ఎప్పుడో మూడేళ్ల కిందట పట్టాలెక్కిన సినిమా ‘లైగర్’. కొవిడ్ సహా రకరకాల కారణాల వల్ల ఈ సినిమా మేకింగ్ ఆలస్యమైంది. షూటింగ్ పూర్తయ్యాక పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్లకు కూడా బాగా టైం తీసుకున్నారు. పలుమార్లు రిలీజ్ డేట్ మారింది. ఎట్టకేలకు ఈ చిత్రం రాబోయే గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో బహు భాషల్లో విడుదలవుతున్న సంగతి తెలిసిందే.
ఐతే ప్రధానంగా ఫోకస్ ఉన్నది తెలుగు, హిందీ భాషల మీదే. ఐతే ఈ రెండు భాషల్లో రిలీజ్ విషయంలో చిత్ర బృందం భిన్నమైన వ్యూహాన్ని అనుసరించబోతోంది. తెలుగు వెర్షన్ అనుకున్నట్లే 25న ఉదయం థియేటర్లలోకి దిగుతుండగా.. హిందీ వెర్షన్కు మాత్రం రెగ్యులర్ రిలీజ్ 26న ఉండబోతోంది. 25న రాత్రి సెకండ్ షోకు పెయిడ్ ప్రిమియర్లు వేయబోతున్నారు. తర్వాతి రోజు నుంచి రెగ్యులర్ షోలు నడుస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే హిందీ వెర్షన్ ఒక రోజు లేటుగా రిలీజవుతున్నట్లే.
ఇలా ఎందుకు చేస్తున్నారనే విషయంలో క్లారిటీ లేదు. బహుశా హిందీ చిత్రాలకు శుక్రవారం సెంటిమెంట్ ఎక్కువ కాబట్టి ఇలా చేస్తున్నారేమో. అలాగే ఇది మాస్ మూవీ కాబట్టి నెగెటివ్ రివ్యూలు వస్తాయేమో అన్న డౌట్తోనూ ఇలా చేస్తుండొచ్చు. కానీ ‘లైగర్’కు బుధవారం రాత్రే యుఎస్లో ప్రిమియర్స్ పడుతున్నాయి. అక్కడ ప్రిమియర్లు వేసేది తెలుగు వెర్షన్కే అయినా టాక్ ముందే బయటికి వచ్చేస్తుంది.
హిందీలో ఈ చిత్రం పెద్ద ఎత్తునే రిలీజవుతుండడంతో అక్కడి ప్రేక్షకులు తెలుగు రివ్యూలు చూడకుండా ఉండరు. కాబట్టి టాక్ స్ప్రెడ్ అవుతుందన్న ఉద్దేశంతో సినిమాను ఆలస్యం చేయడంల లాజిక్ కనిపించదు. ‘లైగర్’లో బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ నిర్మాణ భాగస్వామి కావడంతో హిందీలో దీనికి పెద్ద రిలీజే ఉండబోతోంది. అక్కడ సినిమాపై ప్రేక్షకుల్లో బాగానే ఆసక్తి కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ‘లైగర్’కు ఉదయం 7 గంటల నుంచే షోలు పడే అవకాశాలు ఉన్నాయి.
This post was last modified on August 21, 2022 2:38 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…