ఈ రోజుల్లో రిలీజ్ డేట్ విషయంలో చాలా అడ్వాన్స్గా ప్లాన్ చేసుకోవాల్సి వస్తోంది. సినిమాల మేకింగ్ ఎక్కువైపోయి, పోటీ పెరిగిపోవడంతో బాలీవుడ్ స్టయిల్లో చాలా ముందుగానే డేట్లు ప్రకటించేస్తున్నారు. తర్వాత దానికి కట్టుబడతారా లేదా అన్నది సందేహమే కానీ.. ముందైతే ఎందుకైనా మంచిదని కర్చీఫ్ వేసి పెట్టేస్తున్నారు. వచ్చే ఏడాది వేసవికి ఇంకా చాలా టైం ఉండగానే ఒకదాని తర్వాత ఒక సినిమాకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేస్తున్నారు.
ఇంకా సెట్స్ మీదికే వెళ్లని మహేష్ బాబు-త్రివిక్రమ్ సినిమాకు 2023 ఏప్రిల్ 28న విడుదల ఖరారు చేయడం తెలిసిందే. అలాగే షూటింగ్ ఆరంభ దశలోనే ఉన్న మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘భోళా శంకర్’కు సైతం డేట్ ఖరారైంది. ఆ సినిమాను ఏప్రిల్ 14న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు వేసవి రేసులోకి ఇంకో సినిమా వచ్చేసింది. నేచురల్ స్టార్ నాని కొత్త చిత్రం ‘దసరా’ను మార్చి 30న విడుదల చేయబోతున్నట్లు శుక్రవారం ప్రకటించారు.
శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న చిత్రం ‘దసరా’. ఇందులో నాని ‘పుష్ప’లో అల్లు అర్జున్ను గుర్తుకు తెచ్చేలా డీగ్లామరస్, రగ్డ్ లుక్లో కనిపించనున్నాడు. నాని ఇంత డీగ్లామరస్లో రోల్లో ఇంత వరకు నటించింది లేదు. సుకుమార్ శిష్యుడైన శ్రీకాంత్ సింగరేణి గనుల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. మూణ్నాలుగు దశాబ్దాల కిందటి కాలంలో నడిచే కథ ఇది. రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ సందర్భంగా లాంచ్ చేసిన పోస్టర్లో నాని వెనుక సిల్క్ స్మిత బొమ్మ కనిపించింది.
దీన్ని బట్టే ఇది ఆ కాలం నాటి సినిమా అని అర్థమవుతోంది. ఈ చిత్రంలో నాని సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. ఇప్పటిదాకా ఆమె లుక్ను రిలీజ్ చేయలేదు. ఆమెది కూడా డీగ్లామరస్ రోలే అయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. పడి పడి లేచె మనసు, విరాటపర్వం, ఆడవాళ్ళు మీకు జోహార్లు, రామారావు ఆన్ డ్యూటీ లాంటి చిత్రాలతో చేదు అనుభవం ఎదుర్కొన్న సుధాకర్ చెరుకూరి ‘దసరా’ మీద చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు.
This post was last modified on August 26, 2022 2:51 pm
మరీ డెడ్ డ్రైగా మారిపోయిన తెలుగు రాష్ట్రాల థియేటర్లు పెద్ద సినిమాలు లేక అల్లాడిపోతున్నాయి. రెండు మూడు రోజులు ప్రమోషన్లతో…
``రాజకీయ నేతలు.. ప్రజల కోసం పనిచేసేది తక్కువ.. సెక్స్ వీడియోలు చూసేది ఎక్కువ. కావాలంటే.. నా ఫోన్ సహా.. రాష్ట్రంలోని…
బద్రి లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు పూరి జగన్నాథ్. అరంగేట్రంలోనే అలాంటి హిట్ పడిందంటే ఇక…
తెలంగాణ ప్రభుత్వం ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డైరెక్టర్ జనరల్స్(డీజీ)గా పదోన్నతి కల్పించింది. వీరిలో మహేశ్ భగవత్, స్వాతి లక్రా,…
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…