పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ ప్రీమియర్ గా వేసిన జల్సా రీ రిలీజ్ కొత్త రికార్డులు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 700 పైగా షోలతో నయా ట్రెండ్ కి శ్రీకారం చుట్టింది. కొద్దిరోజుల క్రితం వచ్చిన పోకిరిని ఇప్పట్లో ఎవరూ టచ్ చేయలేరనుకుంటే జల్సా దాన్ని దాటేసి రాబోయే ఓల్డ్ క్లాసిక్స్ కి కొత్త సవాలు విసిరింది. ముఖ్యంగా హైదరాబాద్ లో పవర్ స్టార్ అరాచకం మాములుగా లేదు. ముందు ఒకటి రెండు ఆటలకు పరిమితం చేద్దామనుకున్న ఆర్టిసి క్రాస్ రోడ్స్ లో పూటకోసారి షోలు పెంచుకుంటూ పోయారు.
ఇక ప్రసాద్ ఐమ్యాక్స్ లోపల బయట జరిగిన రభస గురించి ఎంత చెప్పినా తక్కువే. కొత్త సినిమాలు రంగరంగ వైభవంగా, కోబ్రా, ఫస్ట్ డే ఫస్ట్ షో, బుజ్జి ఇలారా టికెట్లు ఈజీగా దొరుకుతుండగా జల్సాను మాత్రం కొన్ని చోట్ల బ్లాక్ లో అమ్మారంటే అతిశయోక్తిగా అనిపించవచ్చు కానీ ఇది నిజం. ఫైనల్ గా ఎంత గ్రాస్ ఎంతొస్తుందనే దాని మీద రకరకాల అంచనాలు ఉన్నాయి. ఎంతలేదన్నా రెండు కోట్ల మార్కుని ఈజీగా దాటే సూచనలు పుష్కలంగా ఉన్నాయి. థియేటర్లలో చేసిన సందడి తాలూకు వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరలయ్యాయి.
అయితే ఈ షోలకు సంబంధించిన నెగటివ్ యాంగిల్ లేకపోలేదు. కొన్ని చోట్ల అభిమానుల అత్యుత్సాహం వల్ల థియేటర్ ఆస్తులకు నష్టం కలిగింది. కర్నూలు శ్రీరామలో సౌండ్ సిస్టమ్ వల్ల ఇబ్బంది కలిగి షోలు క్యాన్సిల్ చేస్తే అద్దాలు పగలగొట్టి నానా రచ్చ చేశారు. విశాఖ లీలామహల్ హాల్లో సీట్లు ధ్వంసం చేసి స్క్రీన్ కి డ్యామేజ్ కలిగించారు. చేసేది కొందరే అయినా చెడ్డపేరు మాత్రం అందరికీ వచ్చేలా ఉంది. మొత్తానికి జల్సా ఇలా అన్ని రకాలుగా సెన్సేషనే అయ్యింది. 14 ఏళ్ళ తర్వాత యూట్యూబ్ లో ఫ్రీగా ఉన్న సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూసేందుకు ఇంతగా తపించిపోయారంటే జల్సా మేనియా మామూలుది కాదనే విషయం అర్థమైపోయిందిగా.
తమిళ సినిమాలో దశాబ్దాల పాటు ఆధిపత్యం చలాయించిన సూపర్ స్టార్లు రజినీకాంత్. కమల్ హాసన్ వ్యక్తిగతంగా మంచి మిత్రులన్న సంగతి…
ఏపీలో ఇప్పుడు కాపు సామాజిక వర్గం కేంద్రంగా రసవత్తర రాజకీయం నడుస్తోంది. నిన్నటికి నిన్న వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు…
మా ఇంటి బంగారం కథ ముందుగా సాయిపల్లవి దగ్గరికి వెళ్లిన సంగతి సమంత స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పాక బయటికి వచ్చింది.…
స్టార్ అన్న గుర్తింపు తెచ్చుకోలేకపోయి ఉండొచ్చు కానీ.. తమిళ, తెలుగు భాషల్లో సీనియర్ నటుడు ఆనంద్కు మంచి గుర్తింపే ఉంది.…
ముంబైలో ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్ యోగా డే వేడుకల్లో హీరోయిన్ శ్రీలీలకు అవమానం జరిగిందని సోషల్ మీడియాలో ఒక వీడియో…
తప్పు చేసింది కేంద్ర ప్రభుత్వం. తన తప్పును ఏమాత్రం పట్టించుకోని కేంద్రం… విద్యార్థులు చేసిన చిన్నపాటి తప్పులకూ పెద్ద శిక్షలేసింది.…