కొవిడ్ పుణ్యమా అని ఇండియాలో ఓటీటీల హవా బాగా పెరిగిపోయింది. తెలుగులో కూడా ఓటీటీల జోరు మామూలుగా లేదు. ఐతే ఇవి ఫిలిం ఇండస్ట్రీకి మేలు చేశాయా, చెడు చేశాయా అంటే చెప్పడం కష్టమే. కరోనా టైంలో థియేటర్లు మూతపడగా, ఓటీటీలో కొత్త సినిమాలను కొని రిలీజ్ చేశాయి. ఆ రకంగా నిర్మాతలకు ఆదాయాన్ని అందించాయి. ప్రేక్షకులకు కూడా వినోదానికి ఢోకా లేకపోయింది. కానీ ఆడియన్స్ వాటికి బాగా అలవాటు పడిపోయి థియేటర్లకు రావడం తగ్గించేయడంతో నిర్మాతల ప్రధాన ఆదాయ వనరు మీద ప్రతికూల ప్రభావం పడింది.
కొత్త సినిమాలను నేరుగా, లేదంటే థియేటర్లలో రిలీజైన రెండు మూడు వారాలకే ఓటీటీల్లో రిలీజ్ చేసేస్తుండడం మున్ముందు ఇండస్ట్రీని మరింత ప్రమాదంలోకి నెడుతుందనే చర్చ ఇటీవల బాగా నడిచింది. ఈ నేపథ్యంలోనే కొత్త సినిమాలు థియేటర్లలో రిలీజైన 50 రోజుల తర్వాతే ఓటీటీలో రిలీజ్ చేయాలనే తీర్మానం జరిగింది టాలీవుడ్లో.
ఐతే అంత ఆలస్యం చేస్తే ఓటీటీలు డిజిటల్ హక్కుల విషయంలో కచ్చితంగా రేటు తగ్గిస్తాయనే అంచనా ముందు నుంచే ఉంది. ఈ విషయంలో ఓటీటీలన్నీ కలిపి ఓ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సినిమాకు ఇంత రేటు అని కాకుండా అది స్ట్రీమ్ అయ్యే సమయాన్ని బట్టి ధర చెల్లించాలని నిర్ణయిచాయట. ఒక గంట స్ట్రీమింగ్ సమయానికి 3 రూపాయలు చెల్లిస్తారట. ఇలా ఎన్ని గంటల సమయం స్ట్రీమ్ అయితే అన్ని 3 రూపాయలు జమ అవుతుంది.
10 లక్షల మంది రెండు గంటల సినిమాను పూర్తిగా చూస్తే రూ.60 లక్షలు చెల్లిస్తారన్నమాట. చిన్న, మీడియం రేంజ్ సినిమాలకు ఈ మేరకు రేట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. పెద్ద సినిమాలకు ఇలా కాకుండా సినిమాకు ఇంత అనే రేటు ఇవ్వొచ్చు. కానీ థియేట్రికల్ రిలీజ్కు, ఓటీటీ విడుదలకు గ్యాప్ ఎక్కువ ఉంటోంది కాబట్టి ఇంతకుముందు ఇచ్చే ధరలైతే ఉండవు. కచ్చితంగా రేటు తగ్గుతుంది. ఇది కచ్చితంగా టాలీవుడ్కు షాకే. మరి నిర్ణయంపై టాలీవుడ్ నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి.
This post was last modified on August 27, 2022 5:50 pm
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…