కొన్ని సినిమాలు డిస్కషన్ స్టేజిలోనే క్యాన్సిల్ అవుతుంటాయి. మరికొన్ని షూటింగ్ మొదలయ్యాక ఆగిపోతుంటాయి. అయితే తాజాగా హీరో శర్వానంద్ సినిమా ఒకటి ఇలాగే డిస్కషన్ స్టేజిలోనే ఆగిపోయిందని తెలుస్తుంది. కొన్నేళ్లుగా వరుసగా సినిమాలు చేస్తున్నాడు శర్వా. ఏడాదికి రెండు సినిమాలు రిలీజ్ అయ్యేలా చూసుకుంటున్నాడు. అయితే హిట్టు మాత్రం అందుకోలేకపోతున్నాడు. శర్వా సినిమాలు వెళ్తున్నాయి అన్నట్టుగా ఆడియన్స్ చెప్పుకుంటున్నారు. అందుకే ఆడవాళ్ళు మీకు జోహార్లు రిజల్ట్ తర్వాత శర్వా బ్రేక్ తీసుకున్నాడు.
ఆ గ్యాప్ లో కొరియోగ్రాఫర్ రాజు సుందరం దర్శకత్వంలో ఒక సినిమా చేయాలని భావించాడు. ఇద్దరి మధ్య స్క్రిప్ట్ గురించి కొన్ని డిస్కషన్స్ జరిగాయి. శర్వాకి కథలో కొంత పార్ట్ నచ్చింది ఇంకొన్ని మార్పులు కూడా చెప్పాడట. ఆ మార్పులు అయ్యేలోపే ఇప్పుడు ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందని ఫిలిం సర్కిల్స్ టాక్ వినిపిస్తోంది. దానికి రీజన్ ఈ ప్రాజెక్ట్ తర్వాత శర్వా ఓకె చేసుకున్న కృష్ణ చైతన్య సినిమాను తాజాగా ప్రారంభించడం. కొన్ని నెలల క్రితం నితిన్ తో పవర్ పేట అనే సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు కృష్ణ చైతన్య. నితిన్ కూడా ‘పవర్ పేట’ గురించి కొన్ని ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు. ఆ సినిమా రెడీ టు స్టార్ట్ అనే స్టేజి వరకూ వెళ్ళింది . కానీ అనుకోకుండా క్యాన్సిల్ అయింది.
వెంటనే శర్వా కి ఓ కథ చెప్పి గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడు కృష్ణ చైతన్య. ఆ సినిమానే శర్వా 33గా ప్రారంభమైంది. దీంతో ఇక శర్వా రాజు సుందరం కాంబో లేనట్టే అని అర్థమవుతుంది. కొన్నేళ్లుగా కొరియోగ్రాఫర్ గా వర్క్ చేస్తూ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న రాజు సుందరం తమిళ్ లో దర్శకుడిగా అజిత్ తో ఓ సినిమా చేశాడు. కానీ తెలుగులో మాత్రం డైరెక్టర్ గా డెబ్యూ ఇవ్వలేకపోతున్నాడు. మరి త్వరలోనే ఇంకో హీరోని పట్టుకొని సినిమా చేస్తాడా ? లేదా శర్వానే కన్విన్స్ చేసి సెట్ చేసుకుంటాడా ? చూడాలి.
This post was last modified on September 6, 2022 6:11 am
రెండు నెలల కిందట రిలీజైన దురంధర్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవలం…
బుల్లితెరపై ఘన చరిత్ర ఉన్న ఈటీవీ ప్రభాకర్ నట వారసత్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్రహాస్.. తన…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని.. పంది, ఆవు కొవ్వులను కూడా వినియోగించారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో ప్రత్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్దగా కేటాయింపులు ఏమీ…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…