కార్తికేయ-2.. ఈ మధ్య కాలంలో బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ అంటే ఈ చిత్రమే. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ రూ.14 కోట్లకు జరిగితే.. దాని మీద నాలుగు రెట్ల షేర్ రాబట్టేలా కనిపిస్తోందీ చిత్రం. ఇప్పటికే ఈ సినిమా వరల్డ్ వైడ్ గ్రాస్ రూ.100 కోట్లు, షేర్ రూ.50 కోట్లు దాటిపోయింది. నాలుగో వారంలోనూ మంచి షేర్ రాబడుతూ ముందుకు సాగుతోంది ‘కార్తికేయ-2’. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 సినిమాలు వెయ్యి కోట్ల మార్కును కూడా దాటి ఉండొచ్చు కానీ.. పెట్టుబడి-రాబడి కోణంలో చూస్తే ‘కార్తికేయ-2’ వాటిని మించిన బ్లాక్బస్టర్ అనడంలో సందేహం లేదు.
హిందీలో 50 షోలతో నామమాత్రంగా మొదలై థియేటర్లు, షోలను వేల సంఖ్యలకు పెంచుకుని కొన్ని వారాలుగా నార్త్ ఇండియాలో బాక్సాఫీస్ లీడర్గా కొనసాగుతోంది ‘కార్తికేయ-2’. ఈ సినిమా ఇంత ఘనవిజయం సాధించడం హీరో నిఖిల్ సిద్దార్థ, దర్శకుడు చందూ మొండేటి కెరీర్లకు పెద్ద ప్లస్ అనడంలో సందేహం లేదు. వారి తర్వాతి చిత్రాలకు ఉండే డిమాండే వేరుగా ఉంటుంది.
ఇక నిర్మాతలు ఈ సినిమాతో వచ్చిన లాభాలతో ఇంకో మూణ్నాలుగు సినిమాలు తీసుకోవచ్చు. ఐతే వీళ్లందరి పరిస్థితి బాగానే ఉంది కానీ.. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్కు మాత్రం సినిమా వల్ల పెద్దగా ప్రయోజనం లేనట్లే కనిపిస్తోంది. ‘కార్తికేయ-2’లో ఆమె పాత్ర అనుకున్నంతగా హైలైట్ కాలేదు. సినిమాలో ఎక్కడా తన టాలెంట్ చూపించే అవకాశం దక్కలేదు. లుక్స్ పరంగా అనుపమ కెరీర్లోనే అత్యంత సాధారణంగా కనిపించిన సినిమాగా దీన్ని చెప్పుకోవాలి.
ఇంతకు ముందున్న ఆకర్షణ ఇప్పుడు ఆమెలో కనిపించడం లేదు. ‘కార్తికేయ-2’కు సంబంధించి అందరూ ప్రశంసలు అందుకుంటున్నారు కానీ.. అనుపమకైతే పెద్దగా క్రెడిట్ దక్కట్లేదు. మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా ఇంత ఘనవిజయం సాధించినా అనుపమ కెరీర్కైతే పెద్దగా ఉపయోగపడేలా లేదు. దీని తర్వాత నిఖిల్కు జోడీగా ఆమె నటించిన ‘18 పేజెస్’ రిలీజ్ కాబోతోంది. అది లవ్ స్టోరీ కాబట్టి అనుపమ హైలైట్ కావడానికి ఛాన్సుంది. ఆ సినిమా సక్సెస్ అయితే ఆమెకు ప్లస్ కావచ్చు.
This post was last modified on September 6, 2022 4:30 pm
మాములుగా ఒక సినిమా రిలీజయ్యాక దాని ఫలితంతో సంబంధం లేకుండా సక్సెస్ మీట్ల పేరుతో బాణా సంచా కాల్చడం, మీడియా…
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేష్.. మంగళవారం మధ్యాహ్నం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో…
ఏపీలో అరటి పండ్ల ధర ఎంత..? ఎందుకీ రాద్దాంతం..? అరటి రైతులు కష్టాలు పడుతున్నారంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు చర్చకు…
ఉప ముఖ్యమంత్రి మాటలను వక్రీకరించ వద్దంటూ జనసేన ఓ పార్టీ ప్రకటన విడుదల చేసింది. కొద్దిరోజుల కిందట పవన్ కళ్యాణ్…
దేశంలో పురాతన, బ్రిటీష్ కాలం నాటి పేర్లను, ఊర్లను కూడా మారుస్తున్న కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం…
ఏపీ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి మహానగరంగా నిర్మించాలని నిర్ణయించుకున్న సీఎం చంద్రబాబు.. ఆదిశగా వడి వడిగా అడుగులు వేస్తున్నారు.…