Movie News

సోషల్ మీడియాకు ఛార్మి బ్రేక్

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కొన్న తెలుగు చిత్రం ఏది అంటే.. అందరూ ‘లైగర్’ పేరే చెబుతారు. ఈ సినిమా గురించి విడుదలకు ముందు ఇచ్చిన బిల్డప్‌కు, ఆ తర్వాత సినిమాలో ఉన్న విషయానికి సంబంధం లేకపోవడమే అందుక్కారం. హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పూరి జగన్నాథ్, నిర్మాత ఛార్మి.. ఇలా ఎవరి స్థాయిలో వాళ్లు సినిమాను విపరీతంగా లేపారు. తామో అద్భుతమైన సినిమా తీసినట్లు చెప్పుకున్నారు. కానీ తీరా చూస్తే.. తెర మీద జనాలకు ఒక రొడ్డకొట్టుడు మాస్ మసాలా మూవీ కనిపించింది.

ఆరంభం నుంచి చివరి దాకా సినిమాలో ఎక్కడా చిన్న స్పార్క్ కనిపించలేదు. దీని గురించా ఇంత బిల్డప్ ఇచ్చారు అంటూ.. మార్నింగ్ షో దగ్గర్నుంచే విపరీతంగా సినిమాను ట్రోల్ చేశారు నెటిజన్లు. నెగెటివ్ టాక్ అడవిని కాల్చేస్తున్న మంట లాగా విస్తరించింది. దీంతో సినిమా తొలి రోజూ బూడిదైపోయింది. వీకెండ్లో కూడా సినిమా సరైన వసూళ్లు రాబట్టలేకపోయింది.

హీరో విజయ్ మాత్రమే కాక దర్శకుడు పూరి, నిర్మాత ఛార్మిల మీద సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. విజయ్, పూరి సోషల్ మీడియాలో ఇన్‌యాక్టివ్‌గానే ఉన్నారు కానీ.. ఛార్మి తమ సినిమా గురించి పాజిటివ్ ట్వీట్లును తీసి రీట్వీట్ చేస్తూ కనిపించింది. కానీ వాటి కింద జనాలు తీవ్ర స్థాయిలో స్పందించారు. ఆమెను బూతులు తిట్టారు. అవి కాక ఛార్మిని ట్యాగ్ చేసి వేసిన ట్రోల్ ట్వీట్లు ఎన్నో. వీటి ధాటికి ఛార్మి సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకుంది.

ఈ విషయాన్ని స్వయంగా ఆమె ట్విట్టర్ అకౌంట్లో వెల్లడించింది. ‘‘చిల్ గయ్స్.. చిన్న బ్రేక్ తీసుకుంటున్నా (సోషల్ మీడియా నుంచి). పూరి కనెక్ట్స్ పుంజుకుంటుంది.. ఇంకా మెరుగ్గా, పెద్దగా. అప్పటి వరకు మీరు బతకండి. వేరే వాళ్లను బతకినవ్వండి’’ అని ఛార్మి ట్వీట్ చేసింది. చివర్లో అన్న ‘బతకండి.. బతకనివ్వండి’ అనే మాటను అనుసరించి ఆమె సోషల్ మీడియా ట్రోల్స్ దెబ్బకు బెంబేలెత్తిపోయిందని అర్థమవుతోంది. అందుకే సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లుంది.

This post was last modified on September 4, 2022 8:42 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

విద్యుత్ చార్జీల పెంపుపై చంద్ర‌బాబు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

అస‌లే వేస‌వి కాలం.. సాధార‌ణ ఇళ్ల‌లో ఫాన్లు.. మ‌ధ్య‌త‌ర‌గ‌తి ఇళ్ల‌లో కూల‌ర్లు, ఆపై త‌ర‌గ‌తుల ఇళ్ల‌లో ఏసీలు క‌నీసంలో క‌నీసం…

14 minutes ago

కెమెరామెన్ పేల్చిన ‘విశ్వంభర’ బాంబులు

విపరీతమైన ఆలస్యానికి గురై, అభిమానుల సహనాన్ని పరీక్షిస్తూ వచ్చిన విశ్వంభర విడుదల తేదీ ఇప్పటికీ ఖరారు కాలేదు. రెండు సంక్రాంతులు…

34 minutes ago

కావూరి సాంబ‌శివ‌రావు మృతి.. తెలుసుకోవాల్సింది ఏంటంటే!

కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబ‌శివ‌రావు.. బుధ‌వారం ఉద‌యం మృతి చెందారు. గ‌త కొన్నాళ్లుగా…

1 hour ago

దానంకు స్పీకర్ క్లీన్ చిట్… కరెక్టేనా?

తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల కేసు వ్యవహారం ఆసక్తి రేపిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ కు 10…

3 hours ago

మహేష్ అభిమానులకు హరీష్ సారి

సోషల్ మీడియాలో చాలా అలెర్ట్ గా ఉండాలి. ముఖ్యంగా సెలబ్రిటీలు బిజీగా షెడ్యూల్స్ లో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా…

4 hours ago

కొత్త శుక్రవారం గంగార్పణం అవుతోంది

థియేటర్లకు సరైన సినిమాలు వస్తే రావడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. ఎటొచ్చి వాళ్ళను కనీస స్థాయిలో మెప్పించే కంటెంట్ ఉన్నవి…

4 hours ago