యులే కాక లక్షల మంది అభిమానులు కూడా శోకసంద్రంలో మునిగిపోయారు.
నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన ఉజ్వల కెరీర్లో నటుడిగా నిర్మాతగా ఆయన ఎన్నో ఘన విజయాలు అందుకున్నారు. ఆయన నట వారసుడు ప్రభాస్ ఇండియా లోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా ఎదగడం… అంతర్జాతీయ స్థాయిలో కీర్తి సంపాదించడం కృష్ణంరాజుకు అమిత ఆనందాన్ని ఇచ్చే విషయం. కాకపోతే సినిమాల పరంగా, అలాగే వ్యక్తిగతంగా రెండు ముఖ్యమైన కోరికలు తీరకుండానే వెళ్లిపోవడం బాధాకరం.
సినిమాల విషయానికి వస్తే ప్రభాస్ తో భక్త కన్నప్ప చిత్రాన్ని భారీ స్థాయిలో తీయాలని ఆయన ఆశ పడ్డారు. తన కెరీర్లో మైలురాయిలా నిలిచిన చిత్రాన్ని ప్రస్తుత అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి స్వీయ దర్శకత్వంలో రీమేక్ చేయాలన్నది నా కోరిక. ఈ విషయాన్ని పలు సందర్భంలో ఆయన చెప్పారు. కానీ ప్రభాస్ కు కుదరకో, మరో కారణంతోనో ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు.
ఇక వ్యక్తిగతంగా చూస్తే కృష్ణంరాజుకు తీరని మరో కోరిక ప్రభాస్ పెళ్లి చూడటం. ఈ విషయం గురించి కృష్ణంరాజు దశాబ్దం కిందటి నుంచే మాట్లాడుతూ వస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ పెళ్లి చేయాలని ఆయన గట్టిగా ప్రయత్నించారు. కానీ అది జరగలేదు. చివరగా ఈ పెళ్లి గురించి కృష్ణంరాజు- ప్రభాస్ మధ్యలో ఏం చర్చ జరిగిందో కాని.. ఆయన కూడా ఈ విషయం గురించి మీడియా దగ్గర మాట్లాడట్లేదు. మొత్తంగా చూస్తే ప్రభాస్ కు సంబంధించిన రెండు విషయాల్లో కృష్ణంరాజు కోరికలు తీరలేదన్నది వాస్తవం.
This post was last modified on September 11, 2022 10:18 am
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…