తమిళ్ రాకర్స్.. సౌత్ ఇండియాలో ఏ కొత్త సినిమా రిలీజైనా కొన్ని గంటల్లో పైరసీ ప్రింట్ ప్రత్యక్షమయ్యే వెబ్ సైట్. గతంలో కొత్త సినిమాలను పైరసీ చేసి సీడీలేసి అమ్మేది ఈ సంస్థ. టెక్నాలజీ పెరిగాక వెబ్ సైట్ ద్వారా వ్యవహారం నడిపించింది. దీని అడ్మిన్స్ ఎక్కడో విదేశాల్లో ఎవరికీ దొరక్కుండా సర్వర్ మెయింటైన్ చేస్తూ.. కొత్త సినిమాలను పైరసీ చేస్తుంటారు. ఈ వెబ్ సైట్ను నియంత్రించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది.
ఆ వెబ్ సైట్ను నిషేధిత జాబితాలో పెట్టి అది పని చేయకుండా చేసినా.. తన సబ్స్క్రైబర్లకు మెయిల్ ద్వారా పైరసీ లింక్స్ పంపిస్తూ.. ఈ బిజినెస్ను విజయవంతంగా నడిపిస్తున్నారు. ప్రధానంగా తమిళ సినిమాల మీదే ఈ సంస్థ ఫోకస్ ఉంటుంది కానీ.. వేరే భాషల చిత్రాలను కూడా పైరసీ చేసి ఇంటర్నెట్లో పెట్టేస్తుంటుంది ఈ సంస్థ. కోలీవుడ్ దీన్ని మూయించడానికి చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు.
కానీ దానికి బ్రేక్ మాత్రం పడలేదు. కాగా ఇప్పుడు తమిళ్ రాకర్స్ పైరసీ వ్యవహారం మీద అరుణ్ విజయ్ ప్రధాన పాత్రలో అరివళగన్ ఈ సిరీస్ను రూపొందించాడు. సోనీ లివ్ దీన్ని స్ట్రీమ్ చేస్తోంది. ఐతే తాము చేసే పైరసీ వ్యవహారాల చుట్టూ తిరిగే వెబ్ సిరీస్ను సైతం తమిళ్ రాకర్స్ వాళ్లు విడిచిపెట్టలేదు. ఈ సిరీస్ రిలీజైన కొన్ని రోజులకే పైరసీ ప్రింట్ రెడీ చేసేశారు. దాన్ని తమ సబ్స్క్రైబర్లందరికీ పంపించేశారు. ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.
దీని మీద బోలెడన్ని మీమ్స్, జోక్స్ కనిపిస్తున్నాయి సామాజిక మాధ్యమాల్లో. ఈ థ్రిల్లర్ సిరీస్లో ఇదే అసలైన ట్విస్టు, ఇది యాంటీ క్లైమాక్స్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తమిళ ఇండస్ట్రీని తమిళ్ రాకర్స్ ఏ రకంగా వేధిస్తోందో చెప్పడానికి ఇంతకంటే రుజువు లేదు. ఇక ఈ వెబ్ సిరీస్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వస్తోంది. మరీ గొప్ప థ్రిల్లింగ్గా లేకపోయినా.. ఎంగేజింగ్గానే ఉందని.. ఎనిమిది ఎపిసోడ్లలో ఒక రెండు తగ్గించి ఉంటే క్రిస్ప్గా మారేదని అంటున్నారు.
This post was last modified on August 25, 2022 9:28 am
రెండు నెలల కిందట రిలీజైన దురంధర్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవలం…
బుల్లితెరపై ఘన చరిత్ర ఉన్న ఈటీవీ ప్రభాకర్ నట వారసత్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్రహాస్.. తన…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని.. పంది, ఆవు కొవ్వులను కూడా వినియోగించారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో ప్రత్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్దగా కేటాయింపులు ఏమీ…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…