చెప్పుకోదగ్గ క్యాస్టింగ్ లేకపోయినా ప్రమోషన్ల హడావిడితో జనాల దృష్టిని ఆకట్టుకున్న సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో. మొన్నటిదాకా సోసోగా ఉన్న బజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా రావడంతో అంతో ఇంతో పెరిగింది. దానికి తోడు జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ రచనలో రూపొందిన ఎంటర్ టైనర్ గా బాగా పబ్లిసిటీ ఇచ్చారు.
ఒకపక్క పవన్ కళ్యాణ్ బర్త్ డే సంబరాలు జరుగుతుండగా మరోవైపు ఖుషి సినిమా మొదటి రోజు టికెట్లు సంపాదించడమనే పాయింట్ చుట్టూ రాసుకున్న ఈ బొమ్మ మీద పవర్ స్టార్ ఫ్యాన్స్ కి కాసిన్ని అంచనాలు పెరిగాయి. హంగామా ఎంత చేసినా షార్ట్ ఫిలింకి సరిపోయే చిన్న పాయింట్ ని పట్టుకుని రెండు గంటల ఫుల్ లెన్త్ సిల్వర్ స్క్రీన్ డ్రామాగా మలచడంలో దర్శకులు వంశీధర్ – లక్ష్మినారాయణలు తడబడ్డారు. అటు నవ్వించలేక ఇటు ఎమోషనల్ గా మెప్పించలేక ఫస్ట్ డే ఫస్ట్ షో నిరాశ కలిగించింది.
ప్రేమించిన అమ్మాయి ఖుషి బెనిఫిట్ షో టికెట్ సంపాదించుకు రమ్మని చెప్పే పాయింట్ వినడానికి బాగానే ఉన్నా కేవలం దాని చుట్టే ఇంతేసి డ్రామాను నడిపించడంతో సిల్లీగా మారిపోయింది. దీనికి ఉపకథలు ఏవైనా జోడించి ఆ టికెట్ వ్యవహారాన్ని బ్యాక్ గ్రౌండ్ లో నడిపించినా కొంత ఫలితం ఉండేది కానీ అలా జరగలేదు. లీడ్ పెయిర్ శ్రీకాంత్ రెడ్డి, సంచిత బసులతో పాటు సీనియర్ క్యాస్టింగ్ పెర్ఫార్మన్స్ పరంగా ఎవరికి వారు బాగానే చేసినప్పటికీ వీక్ రైటింగ్ వల్ల తేలిపోయింది.
జాతిరత్నాలుని కేవలం జోకులు హిట్ చేయలేదు. ఓ క్రైమ్ ఎలిమెంట్ ని తగిలించి దాన్ని ఎంటర్ టైనింగ్ గా చెప్పిన విధానం పేలింది. కానీ ఈ ఫస్ట్ డే ఫస్ట్ షోలో అలాంటి మెరుపులేమీ లేవు. అక్కడక్కడా రెండు మూడు జోకులు నవ్వించినా ఓవరాల్ గా బోర్ కొట్టించే స్క్రీన్ ప్లేతో ఈ సినిమాకి ఈవెనింగ్ షోకే జనాలు రాకుండా చేశారు. హార్డ్ కోర్ పవన్ ఫ్యాన్స్ కే నచ్చే అవకాశాలు తక్కువగా ఉంటే ఇక వేరే హీరోల అభిమానుల గురించి చెప్పేదేముంది.
This post was last modified on September 2, 2022 5:58 pm
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…
ఏపీలో వచ్చే మూడు మాసాల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నాయకులు అలెర్టుగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు.…
ఏపీ పునర్నిర్మాణానికి తాము చేస్తున్న ప్రయత్నాలను వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. అభివృద్ధి కోసం చేపడుతున్న ప్రతి…
ఎన్టీఆర్ వీరాభిమాని, తెలుగుదేశం పార్టీకి అంకితభావంతో సేవలందించిన ఎన్టీఆర్ రాజు అకాల మరణానికి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన నందమూరి…