అభిషేక్ అగర్వాల్.. ఇప్పుడు టాలీవుడ్లోనే కాక ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మొత్తంలో మార్మోగుతున్న పేరు. చిన్న, మీడియం రేంజ్ సినిమాలు తీసే ఈ నిర్మాత ఈ ఏడాది కొన్ని నెలల వ్యవధిలో రెండు భారీ విజయాలందుకున్నాడు. అందులో ఒకటి ‘ది కశ్మీర్ ఫైల్స్’ కాగా.. మరొకటి ‘కార్తికేయ-2’. ఈ రెండు చిత్రాలకు ముందు ఆయన కెరీర్లో అంతగా విజయాలు లేవు. ‘గూఢచారి’ మినహా అభిషేక్ నిర్మించిన సినిమాలన్నీ తీవ్రంగా నిరాశ పరిచాయి. కిరాక్ పార్టీ, సీత, ఎ-1 ఎక్స్ప్రెస్ లాంటి ఫ్లాపులు ఎదుర్కొన్నారాయన.
ఇలాంటి ట్రాక్ రికార్డుతో ఇండస్ట్రీలో చాలా రోజులు నిలవడం అంటే కష్టమే. కానీ హిందీలో తక్కువ బడ్జెట్లో ఆయన నిర్మించిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా అద్భుతాలు చేసింది. విడుదలయ్యే ముందు పెద్దగా అంచనాలే లేని ఈ చిత్రం.. పెట్టుబడి-రాబడి కోణంలో చూస్తే బాలీవుడ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్లలో ఒకటిగా నిలిచింది. కేవలం రూ.25 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన ఆ సినిమా ఏకంగా రూ.340 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం.
ఈ సినిమాతో అభిషేక్ అగర్వాల్ పేరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఈ విజయంతో ఉబ్బితబ్బిబ్బవుతున్న అభిషేక్కు ఇప్పుడు ‘కార్తికేయ-2’ రూపంలో మరో జాక్పాట్ తగిలింది. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టి.జి.విశ్వప్రసాద్తో కలిసి నిర్మించాడు అభిషేక్. చిత్రీకరణ ఆలస్యం కావడంతో, విడుదల పలుమార్లు వాయిదా పట్టి ఎట్టకేలకు గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘కార్తికేయ-2’ బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేస్తోంది. వారం తిరిగేసరికి పెట్టుబడి మీద రెట్టింపు షేర్ తెచ్చిపెట్టింది. రెండో వారంలోనూ సినిమా హౌస్ ఫుల్స్తో రన్ అవుతోంది.
హిందీలో కేవలం 50 షోలతో మొదలైన ఈ చిత్రం ఇప్పుడు 3 వేలకు పైగా షోలతో నడుస్తోంది. లాల్ సింగ్ చడ్డా, రక్షా బంధన్ లాంటి పెద్ద సినిమాలను వెనక్కి నెట్టి చక్కటి వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమా ఫుల్ రన్ వసూళ్లు వంద కోట్లకు చేరువ అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. సినిమా అంత స్ట్రాంగ్గా సాగుతోంది. అభిషేక్కు ఘనవిజయాలందించిన ది కశ్మీర్ ఫైల్స్, కార్తికేయ-2 చిత్రాలు రెండింట్లోనూ ‘హిందూ ప్రో’ యాంగిల్ ఉండడం ప్లస్ పెద్ద ప్లస్ కావడం గమనార్హం.
టాలీవుడ్ యంగ్ స్టార్స్ పర్సనల్ లైఫ్ లో జరిగిన మార్పులు, ఆ వెంటనే వారు అందుకున్న సక్సెస్ లపై నెటిజన్లు…
తెలుగులో ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీకి వంద కోట్ల వసూళ్లు రావడం అన్నది అనూహ్యమే. అందులోనూ అది ఫ్యామిలీ సినిమా…
వీకెండ్ వసూళ్లను ఘనంగా రాబట్టుకున్న లెనిన్ అసలు పరీక్ష మొదలుపెట్టింది. సోమవారం నుంచి ఆక్యుపెన్సీలు ఎలా ఉండబోతున్నాయనే దాని మీద…
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీవీ వెంకటేశ్వరరావు గత వైసీపీ పాలనలో ఎదుర్కొన్న ఇబ్బందులు తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
సెలబ్రెటీల కుటుంబాల్లో కొందరిలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అది ఎప్పుడో కానీ బయటికి రాదు. ఎప్పుడూ మామూలుగా కనిపించే వ్యక్తులు..…