Movie News

సోషల్ మీడియాకు ఛార్మి బ్రేక్

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కొన్న తెలుగు చిత్రం ఏది అంటే.. అందరూ ‘లైగర్’ పేరే చెబుతారు. ఈ సినిమా గురించి విడుదలకు ముందు ఇచ్చిన బిల్డప్‌కు, ఆ తర్వాత సినిమాలో ఉన్న విషయానికి సంబంధం లేకపోవడమే అందుక్కారం. హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పూరి జగన్నాథ్, నిర్మాత ఛార్మి.. ఇలా ఎవరి స్థాయిలో వాళ్లు సినిమాను విపరీతంగా లేపారు. తామో అద్భుతమైన సినిమా తీసినట్లు చెప్పుకున్నారు. కానీ తీరా చూస్తే.. తెర మీద జనాలకు ఒక రొడ్డకొట్టుడు మాస్ మసాలా మూవీ కనిపించింది.

ఆరంభం నుంచి చివరి దాకా సినిమాలో ఎక్కడా చిన్న స్పార్క్ కనిపించలేదు. దీని గురించా ఇంత బిల్డప్ ఇచ్చారు అంటూ.. మార్నింగ్ షో దగ్గర్నుంచే విపరీతంగా సినిమాను ట్రోల్ చేశారు నెటిజన్లు. నెగెటివ్ టాక్ అడవిని కాల్చేస్తున్న మంట లాగా విస్తరించింది. దీంతో సినిమా తొలి రోజూ బూడిదైపోయింది. వీకెండ్లో కూడా సినిమా సరైన వసూళ్లు రాబట్టలేకపోయింది.

హీరో విజయ్ మాత్రమే కాక దర్శకుడు పూరి, నిర్మాత ఛార్మిల మీద సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. విజయ్, పూరి సోషల్ మీడియాలో ఇన్‌యాక్టివ్‌గానే ఉన్నారు కానీ.. ఛార్మి తమ సినిమా గురించి పాజిటివ్ ట్వీట్లును తీసి రీట్వీట్ చేస్తూ కనిపించింది. కానీ వాటి కింద జనాలు తీవ్ర స్థాయిలో స్పందించారు. ఆమెను బూతులు తిట్టారు. అవి కాక ఛార్మిని ట్యాగ్ చేసి వేసిన ట్రోల్ ట్వీట్లు ఎన్నో. వీటి ధాటికి ఛార్మి సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకుంది.

ఈ విషయాన్ని స్వయంగా ఆమె ట్విట్టర్ అకౌంట్లో వెల్లడించింది. ‘‘చిల్ గయ్స్.. చిన్న బ్రేక్ తీసుకుంటున్నా (సోషల్ మీడియా నుంచి). పూరి కనెక్ట్స్ పుంజుకుంటుంది.. ఇంకా మెరుగ్గా, పెద్దగా. అప్పటి వరకు మీరు బతకండి. వేరే వాళ్లను బతకినవ్వండి’’ అని ఛార్మి ట్వీట్ చేసింది. చివర్లో అన్న ‘బతకండి.. బతకనివ్వండి’ అనే మాటను అనుసరించి ఆమె సోషల్ మీడియా ట్రోల్స్ దెబ్బకు బెంబేలెత్తిపోయిందని అర్థమవుతోంది. అందుకే సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లుంది.

This post was last modified on September 4, 2022 8:42 pm

Share

Recent Posts

వివేకా హత్యకు రూ.40 కోట్ల సుపారీ?

కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…

23 minutes ago

మెగాస్టార్ ప్రస్థానం… టాలీవుడ్ మాస్ సంతకం

తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి…

33 minutes ago

సందీప్ వంగ ‘చిరు’ ఫ్యానిజం… ఇది చాలా లోతు బాసూ

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…

53 minutes ago

చిరంజీవి కాకా… అదిరింది కానుక

ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…

1 hour ago

ప్యారడైజ్ నిర్ణయం ఇరుముడికి వరం

ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…

2 hours ago

గవర్నర్ గా యనమల రామకృష్ణుడు?

కేంద్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జంతర్ మంతర్ దెబ్బకు కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయడం తెలిసిందే.…

4 hours ago