ఆర్ఆర్ఆర్ సందడి ముగిసిపోయి నెలలు గడుస్తున్నా జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాకపోవడం ఫ్యాన్స్ ని కలవరపెడుతోంది. ఆచార్య ఫలితంతో సంబంధం లేకుండా కొరటాల శివతో కొనసాగాలని తారక్ డిసైడ్ అయిపోయిన సంగతి తెలిసిందే. ఆ మేరకు సెమి లుక్ పోస్టర్ లాంటిది వదిలి కన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. ఇది యంగ్ టైగర్ బర్త్ డే నాటి ముచ్చట. ఆపై సౌండ్ లేదు. మరోవైపు ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు తన గురువు సహకారంతో కొత్త స్క్రిప్ట్ ని చెక్కే పనిలో యమా బిజీగా ఉంటూ అప్పుడప్పుడు ఫోటోలు కూడా పెడుతున్నాడు.
దీనికి పెద్ది అనే టైటిల్ ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇది స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుందని ఎప్పుడో లీక్ వచ్చింది. ఇందులో తారక్ తండ్రి కొడుకుగా డ్యూయల్ రోల్ చేస్తాడని, ఒక పాత్ర వీల్ చైర్ కు అతుక్కుపోయిన అరవై ఏళ్ళ వయసులో ఉంటే, మరో క్యారెక్టర్ యువకుడైన కబడ్డీ ప్లేయర్ గా ఉంటుందట. ఈ రెండు రోల్స్ ని ప్రెజెంట్ చేసే తీరు, ఎమోషన్స్ రాబట్టే విధానం ఓ రేంజ్ లో ఉంటాయని అంటున్నారు. రంగస్థలం, పుష్ప హీరోల క్యారెక్టరైజేషన్స్ ని కంబైన్ చేసి ఎప్పుడూ చూడని సరికొత్త ఫ్లేవర్ తో ప్రెజెంట్ చేస్తారని వినికిడి.
ఇలా ఫాదర్ అండ్ సన్ గా జూనియర్ కనిపించింది 2004లో వచ్చిన ఆంధ్రావాలాలోనే. అదెంత చేదు అనుభవమో అభిమానులు అంత సులభంగా మర్చిపోలేరు. కాకపోతే అప్పటికి ఇప్పటికి వయసులో చాలా వ్యత్యాసం వచ్చేసింది కాబట్టి ఆ ఇబ్బంది ఉండదు. ఇది నిజమో కాదో కాసేపు పక్కనపెడితే ఫ్యాన్స్ కి కొంత ఉత్సాహం వచ్చేలా అప్పుడప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటే మంచిది. ప్రశాంత్ నీల్ సైతం తన సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి షూటింగ్ ని చెప్పాడు కానీ ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఆ మాటకే కట్టుబడి ఉంటారన్న గ్యారెంటీ లేదు. సో అన్నిటికి కాలమే సమాధానం చెప్పాలి.
2000కు అటు, ఇటు వైభవం చూసిన ఎంతోమంది సీనియర్ హీరోలు.. తర్వాతి కాలంలో యువ కథానాయకుల పోటీని తట్టుకోలేక, మారుతున్న…
గేమ్ ఛేంజర్, ఇండియన్ 2 దారుణ ఫలితాలు పక్కనపెడితే దర్శకుడు శంకర్ ఒకప్పుడు సౌత్ ఇండియన్ ఫిలిం మేకింగ్ ని…
ఏపీలో వెలుగు చూసిన మద్యం కుంభకోణంలో గురువారం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. లిక్కర్ కుంభకోణంలో అదనంగా లిక్కర్ రవాణాలోనూ…
దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పిన ప్రకారమే తన కొత్త సినిమా షూటింగ్ ఇవాళ మొదలుపెట్టేశారు. వెంకటేష్ కళ్యాణ్ రామ్ కలయికలో…
ఏపీలోని బీచ్ లలో విదేశాల్లో మాదిరి బార్లను ప్రవేశపెట్టాలన్న నిర్ణయంపై విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో పర్యాటక రంగానికి ఊతం ఇచ్చే…
మొబైల్ ఫోన్లు అందరి దగ్గరా ఉంటాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రతి 10 మందిలో ఏడుగురు ఏదో ఒక మొబైల్…