Movie News

సరికొత్త టెక్నాలజీతో 8K సింహాసనం

ఎంత టెక్నాలజీ పెరిగినా ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్స్ ని వెండితెర మీద చూసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రేక్షకులు తేల్చి చెప్పేశారు. పోకిరి 1 కోటి 70 లక్షల గ్రాస్ తో వామ్మో అనిపిస్తే జల్సా ఏకంగా డబుల్ మార్జిన్ తో 3.2 కోట్లు సాధించి మతులు పోగొట్టింది. తమ్ముడు, ఒక్కడు సైతం మంచి స్పందన దక్కించుకున్నాయి. ఘరానా మొగుడుకి క్వాలిటీ ఇష్యూస్ వల్ల కొంత ఇబ్బంది కలిగింది కానీ సరైన ప్లానింగ్ ఉంటే మెగాస్టార్ సైతం ముప్పై ఏళ్ళ పాత సినిమాతో రికార్డులు బద్దలు కొట్టేవారే. ఇక్కడితో ఈ రీ రిలీజుల కహాని అయిపోలేదు.

సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ టైం మెషీన్ ని మరింత వెనక్కు తీసుకెళ్లబోతున్నారు. 1986లో వచ్చిన ఆల్ టైం హిట్ సింహాసనంని 8K రెజోల్యూషన్ తో పాటు డాల్బీ డిటిఎస్ తో రీ మాస్టరింగ్ చేయిస్తున్నారు. టాలీవుడ్ మొదటి 70 ఎంఎం మూవీగా ఈ చిత్రం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. స్టీరియో ఫోనిక్ సౌండ్ ని దీని ద్వారానే పరిచయం చేశారు. అప్పట్లో సింహాసనం ఓపెనింగ్స్ గురించి పత్రికల్లో ఎన్ని కథనాలు వచ్చేవో. ఎక్కడ చూసినా జనం కలెక్షన్ల గురించి మాట్లాడుకునేవాళ్ళు. బప్పీలహరి సంగీతం పెద్ద సెన్సేషన్. ఆకాశంలో ఒక తార, వాహవా నీ యవ్వనం సాంగ్స్ ఇప్పుడు విన్నా గూస్ బంప్స్ ఖాయం.

అలాంటి మాస్టర్ పీస్ ని కొత్త సాంకేతికతతో అందించడం మంచి పరిణామం. బాహుబలి తరహాలో ఇది కూడా జానపద ఫాంటసీ. ప్రభాస్ లాగే కృష్ణ గారిది డ్యూయల్ రోల్, జయప్రద, మందాకినీ, రాధల గ్లామర్ కి ఆనాటి యూత్ పరవశించిపోయారు. షోలే ఫేమ్ అంజాద్ ఖాన్ నటించడం మరో ప్రత్యేకత. ఇలా ఎన్నో విశేషాలు ఉన్న సింహాసనంని సరికొత్తగాఎక్స్ పీరియన్స్ చేయించాలనుకోవడం మంచి ఆలోచన. ఇదంతా ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటున్నాం కానీ 2010లో మాయాబజార్ కలర్ వెర్షన్ ని రీ రిలీజ్ చేయడం ద్వారా ఎప్పుడో దీనికి బీజం పడింది. కాకపోతే ఇప్పుడు ఊపొచ్చింది.

This post was last modified on September 4, 2022 8:49 am

Share
Show comments
Published by
Tharun

Recent Posts

మిరల్ రిపోర్ట్ ఏంటి

నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…

2 hours ago

త్రివిక్రమ్ కోసం స్రవంతి ప్రయత్నాలు

గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…

4 hours ago

టీడీపీలో 92 గెలుపు గుర్రాలు.. అధికారం ఖాయ‌మే!

బీజేపీ, జ‌న‌సేన‌లతో కూట‌మి క‌ట్టిన టీడీపీ ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోరాటం చేసిన విష‌యం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…

5 hours ago

గురుశిష్యులతో రామ్ చరణ్ సింగిల్ ప్లాన్

గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…

5 hours ago

జగన్ విమానం ఖర్చు అంతుంటుందా ?

ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…

6 hours ago

ప్రేక్షకుల అటెండెన్సుకి ఎవరిది బాధ్యత

చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…

6 hours ago