2022 ఆగస్టు నెల టాలీవుడ్కు చిరస్మరణీయం అనే చెప్పాలి. ఈ నెలలో రెండు వారాల వ్యవధిలో మూడు భారీ విజయాలు టాలీవుడ్ సొంతం అయ్యాయి. నెలాఖర్లో వచ్చిన ‘లైగర్’కు కూడా బంపర్ క్రేజ్ వచ్చింది. ఓపెనింగ్స్ కూడా అదిరిపోయాయి. సినిమాకు ఏమాత్రం మంచి టాక్ వచ్చినా కథ వేరుగా ఉండేది. 2022 ఆగస్టు ఇంకా స్పెషల్ అయ్యుండేది. ‘లైగర్’ నిరాశ పరిచినప్పటికీ ఈ నెలను టాలీవుడ్ మరిచిపోలేదు. ఇప్పుడిక అందరి దృష్టి సెప్టెంబరు మీదికి మళ్లుతోంది.
‘లైగర్’ తేడా కొట్టడంతో పాత చిత్రాలైన కార్తికేయ-2, సీతారామం, బింబిసారనే ఇంకా బాక్సాఫీస్ను ఏలుతున్నాయి. 3-4 వారాల్లో కూడా అవి మంచి వసూళ్లు సాధిస్తున్నాయి. ఐతే ఇవి ఎంత బాగా ఆడుతున్నప్పటికీ.. కొత్త చిత్రాలు వచ్చాయంటే ప్రేక్షకుల దృష్టి అటు వైపు మళ్లుతుంది. వాటిలో తమకు కనెక్ట్ అయ్యే సినిమా ఉంటే, దానికి మంచి టాక్ వస్తే ఆదరిస్తారు. అందులోనూ ‘లైగర్’ బాగా డిజప్పాయింట్ చేసిన నేపథ్యంలో ఇంకో మంచి సినిమా చూడాలని అనుకుంటారు.
ఈ సిచువేషన్ మెగా కుర్రాడు వైష్ణవ్ తేజ్కు కలిసొచ్చేదే. అతడి కొత్త చిత్రం ‘రంగ రంగ వైభవంగా’ వచ్చే శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో పాటుగా అరడజను సినిమాల దాకా రిలీజవుతున్నాయి. మిగతా తెలుగు చిత్రాలతో పోలిస్తే తమిళ అనువాదం ‘కోబ్రా’తోనే వైష్ణవ్ సినిమాకు పోటీ ఉండొచ్చు. కాకపోతే అది బుధవారం వినాయక చవితి రోజే రిలీజైపోతోంది. దాని సందడి రెండు రోజులే ఉండొచ్చు. ఆ చిత్రం మీద తెలుగు ప్రేక్షకుల్లో మరీ అంచనాలైతే లేవు.
సినిమా ఆహా ఓహో అంటే తప్ప ఆడే అవకాశాలు తక్కు. ఈ వారానికి ప్రధానంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నది, ముఖ్యంగా యూత్లో బజ్ ఉన్నది ‘రంగ రంగ వైభవంగా’కే. కాబట్టి సినిమాకు మంచి టాక్ వస్తే.. ఆగస్టు సినిమాల మాదిరే ఇది కూడా థియేటర్లను కళకళలాడించడం, పెద్ద హిట్గా నిలవడం ఖాయం. మరి సినిమా అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి. ‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్తో దర్శకుడిగా పరిచయం అయిన గిరీశయ్య ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. కేతిక శర్మ కథానాయికగా నటించింది.
This post was last modified on August 29, 2022 4:28 pm
తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల కేసు వ్యవహారం ఆసక్తి రేపిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ కు 10…
సోషల్ మీడియాలో చాలా అలెర్ట్ గా ఉండాలి. ముఖ్యంగా సెలబ్రిటీలు బిజీగా షెడ్యూల్స్ లో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా…
థియేటర్లకు సరైన సినిమాలు వస్తే రావడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. ఎటొచ్చి వాళ్ళను కనీస స్థాయిలో మెప్పించే కంటెంట్ ఉన్నవి…
తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డిలు..…
వంటగ్యాస్ కొరత కారణంగా దేశవ్యాప్తంగా చిన్న హోటళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. హోటళ్లకు సరఫరా అయ్యే కమర్షియల్ సిలిండర్ల పంపిణీని…
రాష్ట్రంలోని పలు మున్సిపల్ సంస్థల్లో పాలకవర్గాల గడువు ముగియడంతో అక్కడ స్పెషల్ ఆఫీసర్ల పాలన అమల్లోకి రానుంది. మున్సిపల్ కార్పొరేషన్లు,…