ఎవరైనా కొత్త దర్శకుడు ఒక భారీ కథతో హీరోలు, నిర్మాతలను కలిసి నరేషన్ ఇవ్వగానే వాళ్ల నుంచి ఒక రొటీన్ ప్రశ్న ఎదురవుతుంటుంది. ఇంత భారీ కథను కొత్త వాడైన నువ్వు డీల్ చేయగలవా అని. ఎవరైనా పెద్ద దర్శకులకు ఈ కథ ఇస్తే బాగుంటుందేమో అని అభిప్రాయపడతారు. కానీ అంత భారీ కథను సమర్థంగా తీర్చిదిద్దుకుని ఆ సినిమాతో బ్యాంగ్ బ్యాంగ్ ఎంట్రీ ఇద్దామని ప్రిపేరైన డెబ్యూ డైరెక్టర్లకు ఆ కథను వేరొకరికి అప్పగించడానికి మనసొప్పుకోదు. ఎంత ఆలస్యమైనా పర్వాలేదు మనమే ఆ కథతో సినిమా చేద్దామని చూస్తారు.
ఈ క్రమంలో కొన్ని అవకాశాలు చేజారుతాయి. చివరికి ఆ కథను, దర్శకుడిని నమ్మి రిస్క్ చేస్తే.. అద్భుతాలు జరగొచ్చు. బింబిసార మూవీ అలాంటి అద్భుతమే అని చెప్పాలి. ఈ కథను వేణు మల్లిడి అలియాస్ వశిష్ఠ టాలీవుడ్లో చాలామంది హీరోలకు చెప్పాడు. ముందు అల్లు శిరీష్ హీరోగా ఈ సినిమా చేయడానికి అంతా ఓకే అన్నట్లే కనిపించింది. సినిమా కూడా అనౌన్స్ చేశారు. కట్ చేస్తే ఎక్కడో ఏదో తేడా జరిగింది. సినిమా ముందుకు కదల్లేదు.
ఆ తర్వాత మాస్ రాజా రవితేజ వద్దకు వెళ్లాడు వశిష్ఠ. అక్కడ కూడా ముందు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ.. సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లలేకపోయారు. చివరికి ఇలాంటి రిస్కీ సినిమాలతోనే ఘన విజయాలందుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ను ఓకే చేశాడు. పెద్ద బడ్జెట్లో, రాజీ పడకుండా సినిమా తీశాడు.
ఈ చిత్రం ఇప్పుడు కళ్యాణ్ రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది.
వశిష్ఠకు టాలీవుడ్ గ్రాండ్ వెల్కం చెబుతూ అతడి మీద ఆఫర్ల వర్షం కురిపిస్తోంది. చాలామంది అతడితో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. కానీ ఎవరికి కమిట్మెంట్ ఇవ్వాలో తెలియని అయోమయ పరిస్థితిని ఎదుర్కొన్నాడు వశిష్ఠ. ఈ యువ దర్శకుడికి నో చెప్పి వేరే సినిమాలు చేసిన శిరీష్, రవితేజ ఇద్దరూ కూడా కెరీర్లో ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నారు. వారి పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు ‘బింబిసార’ సాధించిన విజయం చూసి ఈ కొత్త దర్శకుడిని నమ్మనందుకు వాళ్లు ఎంతో చింతిస్తూ ఉంటారనడంలో సందేహం లేదు.
This post was last modified on August 16, 2022 8:19 am
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…