ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడిగా ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన అక్కినేని నాగార్జున.. కొన్నేళ్ల నుంచి సరైన విజయాలు లేక ఇబ్బంది పడుతున్నారు. ‘సోగ్గాడే చిన్నినాయనా’ తర్వాత ఆ స్థాయి సక్సెస్ లేదు నాగ్కు. ఆ సినిమాకు సీక్వెల్ కావడం వల్ల, ఈ సంక్రాంతికి పెద్దగా పోటీ లేకపోవడం వల్ల ‘బంగార్రాజు’ ఓ మాదిరిగా ఆడేసింది కానీ.. మిగతా చిత్రాలన్నీ నాగ్కు చేదు అనుభవాలే మిగిల్చాయి.
గత ఏడాది రిలీజైన ‘వైల్డ్ డాగ్’ మంచి టాక్ తెచ్చుకుని కూడా వసూళ్లు రాబట్టలేకపోయింది. ఇప్పుడు అదే స్టయిల్లో తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ ‘ది ఘోస్ట్’ మీద నాగ్ ఆశలన్నీ నిలిచి ఉన్నాయి. గురువారం సాయంత్రమే రిలీజైన ఈ సినిమా ట్రైలర్ ఆసక్తికరంగానే ఉండి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. కాకపోతే ఈ ఆసక్తి వసూళ్ల రూపంలోకి మారుతుందా లేదా అన్నది అక్టోబరు 5న తేలుతుంది. ఈ విషయం పక్కన పెడితే ‘ది ఘోస్ట్’ ట్రైలర్ను లాంచ్ చేసిన సూపర్ స్టార్ మహేష్కు థ్యాంక్స్ చెబుతూ నాగ్ వేసిన ట్వీట్ ఆసక్తికర చర్చకు దారి తీసింది.
‘‘హేయ్ మహేష్.. 29 ఏళ్ల క్రితం మీ నాన్న సూపర్ స్టార్ కృష్ణ గారు నాతో కలిసి వారసుడు సినిమా చేయడం నాకెంతో ఆనందాన్నిచ్చింది. మరి నువ్వెందుకు ఆ వృత్తాన్ని పూర్తి చేయకూడదు. ది ఘోస్ట్ ట్రైలర్ను లాంచ్ చేసినందుకు ధన్యవాదాలు’’ అని నాగ్ ట్వీట్ చేశాడు. అప్పుడు కృష్ణ తన సినిమాలో నటించాడని.. ఇప్పుడు నీ సినిమాలో నేను నటిస్తా అని నాగ్ ఆఫర్ చేస్తుండడం విశేషమే. ఐతే నాగ్ యధాలాపంగా ఈ మాట అన్నాడా.. లేక దీని వెనుక సీరియస్గా ఏదైనా ఉద్దేశం ఉందా అన్నది ఆసక్తికరం.
త్రివిక్రమ్ సినిమా తర్వాత మహేష్ బాబు నటించబోయే రాజమౌళి సినిమాలో నాగ్ ఏమైనా అతిథి పాత్ర లాంటిది చేయబోతున్నాడా అన్న సందేహాలను ఈ ట్వీట్ రేకెత్తించింది. దానికి తోడు మహేష్.. సంపూర్ణ ఆనందంగా ఉంటుంది.. ఎదురుచూడాల్సిన విషయం!.. అని మరో ట్వీట్ చేశాడు. దీంతో ఏదో ప్లాన్ వేసినట్లు ఉన్నారని నెటిజన్లు ఊహించేసుకుంటున్నారు. రాజమౌళితో నాగ్కు మంచి అనుబంధం ఉంది. ఇక జక్కన్న సినిమాల్లో ప్రత్యేక, అతిథి పాత్రలు మామూలే. కాబట్టి మహేష్ సినిమాలో నాగ్ కోసం ఏదైనా రోల్ క్రియేట్ చేస్తే ఆశ్చర్యమేమీ లేదు. దీని గురించి నాగ్ హింట్ ఇచ్చి ఉంటాడేమో అని అక్కినేని ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు.
This post was last modified on August 25, 2022 10:51 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…