కోలీవుడ్ సూపర్ స్టార్ వక్రమ్.. తన కొడుకు ధ్రువ్తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ధ్రువ్ గత ఏడాది అర్జున్ రెడ్డి రీమేక్ ఆదిత్య వర్మతో హీరోగా పరిచయం అయ్యాడు. సోలో హీరోగా అతడి రెండో సినిమా ఇంకా ఖరారే కాలేదు. ఈలోపే తండ్రితో కలిసి మల్టీస్టారర్ చేయడానికి రెడీ అయిపోయాడతను. యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ వీళ్లిద్దరినీ తెరపై చూపించబోతున్నాడు.
అతను విక్రమ్తో ఓ సినిమా\ చేయబోతున్నాడని.. ధ్రువ్ అందులో అతిథి పాత్ర చేస్తాడని కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. అయితే ఈ సినిమాలో వీరి పాత్రలు రివర్స్ అన్నది తాజా సమాచారం. ఇది విక్రమ్ సినిమా కాదట. ధ్రువ్ మూవీ అట. ఇందులో అతనే హీరో అట. విక్రమ్ అతడిని ఢీకొట్టే విలన్ పాత్రలో కనిపించనున్నాడట.
ఇంతకుముందు హీరోగా మంచి స్థాయిలో ఉండగానే రావణన్ (విలన్) సినిమాలో విలన్ పాత్ర చేశాడు విక్రమ్. ఇప్పుడు అతను కొడుకు సినిమాలో విలన్గా కనిపిస్తాడంటే ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొనడం ఖాయం. ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజ్.. ధనుష్ హీరోగా తీసిన జగమే తంత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు.
థియేటర్లు పునఃప్రారంభం కాగానే ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది. పరిస్థితులు మామూలు స్థాయికి రాగానే ధ్రువ్-విక్రమ్ సినిమాను మొదలుపెట్టనున్నాడు. విక్రమ్ ప్రస్తుతం కోబ్రాతో పాటు మహావీర్ కర్ణ, పొన్నియన్ సెల్వన్ లాంటి క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తున్నాడు. ధ్రువ్-విక్రమ్-కార్తీక్ సినిమా ప్రి లుక్ పోస్టర్ను బట్టి చూస్తే ఇది పక్కా యాక్షన్ మూవీ అని అర్థమవుతోంది.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…