2022 ఆగస్టు నెల టాలీవుడ్కు చిరస్మరణీయం అనే చెప్పాలి. ఈ నెలలో రెండు వారాల వ్యవధిలో మూడు భారీ విజయాలు టాలీవుడ్ సొంతం అయ్యాయి. నెలాఖర్లో వచ్చిన ‘లైగర్’కు కూడా బంపర్ క్రేజ్ వచ్చింది. ఓపెనింగ్స్ కూడా అదిరిపోయాయి. సినిమాకు ఏమాత్రం మంచి టాక్ వచ్చినా కథ వేరుగా ఉండేది. 2022 ఆగస్టు ఇంకా స్పెషల్ అయ్యుండేది. ‘లైగర్’ నిరాశ పరిచినప్పటికీ ఈ నెలను టాలీవుడ్ మరిచిపోలేదు. ఇప్పుడిక అందరి దృష్టి సెప్టెంబరు మీదికి మళ్లుతోంది.
‘లైగర్’ తేడా కొట్టడంతో పాత చిత్రాలైన కార్తికేయ-2, సీతారామం, బింబిసారనే ఇంకా బాక్సాఫీస్ను ఏలుతున్నాయి. 3-4 వారాల్లో కూడా అవి మంచి వసూళ్లు సాధిస్తున్నాయి. ఐతే ఇవి ఎంత బాగా ఆడుతున్నప్పటికీ.. కొత్త చిత్రాలు వచ్చాయంటే ప్రేక్షకుల దృష్టి అటు వైపు మళ్లుతుంది. వాటిలో తమకు కనెక్ట్ అయ్యే సినిమా ఉంటే, దానికి మంచి టాక్ వస్తే ఆదరిస్తారు. అందులోనూ ‘లైగర్’ బాగా డిజప్పాయింట్ చేసిన నేపథ్యంలో ఇంకో మంచి సినిమా చూడాలని అనుకుంటారు.
ఈ సిచువేషన్ మెగా కుర్రాడు వైష్ణవ్ తేజ్కు కలిసొచ్చేదే. అతడి కొత్త చిత్రం ‘రంగ రంగ వైభవంగా’ వచ్చే శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో పాటుగా అరడజను సినిమాల దాకా రిలీజవుతున్నాయి. మిగతా తెలుగు చిత్రాలతో పోలిస్తే తమిళ అనువాదం ‘కోబ్రా’తోనే వైష్ణవ్ సినిమాకు పోటీ ఉండొచ్చు. కాకపోతే అది బుధవారం వినాయక చవితి రోజే రిలీజైపోతోంది. దాని సందడి రెండు రోజులే ఉండొచ్చు. ఆ చిత్రం మీద తెలుగు ప్రేక్షకుల్లో మరీ అంచనాలైతే లేవు.
సినిమా ఆహా ఓహో అంటే తప్ప ఆడే అవకాశాలు తక్కు. ఈ వారానికి ప్రధానంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నది, ముఖ్యంగా యూత్లో బజ్ ఉన్నది ‘రంగ రంగ వైభవంగా’కే. కాబట్టి సినిమాకు మంచి టాక్ వస్తే.. ఆగస్టు సినిమాల మాదిరే ఇది కూడా థియేటర్లను కళకళలాడించడం, పెద్ద హిట్గా నిలవడం ఖాయం. మరి సినిమా అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి. ‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్తో దర్శకుడిగా పరిచయం అయిన గిరీశయ్య ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. కేతిక శర్మ కథానాయికగా నటించింది.
This post was last modified on August 29, 2022 4:28 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…