ఇస్మార్ట్ శంకర్ పెద్ద హిట్టయినా సరే.. పూరి జగన్నాథ్ ఫామ్ మీద చాలామందికి సందేహాలు తొలగిపోలేదు. అంతకుముందు ఆయన అలాంటి డిజాస్టర్లు ఇచ్చాడు మరి. అందుకే విజయ్ దేవరకొండ.. పూరితో సినిమా చేస్తుంటే అతడి అభిమానుల్లో చాలామంది వద్దే వద్దన్నారు. కానీ విజయ్ మాత్రం అదేమీ పట్టించుకోకుండా లైగర్ కథ నచ్చేసి, పూరి పనితనం మీద నమ్మకంతో సినిమా చేశాడు.
ఇప్పటిదాకా కెరీర్లో ఏ సినిమాకూ పడనంత కష్టం పడ్డాడు. అత్యధిక సమయమూ వెచ్చించాడు. చివరికి చూస్తే అతడి కష్టమంతా వృథా అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి సినిమా కోసమా ఇంత కష్టం, అంత సమయం పెట్టావు, పూరీతో సినిమా వద్దంటే విన్నావా అంటూ అభిమానులు ఇప్పుడు విజయ్ని సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు. వీళ్ల పరిప్థితి ఇలా ఉంటే.. పామ్ కోల్పోయిన దర్శకులను నమ్మి సినిమాలు చేస్తున్న తమ హీరోల విషయంలో వేరే అభిమానుల్లో ఇప్పుడు కంగారు మొదలైంది.
ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి అభిమానుల టెన్షన్ మామూలుగా లేదు. ఆయన లైనప్ విషయంలో ఇప్పటికే వారిలో తీవ్ర అసంతృప్తి ఉంది. ఇక పూరి పనితనం చూశాక మెహర్ రమేష్ లాంటి డైరెక్టర్ చిరును ఒక రీమేక్ మూవీలో ఎలా ప్రెజెంట్ చేస్తాడో, తమకు ఎలాంటి అనుభవం మిగిలుస్తాడో అన్న భయం వారిని వెంటాడుతోంది. శక్తి, షాడో లాంటి ఆల్ టైం డిజాస్టర్లు తీసిన మెహర్తో సినిమా వద్దని మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా గట్టిగానే మొత్తుకున్నారు. ఆ మాటకొస్తే కె.ఎస్.రవీంద్ర (బాబీ)తో సినిమా విషయంలోనూ వారి వేదన అలాగే ఉంది.
అతడి ఫాం కూడా ఏమీ బాగా లేదు. జై లవకుశతో కాస్త పర్వాలేదనిపించాడు కానీ.. సర్దార్ గబ్బర్ సింగ్, వెంకీమామ చిత్రాలతో అతను నిరాశపరిచాడు. అతడి కథలన్నీ ఔట్డేటెడ్ అనిపిస్తాయి. మరోవైపు ప్రభాస్కు ఇప్పుడు తగిలిన దెబ్బలు చాలవని మారుతితో జట్టు కట్టడంపై అభిమానుల్లో అసంతృప్తి మామూలుగా లేదు. దీనికి వ్యతిరేకంగా కొన్ని రోజులుగా ఉద్యమమే చేస్తున్నారు ఫ్యాన్స్. అయినా ప్రభాస్ వెనక్కి తగ్గలేదు. పూరి అనుభవం చూశాక ఈ దర్శకులందరి విషయంలోనూ ఆయా హీరోల అభిమానులకు టెన్షన్ తప్పట్లేదు.
This post was last modified on August 28, 2022 4:24 pm
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…
పార్టీలు బలంగా ఉండాలంటే.. సమాజంలోని పలు వర్గాల మద్దతు అవసరం. నాయకులు, అధినేతలు ఎంత బలంగా ఉన్నా.. సమాజంలోని వర్గాలు…
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిని బలోపేతం చేసేందుకు.. రాబోయే రోజుల్లో మరింత ఐక్యంగా ముందుకు సాగేలా వ్యూహాత్మక అడుగులు…
తెలుగు సినీ అభిమానుల్లో ఎన్నెన్ని వర్గాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులో ఒక వర్గానికి ఇంకో వర్గానికి అస్సలు…