టాలీవుడ్ మరో దిగ్గజాన్ని కోల్పోయింది. రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున 3.25 నిమిషాలకు తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలిసి ఆయన కుటుంబ సభ్యులే కాక లక్షల మంది అభిమానులు కూడా శోకసంద్రంలో మునిగిపోయారు.
నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన ఉజ్వల కెరీర్లో నటుడిగా నిర్మాతగా ఆయన ఎన్నో ఘన విజయాలు అందుకున్నారు. ఆయన నట వారసుడు ప్రభాస్ ఇండియా లోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా ఎదగడం… అంతర్జాతీయ స్థాయిలో కీర్తి సంపాదించడం కృష్ణంరాజుకు అమిత ఆనందాన్ని ఇచ్చే విషయం. కాకపోతే సినిమాల పరంగా, అలాగే వ్యక్తిగతంగా రెండు ముఖ్యమైన కోరికలు తీరకుండానే వెళ్లిపోవడం బాధాకరం.
సినిమాల విషయానికి వస్తే ప్రభాస్ తో భక్త కన్నప్ప చిత్రాన్ని భారీ స్థాయిలో తీయాలని ఆయన ఆశ పడ్డారు. తన కెరీర్లో మైలురాయిలా నిలిచిన చిత్రాన్ని ప్రస్తుత అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి స్వీయ దర్శకత్వంలో రీమేక్ చేయాలన్నది నా కోరిక. ఈ విషయాన్ని పలు సందర్భంలో ఆయన చెప్పారు. కానీ ప్రభాస్ కు కుదరకో, మరో కారణంతోనో ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు.
ఇక వ్యక్తిగతంగా చూస్తే కృష్ణంరాజుకు తీరని మరో కోరిక ప్రభాస్ పెళ్లి చూడటం. ఈ విషయం గురించి కృష్ణంరాజు దశాబ్దం కిందటి నుంచే మాట్లాడుతూ వస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ పెళ్లి చేయాలని ఆయన గట్టిగా ప్రయత్నించారు. కానీ అది జరగలేదు. చివరగా ఈ పెళ్లి గురించి కృష్ణంరాజు- ప్రభాస్ మధ్యలో ఏం చర్చ జరిగిందో కాని.. ఆయన కూడా ఈ విషయం గురించి మీడియా దగ్గర మాట్లాడట్లేదు. మొత్తంగా చూస్తే ప్రభాస్ కు సంబంధించిన రెండు విషయాల్లో కృష్ణంరాజు కోరికలు తీరలేదన్నది వాస్తవం.
This post was last modified on September 11, 2022 10:18 am
రామాయణం.. తరతరాలుగా ప్రతీ ఇంటితోనూ విడదీయరాని బంధం ఉన్న ఒక గొప్ప ఎమోషన్. అయితే ఈ కథను ఇండియన్ సినిమా…
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…