‘కార్తికేయ-2’ విడుదలకు ముందు నిఖిల్ పడ్డ వేదన గురించి అందరికీ తెలిసిందే. తనకు బ్యాగ్రౌండ్ లేకపోవడం వల్ల ఈ సినిమాను మళ్లీ మళ్లీ వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని, రిలీజ్ డేట్ ఇచ్చాక పదే పదే మార్చాల్సి వచ్చిందని ఓ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశాడతను. కొవిడ్ కారణంగా అసలే ఆలస్యమైన సినిమాను.. జులై 22న రిలీజ్ చేయాలనుకుంటే ‘థాంక్యూ’కు పోటీ అవుతుందని వాయిదా వేయించారు. ఆగస్టు 5 వైపు చూస్తే అక్కడ ఆల్రెడీ రెండు సినిమాలు షెడ్యూల్ అయి ఉండడంతో అవకాశం దక్కలేదు.
చివరికి ఆగస్టు 12న రిలీజ్ అంటూ డేట్ ప్రకటించాక నితిన్ సినిమా ‘మాచర్ల నియోజకవర్గం’ ఓపెనింగ్స్కు ఇబ్బంది అవుతుందని ఒక రోజు వాయిదా వేయించారు. ఈ పరిణామాలు నిఖిల్ను ఎంతో ఆవేదనకు గురి చేసినా తట్టుకున్నాడు. ఇదంతా ఇండస్ట్రీ మంచి కోసమే కదా అని మీడియా సమావేశంలో హుందాగా మాట్లాడాడు. ఐతే చివరికి చూస్తే ఇప్పుడు నిఖిల్ సినిమాకు అన్నీ కలిసొస్తుండడం, చివరికి మంచే జరగడం తన అభిమానులను ఆనందానికి గురి చేస్తోంది.
శనివారం ఫుల్ పాజిటివ్ టాక్తో మొదలైన ‘కార్తికేయ-2’ రిలీజైన థియేటర్లన్నింట్లో హౌస్ ఫుల్స్తో నడుస్తోంది. హైదరాబాద్ సిటీలో శనివారం సాయంత్రం, నైట్ షోలన్నీ ఫుల్ అయిపోయాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో రెండు థియేటర్లలో సినిమాను రిలీజ్ చేస్తే రెండూ ఫుల్లే. మరోవైపు ‘మాచర్ల నియోజకవర్గం’ మూవీ రెండు థియేటర్లలో ఆడుతుండగా ఆక్యుపెన్సీ 25 శాతానికి అటు ఇటుగా ఉంది. పూర్తిగా నెగెటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం తొలి రోజే దాదాపు బకెట్ తన్నేసిందని చెప్పాలి.
‘కార్తికేయ-2’కు పాజిటివ్ టాక్ రావడం.. గత వారం సినిమాలు కూడా బాగా ఆడుతుండటంతో ప్రేక్షకులు ఈ సినిమాను పట్టించుకోవడం లేదు. ఐతే ముందే థియేటర్లు బుక్ చేయడంతో ‘కార్తికేయ-2’తో పోలిస్తే రెట్టింపు థియేటర్లలో ఆడుతోందీ సినిమా. కానీ ఎంత ముందు బుక్ చేసినా.. వసూళ్లు లేకుండా అన్నేసి థియేటర్లలో సినిమాను నడిపించి ప్రయోజనం ఏంటి? ఓవైపు ‘కార్తికేయ-2’ సినిమాకు డిమాండ్కు తగ్గ థియేటర్లు లేవు. దాని కోసం జనం ఎగబడుతున్నారు. ఇంకోవైపేమో ‘మాచర్ల..’ థియేటర్లలో జనం లేరు. అలాంటపుడు కచ్చితంగా ఆ సినిమా థియేటర్లను తీసి ‘కార్తికేయ-2’కు ఇవ్వాల్సిందే. ఆది, సోమవారాలు సెలవులు కావడంతో ‘కార్తికేయ-2’కు మెజారిటీ థియేటర్లు కేటాయిస్తే ఎగ్జిబిటర్లకు మంచి ప్రయోజనం దక్కుతుంది.
This post was last modified on August 14, 2022 12:20 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…