తమిళ్ రాకర్స్.. సౌత్ ఇండియాలో ఏ కొత్త సినిమా రిలీజైనా కొన్ని గంటల్లో పైరసీ ప్రింట్ ప్రత్యక్షమయ్యే వెబ్ సైట్. గతంలో కొత్త సినిమాలను పైరసీ చేసి సీడీలేసి అమ్మేది ఈ సంస్థ. టెక్నాలజీ పెరిగాక వెబ్ సైట్ ద్వారా వ్యవహారం నడిపించింది. దీని అడ్మిన్స్ ఎక్కడో విదేశాల్లో ఎవరికీ దొరక్కుండా సర్వర్ మెయింటైన్ చేస్తూ.. కొత్త సినిమాలను పైరసీ చేస్తుంటారు. ఈ వెబ్ సైట్ను నియంత్రించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది.
ఆ వెబ్ సైట్ను నిషేధిత జాబితాలో పెట్టి అది పని చేయకుండా చేసినా.. తన సబ్స్క్రైబర్లకు మెయిల్ ద్వారా పైరసీ లింక్స్ పంపిస్తూ.. ఈ బిజినెస్ను విజయవంతంగా నడిపిస్తున్నారు. ప్రధానంగా తమిళ సినిమాల మీదే ఈ సంస్థ ఫోకస్ ఉంటుంది కానీ.. వేరే భాషల చిత్రాలను కూడా పైరసీ చేసి ఇంటర్నెట్లో పెట్టేస్తుంటుంది ఈ సంస్థ. కోలీవుడ్ దీన్ని మూయించడానికి చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు.
కానీ దానికి బ్రేక్ మాత్రం పడలేదు. కాగా ఇప్పుడు తమిళ్ రాకర్స్ పైరసీ వ్యవహారం మీద అరుణ్ విజయ్ ప్రధాన పాత్రలో అరివళగన్ ఈ సిరీస్ను రూపొందించాడు. సోనీ లివ్ దీన్ని స్ట్రీమ్ చేస్తోంది. ఐతే తాము చేసే పైరసీ వ్యవహారాల చుట్టూ తిరిగే వెబ్ సిరీస్ను సైతం తమిళ్ రాకర్స్ వాళ్లు విడిచిపెట్టలేదు. ఈ సిరీస్ రిలీజైన కొన్ని రోజులకే పైరసీ ప్రింట్ రెడీ చేసేశారు. దాన్ని తమ సబ్స్క్రైబర్లందరికీ పంపించేశారు. ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.
దీని మీద బోలెడన్ని మీమ్స్, జోక్స్ కనిపిస్తున్నాయి సామాజిక మాధ్యమాల్లో. ఈ థ్రిల్లర్ సిరీస్లో ఇదే అసలైన ట్విస్టు, ఇది యాంటీ క్లైమాక్స్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తమిళ ఇండస్ట్రీని తమిళ్ రాకర్స్ ఏ రకంగా వేధిస్తోందో చెప్పడానికి ఇంతకంటే రుజువు లేదు. ఇక ఈ వెబ్ సిరీస్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వస్తోంది. మరీ గొప్ప థ్రిల్లింగ్గా లేకపోయినా.. ఎంగేజింగ్గానే ఉందని.. ఎనిమిది ఎపిసోడ్లలో ఒక రెండు తగ్గించి ఉంటే క్రిస్ప్గా మారేదని అంటున్నారు.
This post was last modified on August 25, 2022 9:28 am
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. వాస్తవానికి గతంలో కొన్ని కొన్ని చెదురుమొదురు ఘటనలు జరిగేవి. తాజాగా…
80, 90 దశకాల్లో వైభవం చూసిన కథానాయకుల్లో రాజశేఖర్ ఒకరు. స్వతహాగా తమిళుడైనప్పటికీ.. తెలుగులోనే ఆయన పెద్ద హీరోగాఎదిగారు. అంకుశం,…
గ్లోబల్ పాప్ సెన్సేషన్ రిహానా పేరు వింటేనే ఒక రేంజ్ వైబ్ గుర్తొస్తుంది. అలాంటిది ఈ ఇంటర్నేషనల్ స్టార్ సడన్గా…
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె వెనుక ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశం, వాటి నిర్వహణ విధానం.. తద్వారా ఉద్యోగాలకు పొంచి…
తమిళనాడు ఎన్నికలు నిన్నటితో అయిపోయాయి. ఫలితాలు రావడానికి ఇంకా పది రోజులు టైం ఉండటంతో ఇండస్ట్రీ, పొలిటికల్ వర్గాలు రిలాక్స్…
తెలంగాణ లో ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తతల మధ్య నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని…