భారీ అంచనాలతో విజయ్ దేవరకొండ మొదటి ప్యాన్ ఇండియా మూవీగా పబ్లిసిటీ చేసుకున్న లైగర్ కు అనూహ్యంగా నెగటివ్ టాక్ రావడం ఫ్యాన్స్ ని షాక్ లో పడేసింది. వాళ్ళు సైతం కంటెంట్ మరీ అంత తీసికట్టుగా ఉండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కనీసం యావరేజ్ అనే మాట వచ్చినా ఓ రెండు మూడు రోజులు వీకెండ్ ఎఫెక్ట్ తో మంచి పుష్ దక్కేది.
కానీ సోషల్ మీడియాలో నెటిజెన్లు లైగర్ మీద మాములుగా విరుచుకు పడటం లేదు. పూరి నుంచి ఇలాంటి కంటెంట్ ఎక్స్ పెక్ట్ చేయలేదని ఓపెన్ గానే కామెంట్ చేస్తున్నారు. దీని సంగతలా ఉంచితే లైగర్ టీమ్ ముందు నుంచి హై లైట్ చేసుకుంటూ వచ్చిన అంశం బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ పాత్ర.
ఇదేదో బ్లాస్టింగ్ రేంజ్ లో ఉంటుందనుకుంటే కామెడీకి యాక్షన్ కు మధ్యలో నలిగిపోయి ఎటూకాకుండా నిరాశపరిచింది. నిజానికి మైక్ గురించి ఇప్పటి జెనరేషన్ కి అంత అవగాహన లేదు. పైగా నిన్నటి తరానికి చెందిన వృద్ధ లెజెండ్. అందులోనూ ఈ క్రీడకు మన దేశంలో ఆదరణ తక్కువ. అలాంటప్పుడు మైక్ టైసన్ పాత్ర తీరుతెన్నులు ఎలా ఉన్నా తెలుగు ఆడియన్స్ ఎగ్జైట్ అయ్యే సీన్ ఉండదు. ఇప్పుడదే మైనస్ అయ్యింది.
దీనికి తోడు ఈ ఎపిసోడ్ సరిగా రాసుకోకపోవడంతో పూర్తిగా థ్రిల్ మిస్ అయ్యింది. రామ్ చరణ్ బ్రూస్ లీ సినిమాలో విషయం ఎంత డిజాస్టర్ ఉన్నా కనీసం చిరంజీవి వచ్చే ఆ పది నిముషాలు ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చింది. ఆ రేంజ్ లో మైక్ పార్ట్ ని ఊహించుకుంటే ఇలా ఉసూరుమనిపించేశారు. లైగర్ కి సీక్వెల్ ఉంటుందని ఏదో హైప్ కోసం ఇంటర్వ్యూలో చెప్పారు కానీ ఇప్పుడీ రెస్పాన్స్ చూస్తే దీనికి బ్రేక్ ఈవెన్ అయితే చాలానే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పెద్ద వీకెండ్ తో వచ్చింది కాబట్టి లైగర్ దాన్నేమాత్రం వాడుకుంటాడో చూడాలి
This post was last modified on August 27, 2022 6:09 am
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…
ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేసు గుర్రం రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.…
కేరళ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫు స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..…