ఈ రోజుల్లో రిలీజ్ డేట్ విషయంలో చాలా అడ్వాన్స్గా ప్లాన్ చేసుకోవాల్సి వస్తోంది. సినిమాల మేకింగ్ ఎక్కువైపోయి, పోటీ పెరిగిపోవడంతో బాలీవుడ్ స్టయిల్లో చాలా ముందుగానే డేట్లు ప్రకటించేస్తున్నారు. తర్వాత దానికి కట్టుబడతారా లేదా అన్నది సందేహమే కానీ.. ముందైతే ఎందుకైనా మంచిదని కర్చీఫ్ వేసి పెట్టేస్తున్నారు. వచ్చే ఏడాది వేసవికి ఇంకా చాలా టైం ఉండగానే ఒకదాని తర్వాత ఒక సినిమాకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేస్తున్నారు.
ఇంకా సెట్స్ మీదికే వెళ్లని మహేష్ బాబు-త్రివిక్రమ్ సినిమాకు 2023 ఏప్రిల్ 28న విడుదల ఖరారు చేయడం తెలిసిందే. అలాగే షూటింగ్ ఆరంభ దశలోనే ఉన్న మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘భోళా శంకర్’కు సైతం డేట్ ఖరారైంది. ఆ సినిమాను ఏప్రిల్ 14న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు వేసవి రేసులోకి ఇంకో సినిమా వచ్చేసింది. నేచురల్ స్టార్ నాని కొత్త చిత్రం ‘దసరా’ను మార్చి 30న విడుదల చేయబోతున్నట్లు శుక్రవారం ప్రకటించారు.
శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న చిత్రం ‘దసరా’. ఇందులో నాని ‘పుష్ప’లో అల్లు అర్జున్ను గుర్తుకు తెచ్చేలా డీగ్లామరస్, రగ్డ్ లుక్లో కనిపించనున్నాడు. నాని ఇంత డీగ్లామరస్లో రోల్లో ఇంత వరకు నటించింది లేదు. సుకుమార్ శిష్యుడైన శ్రీకాంత్ సింగరేణి గనుల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. మూణ్నాలుగు దశాబ్దాల కిందటి కాలంలో నడిచే కథ ఇది. రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ సందర్భంగా లాంచ్ చేసిన పోస్టర్లో నాని వెనుక సిల్క్ స్మిత బొమ్మ కనిపించింది.
దీన్ని బట్టే ఇది ఆ కాలం నాటి సినిమా అని అర్థమవుతోంది. ఈ చిత్రంలో నాని సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. ఇప్పటిదాకా ఆమె లుక్ను రిలీజ్ చేయలేదు. ఆమెది కూడా డీగ్లామరస్ రోలే అయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. పడి పడి లేచె మనసు, విరాటపర్వం, ఆడవాళ్ళు మీకు జోహార్లు, రామారావు ఆన్ డ్యూటీ లాంటి చిత్రాలతో చేదు అనుభవం ఎదుర్కొన్న సుధాకర్ చెరుకూరి ‘దసరా’ మీద చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు.
This post was last modified on August 26, 2022 2:51 pm
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…
ఆంధ్రప్రదేశ్లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…
కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…
ఆంధ్రప్రదేశ్లో ఇంకో వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతుండగా.. మంత్రి అంబటి రాంబాబుపై ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ రిలీజ్ చేసిన…
ఎడిటర్ మోహన్ నిర్మాణ సంస్థ ఎంఎస్ ఆర్ట్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా సుకుమార్ పని చేస్తున్న రోజులవి. ముప్పై…