ఎప్పుడో మూడేళ్ల కిందట పట్టాలెక్కిన సినిమా ‘లైగర్’. కొవిడ్ సహా రకరకాల కారణాల వల్ల ఈ సినిమా మేకింగ్ ఆలస్యమైంది. షూటింగ్ పూర్తయ్యాక పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్లకు కూడా బాగా టైం తీసుకున్నారు. పలుమార్లు రిలీజ్ డేట్ మారింది. ఎట్టకేలకు ఈ చిత్రం రాబోయే గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో బహు భాషల్లో విడుదలవుతున్న సంగతి తెలిసిందే.
ఐతే ప్రధానంగా ఫోకస్ ఉన్నది తెలుగు, హిందీ భాషల మీదే. ఐతే ఈ రెండు భాషల్లో రిలీజ్ విషయంలో చిత్ర బృందం భిన్నమైన వ్యూహాన్ని అనుసరించబోతోంది. తెలుగు వెర్షన్ అనుకున్నట్లే 25న ఉదయం థియేటర్లలోకి దిగుతుండగా.. హిందీ వెర్షన్కు మాత్రం రెగ్యులర్ రిలీజ్ 26న ఉండబోతోంది. 25న రాత్రి సెకండ్ షోకు పెయిడ్ ప్రిమియర్లు వేయబోతున్నారు. తర్వాతి రోజు నుంచి రెగ్యులర్ షోలు నడుస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే హిందీ వెర్షన్ ఒక రోజు లేటుగా రిలీజవుతున్నట్లే.
ఇలా ఎందుకు చేస్తున్నారనే విషయంలో క్లారిటీ లేదు. బహుశా హిందీ చిత్రాలకు శుక్రవారం సెంటిమెంట్ ఎక్కువ కాబట్టి ఇలా చేస్తున్నారేమో. అలాగే ఇది మాస్ మూవీ కాబట్టి నెగెటివ్ రివ్యూలు వస్తాయేమో అన్న డౌట్తోనూ ఇలా చేస్తుండొచ్చు. కానీ ‘లైగర్’కు బుధవారం రాత్రే యుఎస్లో ప్రిమియర్స్ పడుతున్నాయి. అక్కడ ప్రిమియర్లు వేసేది తెలుగు వెర్షన్కే అయినా టాక్ ముందే బయటికి వచ్చేస్తుంది.
హిందీలో ఈ చిత్రం పెద్ద ఎత్తునే రిలీజవుతుండడంతో అక్కడి ప్రేక్షకులు తెలుగు రివ్యూలు చూడకుండా ఉండరు. కాబట్టి టాక్ స్ప్రెడ్ అవుతుందన్న ఉద్దేశంతో సినిమాను ఆలస్యం చేయడంల లాజిక్ కనిపించదు. ‘లైగర్’లో బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ నిర్మాణ భాగస్వామి కావడంతో హిందీలో దీనికి పెద్ద రిలీజే ఉండబోతోంది. అక్కడ సినిమాపై ప్రేక్షకుల్లో బాగానే ఆసక్తి కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ‘లైగర్’కు ఉదయం 7 గంటల నుంచే షోలు పడే అవకాశాలు ఉన్నాయి.
This post was last modified on August 21, 2022 2:38 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…