ఓవైపు సౌత్ సినిమాలు ఉత్తరాదిని ఊపేస్తుంటే.. మరోవైపు బాలీవుడ్ సినిమాలు నార్త్లో కూడా ప్రభావం చూపలేకపోతున్నాయి. అక్కడ రోజు రోజుకూ గ్రౌండ్ కోల్పోతున్న బాలీవుడ్ సినిమాలు.. దక్షిణాదిన పాగా వేయడానికి చేస్తున్న ప్రయత్నాలు అస్సలు ఫలితాన్నివ్వడం లేదు. ఇటీవలే ఆమిర్ ఖాన్ సినిమా ‘లాల్ సింగ్ చడ్డా’ను దక్షిణాది భాషల్లో బాగా ప్రమోట్ చేసి రిలీజ్ చేయగా.. దాన్ని ఇక్కడి జనాలు అస్సలు పట్టంచుకోలేదు. ‘షంషేరా’ అనే సినిమా డబ్బింగ్ వెర్షన్ల పరిస్థితి కూడా ఇంతే.
ఐతే ఈ రెండు చిత్రాలతో పోలిస్తే ‘బ్రహ్మాస్త్ర’ను దక్షిణాదిన చాలా గట్టిగా ప్రమోట్ చేస్తోంది చిత్ర బృందం. తెలుగులో ఇప్పటికే వైజాగ్లో ఒక ఈవెంట్ చేశారు. ఇక ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషిస్తుండడం, రాజమౌళి చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించడం సినిమాకు క్రేజ్ పెంచుతుందని ఆశించారు కానీ.. అలాంటి సంకేతాలేమీ కనిపించడం లేదు.
ఇప్పటిదాకా అయితే ‘బ్రహ్మాస్త్ర’కు తెలుగులో అనుకున్నంత బజ్ క్రియేటవ్వలేదు. దీంతో ఇప్పుడిక ప్రచార పరంగా బ్రహ్మాస్త్రాన్ని వదలడానికి సిద్ధమైంది చిత్ర బృందం. హైదరాబాద్లో జరిగే ‘బ్రహ్మాస్త్ర’ ప్రి రిలీజ్ ఈవెంట్కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ను ముఖ్య అతిథిగా రప్పిస్తున్నారు. ఇక్కడి తెలుగు సినిమాలకు చేసిన స్థాయిలో ఈవెంట్ చేయడానికి రంగం సిద్ధమవుతోంది. ముందు ఈ ఈవెంట్కు మెగాస్టార్ చిరంజీవిని అతిథిగా పిలవాలని అనుకున్నారు కానీ.. ఈ మధ్య ఆయన ప్రమోట్ చేసిన చిత్రాలకు ప్రతికూల ఫలితాలు రావడంతో ఆయనే కొన్నాళ్ల పాటు ఇలాంటి ఈవెంట్లకు దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నారట.
ఇక ఇటీవలే ‘బింబిసార’ ప్రి రిలీజ్ ఈవెంట్కు ఎన్టీఆర్ అతిథిగా వచ్చి దానికి ఎలివేషన్ ఇవ్వగా.. సినిమా ఘనవిజయం సాధించడంతో ఇప్పుడతను పాజిటివ్ సెంటిమెంట్గా మారాడు. అందుకే తారక్ను ప్రచార పరంగా బ్రహ్మాస్త్రంలా వాడుకోవాలని ‘బ్రహ్మాస్త్ర’ టీం ఫిక్సయినట్లు తెలుస్తోంది. రణబీర్ కపూర్, ఆలియా భట్ జంటగా అయాన్ ముఖర్జీ రూపొందించిన ‘బ్రహ్మాస్త్ర’ సెప్టెంబరు 9న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on August 27, 2022 2:00 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…