పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ ప్రీమియర్ గా వేసిన జల్సా రీ రిలీజ్ కొత్త రికార్డులు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 700 పైగా షోలతో నయా ట్రెండ్ కి శ్రీకారం చుట్టింది. కొద్దిరోజుల క్రితం వచ్చిన పోకిరిని ఇప్పట్లో ఎవరూ టచ్ చేయలేరనుకుంటే జల్సా దాన్ని దాటేసి రాబోయే ఓల్డ్ క్లాసిక్స్ కి కొత్త సవాలు విసిరింది. ముఖ్యంగా హైదరాబాద్ లో పవర్ స్టార్ అరాచకం మాములుగా లేదు. ముందు ఒకటి రెండు ఆటలకు పరిమితం చేద్దామనుకున్న ఆర్టిసి క్రాస్ రోడ్స్ లో పూటకోసారి షోలు పెంచుకుంటూ పోయారు.
ఇక ప్రసాద్ ఐమ్యాక్స్ లోపల బయట జరిగిన రభస గురించి ఎంత చెప్పినా తక్కువే. కొత్త సినిమాలు రంగరంగ వైభవంగా, కోబ్రా, ఫస్ట్ డే ఫస్ట్ షో, బుజ్జి ఇలారా టికెట్లు ఈజీగా దొరుకుతుండగా జల్సాను మాత్రం కొన్ని చోట్ల బ్లాక్ లో అమ్మారంటే అతిశయోక్తిగా అనిపించవచ్చు కానీ ఇది నిజం. ఫైనల్ గా ఎంత గ్రాస్ ఎంతొస్తుందనే దాని మీద రకరకాల అంచనాలు ఉన్నాయి. ఎంతలేదన్నా రెండు కోట్ల మార్కుని ఈజీగా దాటే సూచనలు పుష్కలంగా ఉన్నాయి. థియేటర్లలో చేసిన సందడి తాలూకు వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరలయ్యాయి.
అయితే ఈ షోలకు సంబంధించిన నెగటివ్ యాంగిల్ లేకపోలేదు. కొన్ని చోట్ల అభిమానుల అత్యుత్సాహం వల్ల థియేటర్ ఆస్తులకు నష్టం కలిగింది. కర్నూలు శ్రీరామలో సౌండ్ సిస్టమ్ వల్ల ఇబ్బంది కలిగి షోలు క్యాన్సిల్ చేస్తే అద్దాలు పగలగొట్టి నానా రచ్చ చేశారు. విశాఖ లీలామహల్ హాల్లో సీట్లు ధ్వంసం చేసి స్క్రీన్ కి డ్యామేజ్ కలిగించారు. చేసేది కొందరే అయినా చెడ్డపేరు మాత్రం అందరికీ వచ్చేలా ఉంది. మొత్తానికి జల్సా ఇలా అన్ని రకాలుగా సెన్సేషనే అయ్యింది. 14 ఏళ్ళ తర్వాత యూట్యూబ్ లో ఫ్రీగా ఉన్న సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూసేందుకు ఇంతగా తపించిపోయారంటే జల్సా మేనియా మామూలుది కాదనే విషయం అర్థమైపోయిందిగా.
This post was last modified on September 2, 2022 9:20 pm
https://www.youtube.com/watch?v=ddmpaI3WTvc
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కౌంట్ డౌన్ వేగంగా జరిగిపోతోంది. మార్చి 26 రావాల్సిన ఉస్తాద్ భగత్ సింగ్ హఠాత్తుగా మార్చి…
టాలీవుడ్ మోస్ట్ క్రేజీ మూవీస్ లో ఒకటిగా నిర్మాణంలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ ప్యాన్ ప్యాన్…
విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో పీజీ వైద్య విద్యార్థిని బత్తుల దీపిక ఆత్మహత్య కేసులో కీలక మలుపు తిరిగింది.…
ఏపీలో కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న జనసేన పార్టీ.. ఈ ఏడాది పార్టీ సభ్యత్వాన్ని గత నెలలోనే ప్రారంభించిన…
పార్టీ విధానాలకు, సిద్ధాంతాలకు అనుగుణంగా నాయకులు పనిచేయాలని.. ఎమ్మెల్యేలు-ఎంపీలు కలివిడిగా ఉండాలని సీఎం చంద్రబాబు టీడీపీ నాయకులకు సూచించారు. నంద్యాల…