ఎంత టెక్నాలజీ పెరిగినా ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్స్ ని వెండితెర మీద చూసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రేక్షకులు తేల్చి చెప్పేశారు. పోకిరి 1 కోటి 70 లక్షల గ్రాస్ తో వామ్మో అనిపిస్తే జల్సా ఏకంగా డబుల్ మార్జిన్ తో 3.2 కోట్లు సాధించి మతులు పోగొట్టింది. తమ్ముడు, ఒక్కడు సైతం మంచి స్పందన దక్కించుకున్నాయి. ఘరానా మొగుడుకి క్వాలిటీ ఇష్యూస్ వల్ల కొంత ఇబ్బంది కలిగింది కానీ సరైన ప్లానింగ్ ఉంటే మెగాస్టార్ సైతం ముప్పై ఏళ్ళ పాత సినిమాతో రికార్డులు బద్దలు కొట్టేవారే. ఇక్కడితో ఈ రీ రిలీజుల కహాని అయిపోలేదు.
సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ టైం మెషీన్ ని మరింత వెనక్కు తీసుకెళ్లబోతున్నారు. 1986లో వచ్చిన ఆల్ టైం హిట్ సింహాసనంని 8K రెజోల్యూషన్ తో పాటు డాల్బీ డిటిఎస్ తో రీ మాస్టరింగ్ చేయిస్తున్నారు. టాలీవుడ్ మొదటి 70 ఎంఎం మూవీగా ఈ చిత్రం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. స్టీరియో ఫోనిక్ సౌండ్ ని దీని ద్వారానే పరిచయం చేశారు. అప్పట్లో సింహాసనం ఓపెనింగ్స్ గురించి పత్రికల్లో ఎన్ని కథనాలు వచ్చేవో. ఎక్కడ చూసినా జనం కలెక్షన్ల గురించి మాట్లాడుకునేవాళ్ళు. బప్పీలహరి సంగీతం పెద్ద సెన్సేషన్. ఆకాశంలో ఒక తార, వాహవా నీ యవ్వనం సాంగ్స్ ఇప్పుడు విన్నా గూస్ బంప్స్ ఖాయం.
అలాంటి మాస్టర్ పీస్ ని కొత్త సాంకేతికతతో అందించడం మంచి పరిణామం. బాహుబలి తరహాలో ఇది కూడా జానపద ఫాంటసీ. ప్రభాస్ లాగే కృష్ణ గారిది డ్యూయల్ రోల్, జయప్రద, మందాకినీ, రాధల గ్లామర్ కి ఆనాటి యూత్ పరవశించిపోయారు. షోలే ఫేమ్ అంజాద్ ఖాన్ నటించడం మరో ప్రత్యేకత. ఇలా ఎన్నో విశేషాలు ఉన్న సింహాసనంని సరికొత్తగాఎక్స్ పీరియన్స్ చేయించాలనుకోవడం మంచి ఆలోచన. ఇదంతా ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటున్నాం కానీ 2010లో మాయాబజార్ కలర్ వెర్షన్ ని రీ రిలీజ్ చేయడం ద్వారా ఎప్పుడో దీనికి బీజం పడింది. కాకపోతే ఇప్పుడు ఊపొచ్చింది.
This post was last modified on September 4, 2022 8:49 am
గత నెల మధ్యలో ‘ది ఒడిస్సీ’ సినిమా రిలీజ్ టైంలో ఎంత హడావుడి నెలకొందో చూశాం. ప్రస్తుతం వరల్డ్ సినిమా…
లోకేష్ కనగరాజ్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఖైదీతో మొదలైన ఇతని ప్రభంజనం విక్రమ్ దాకా ఓ రేంజ్ లో…
బోరుగడ్డ అనిల్ కుమార్ ఏపీ ప్రజలకు బాగా గుర్తున్న పేరు. వైసీపీ అధికారంలో ఉండగా... జగన్ ఆదేశిస్తే టీడీపీ అదినేత, ఏపీ…
డిసెంబర్ 3 ఎప్పుడెప్పుడు వస్తుందాని ప్రభాస్ అభిమానులు కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. ముందు రోజే ప్రీమియర్లు ఉంటాయని…
లోకనాయకుడు కమల్ హాసన్ పనైపోయిందనుకున్న సమయంలో ఆయన అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చిన సినిమా.. విక్రమ్. ఆ సినిమాతోనే సౌత్…
తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నటి త్రిష,…