ఓవైపు సౌత్ సినిమాలు ఉత్తరాదిని ఊపేస్తుంటే.. మరోవైపు బాలీవుడ్ సినిమాలు నార్త్లో కూడా ప్రభావం చూపలేకపోతున్నాయి. అక్కడ రోజు రోజుకూ గ్రౌండ్ కోల్పోతున్న బాలీవుడ్ సినిమాలు.. దక్షిణాదిన పాగా వేయడానికి చేస్తున్న ప్రయత్నాలు అస్సలు ఫలితాన్నివ్వడం లేదు. ఇటీవలే ఆమిర్ ఖాన్ సినిమా ‘లాల్ సింగ్ చడ్డా’ను దక్షిణాది భాషల్లో బాగా ప్రమోట్ చేసి రిలీజ్ చేయగా.. దాన్ని ఇక్కడి జనాలు అస్సలు పట్టంచుకోలేదు. ‘షంషేరా’ అనే సినిమా డబ్బింగ్ వెర్షన్ల పరిస్థితి కూడా ఇంతే.
ఐతే ఈ రెండు చిత్రాలతో పోలిస్తే ‘బ్రహ్మాస్త్ర’ను దక్షిణాదిన చాలా గట్టిగా ప్రమోట్ చేస్తోంది చిత్ర బృందం. తెలుగులో ఇప్పటికే వైజాగ్లో ఒక ఈవెంట్ చేశారు. ఇక ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషిస్తుండడం, రాజమౌళి చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించడం సినిమాకు క్రేజ్ పెంచుతుందని ఆశించారు కానీ.. అలాంటి సంకేతాలేమీ కనిపించడం లేదు.
ఇప్పటిదాకా అయితే ‘బ్రహ్మాస్త్ర’కు తెలుగులో అనుకున్నంత బజ్ క్రియేటవ్వలేదు. దీంతో ఇప్పుడిక ప్రచార పరంగా బ్రహ్మాస్త్రాన్ని వదలడానికి సిద్ధమైంది చిత్ర బృందం. హైదరాబాద్లో జరిగే ‘బ్రహ్మాస్త్ర’ ప్రి రిలీజ్ ఈవెంట్కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ను ముఖ్య అతిథిగా రప్పిస్తున్నారు. ఇక్కడి తెలుగు సినిమాలకు చేసిన స్థాయిలో ఈవెంట్ చేయడానికి రంగం సిద్ధమవుతోంది. ముందు ఈ ఈవెంట్కు మెగాస్టార్ చిరంజీవిని అతిథిగా పిలవాలని అనుకున్నారు కానీ.. ఈ మధ్య ఆయన ప్రమోట్ చేసిన చిత్రాలకు ప్రతికూల ఫలితాలు రావడంతో ఆయనే కొన్నాళ్ల పాటు ఇలాంటి ఈవెంట్లకు దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నారట.
ఇక ఇటీవలే ‘బింబిసార’ ప్రి రిలీజ్ ఈవెంట్కు ఎన్టీఆర్ అతిథిగా వచ్చి దానికి ఎలివేషన్ ఇవ్వగా.. సినిమా ఘనవిజయం సాధించడంతో ఇప్పుడతను పాజిటివ్ సెంటిమెంట్గా మారాడు. అందుకే తారక్ను ప్రచార పరంగా బ్రహ్మాస్త్రంలా వాడుకోవాలని ‘బ్రహ్మాస్త్ర’ టీం ఫిక్సయినట్లు తెలుస్తోంది. రణబీర్ కపూర్, ఆలియా భట్ జంటగా అయాన్ ముఖర్జీ రూపొందించిన ‘బ్రహ్మాస్త్ర’ సెప్టెంబరు 9న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on August 27, 2022 2:00 pm
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…
సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…