కార్తికేయ-2.. ఈ మధ్య కాలంలో బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ అంటే ఈ చిత్రమే. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ రూ.14 కోట్లకు జరిగితే.. దాని మీద నాలుగు రెట్ల షేర్ రాబట్టేలా కనిపిస్తోందీ చిత్రం. ఇప్పటికే ఈ సినిమా వరల్డ్ వైడ్ గ్రాస్ రూ.100 కోట్లు, షేర్ రూ.50 కోట్లు దాటిపోయింది. నాలుగో వారంలోనూ మంచి షేర్ రాబడుతూ ముందుకు సాగుతోంది ‘కార్తికేయ-2’. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 సినిమాలు వెయ్యి కోట్ల మార్కును కూడా దాటి ఉండొచ్చు కానీ.. పెట్టుబడి-రాబడి కోణంలో చూస్తే ‘కార్తికేయ-2’ వాటిని మించిన బ్లాక్బస్టర్ అనడంలో సందేహం లేదు.
హిందీలో 50 షోలతో నామమాత్రంగా మొదలై థియేటర్లు, షోలను వేల సంఖ్యలకు పెంచుకుని కొన్ని వారాలుగా నార్త్ ఇండియాలో బాక్సాఫీస్ లీడర్గా కొనసాగుతోంది ‘కార్తికేయ-2’. ఈ సినిమా ఇంత ఘనవిజయం సాధించడం హీరో నిఖిల్ సిద్దార్థ, దర్శకుడు చందూ మొండేటి కెరీర్లకు పెద్ద ప్లస్ అనడంలో సందేహం లేదు. వారి తర్వాతి చిత్రాలకు ఉండే డిమాండే వేరుగా ఉంటుంది.
ఇక నిర్మాతలు ఈ సినిమాతో వచ్చిన లాభాలతో ఇంకో మూణ్నాలుగు సినిమాలు తీసుకోవచ్చు. ఐతే వీళ్లందరి పరిస్థితి బాగానే ఉంది కానీ.. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్కు మాత్రం సినిమా వల్ల పెద్దగా ప్రయోజనం లేనట్లే కనిపిస్తోంది. ‘కార్తికేయ-2’లో ఆమె పాత్ర అనుకున్నంతగా హైలైట్ కాలేదు. సినిమాలో ఎక్కడా తన టాలెంట్ చూపించే అవకాశం దక్కలేదు. లుక్స్ పరంగా అనుపమ కెరీర్లోనే అత్యంత సాధారణంగా కనిపించిన సినిమాగా దీన్ని చెప్పుకోవాలి.
ఇంతకు ముందున్న ఆకర్షణ ఇప్పుడు ఆమెలో కనిపించడం లేదు. ‘కార్తికేయ-2’కు సంబంధించి అందరూ ప్రశంసలు అందుకుంటున్నారు కానీ.. అనుపమకైతే పెద్దగా క్రెడిట్ దక్కట్లేదు. మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా ఇంత ఘనవిజయం సాధించినా అనుపమ కెరీర్కైతే పెద్దగా ఉపయోగపడేలా లేదు. దీని తర్వాత నిఖిల్కు జోడీగా ఆమె నటించిన ‘18 పేజెస్’ రిలీజ్ కాబోతోంది. అది లవ్ స్టోరీ కాబట్టి అనుపమ హైలైట్ కావడానికి ఛాన్సుంది. ఆ సినిమా సక్సెస్ అయితే ఆమెకు ప్లస్ కావచ్చు.
This post was last modified on September 6, 2022 4:30 pm
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…