ఎప్పుడో మూడేళ్ల కిందట పట్టాలెక్కిన సినిమా ‘లైగర్’. కొవిడ్ సహా రకరకాల కారణాల వల్ల ఈ సినిమా మేకింగ్ ఆలస్యమైంది. షూటింగ్ పూర్తయ్యాక పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్లకు కూడా బాగా టైం తీసుకున్నారు. పలుమార్లు రిలీజ్ డేట్ మారింది. ఎట్టకేలకు ఈ చిత్రం రాబోయే గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో బహు భాషల్లో విడుదలవుతున్న సంగతి తెలిసిందే.
ఐతే ప్రధానంగా ఫోకస్ ఉన్నది తెలుగు, హిందీ భాషల మీదే. ఐతే ఈ రెండు భాషల్లో రిలీజ్ విషయంలో చిత్ర బృందం భిన్నమైన వ్యూహాన్ని అనుసరించబోతోంది. తెలుగు వెర్షన్ అనుకున్నట్లే 25న ఉదయం థియేటర్లలోకి దిగుతుండగా.. హిందీ వెర్షన్కు మాత్రం రెగ్యులర్ రిలీజ్ 26న ఉండబోతోంది. 25న రాత్రి సెకండ్ షోకు పెయిడ్ ప్రిమియర్లు వేయబోతున్నారు. తర్వాతి రోజు నుంచి రెగ్యులర్ షోలు నడుస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే హిందీ వెర్షన్ ఒక రోజు లేటుగా రిలీజవుతున్నట్లే.
ఇలా ఎందుకు చేస్తున్నారనే విషయంలో క్లారిటీ లేదు. బహుశా హిందీ చిత్రాలకు శుక్రవారం సెంటిమెంట్ ఎక్కువ కాబట్టి ఇలా చేస్తున్నారేమో. అలాగే ఇది మాస్ మూవీ కాబట్టి నెగెటివ్ రివ్యూలు వస్తాయేమో అన్న డౌట్తోనూ ఇలా చేస్తుండొచ్చు. కానీ ‘లైగర్’కు బుధవారం రాత్రే యుఎస్లో ప్రిమియర్స్ పడుతున్నాయి. అక్కడ ప్రిమియర్లు వేసేది తెలుగు వెర్షన్కే అయినా టాక్ ముందే బయటికి వచ్చేస్తుంది.
హిందీలో ఈ చిత్రం పెద్ద ఎత్తునే రిలీజవుతుండడంతో అక్కడి ప్రేక్షకులు తెలుగు రివ్యూలు చూడకుండా ఉండరు. కాబట్టి టాక్ స్ప్రెడ్ అవుతుందన్న ఉద్దేశంతో సినిమాను ఆలస్యం చేయడంల లాజిక్ కనిపించదు. ‘లైగర్’లో బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ నిర్మాణ భాగస్వామి కావడంతో హిందీలో దీనికి పెద్ద రిలీజే ఉండబోతోంది. అక్కడ సినిమాపై ప్రేక్షకుల్లో బాగానే ఆసక్తి కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ‘లైగర్’కు ఉదయం 7 గంటల నుంచే షోలు పడే అవకాశాలు ఉన్నాయి.
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపిచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ మూవీ NBK 111 షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
వరస డిజాస్టర్లతో మార్కెట్ నే రిస్కులో పెట్టుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈసారి కొరియన్ కనకరాజుగా వస్తున్నాడు. ఆగస్ట్…
‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షిస్తున్న అమ్మాయి.. శ్రీ గౌరీప్రియ. ఈ అచ్చ తెలుగు…
మలయాళ లెజెండరీ డైరెక్టర్ ఫాజిల్ కొడుకు ఫాహద్ నటుడిగా పరిచయం అయినపుడు అతణ్ని అంత సీరియస్గా తీసుకోలేదు మలయాళ ప్రేక్షకులు.…
ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చివరి దశకు చేరుకున్న వేళ మాజీ మంత్రి ఓటే గల్లంతు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్ మరణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశంగానే మారిపోయింది. పవన్…