పట్టుమని వయసు ఇరవై నిండకుండానే డెబ్యూ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకోవడం హీరోయిన్ల విషయంలో అరుదుగా జరుగుతుంది. ఉప్పెన వచ్చినప్పుడు కృతి శెట్టికి పెరిగిన డిమాండ్ అంతా ఇంతా కాదు. హీరో వైష్ణవ్ తేజ్ కన్నా ఎక్కువగా ఈమె మేనేజర్ కే ఫోన్ కాల్స్ వచ్చాయంటే అతిశయోక్తి కాదు. దెబ్బకు రెండో సినిమా రిలీజ్ కాకుండానే రెమ్యునరేషన్ కోటి దాటిపోయిందని ఆఫ్ ది రికార్డు కామెంట్లు గట్టిగానే వినిపించాయి. అయినా తనకున్న ఇమేజ్ ప్లస్ మార్కెట్ దృష్ట్యా నిర్మాతలు అదేమీ పెద్ద మొత్తమో భారమో అనుకోలేదు.
తర్వాత నానితో చేసిన శ్యామ్ సింగ రాయ్ హిట్ క్యాటగిరీలో పడగా బంగార్రాజు కూడా కమర్షియల్ గా వర్కౌట్ చేసుకుని సంక్రాంతి విజేతగా నిలిచింది. ఇలా విజయవంతంగా హ్యాట్రిక్ హిట్లు పూర్తయ్యాయి. ఇదిలాగే కొనసాగితే బాగుండేది కానీ కృతి శెట్టికి తక్కువ గ్యాప్ లో వరసగా షాకులు తగలడం మొదలయ్యింది. గత నెల భారీ అంచనాల మధ్య వచ్చిన రామ్ ది వారియర్ ఎంత డిజాస్టరో మళ్ళీ గుర్తు చేయాల్సిన పని లేదు. రేడియో జాకీగా కృతి చేసిన క్యారెక్టర్ ని దర్శకుడు లింగుస్వామి సెకండ్ హాఫ్ లో వదిలేయడంతో ప్రయోజనం కలగలేదు
తాజాగా నితిన్ మాచర్ల నియోజకవర్గం కూడా అదే లిస్టులో చేరేలా ఉంది. పాత కథా కథనాలతో దర్శకుడు ఎంఎస్ రాజశేఖర్ ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ని తీర్చిదిద్దిన తీరు విమర్శలను తెచ్చి పెడుతోంది. పైగా వారియర్ లాగే ఇందులోనూ కథకో చిన్న లింక్ తప్ప కృతి శెట్టికి పెద్దగా స్కోప్ దక్కలేదు. సో రెండో షాకు తప్పలేదు. ఇప్పటికే రెండు మూడు సార్లు వాయిదా పడి సెప్టెంబర్ లో రిలీజ్ కానున్న ‘ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమా ఏమైనా బ్రేక్ ఇస్తుందేమో చూడాలి. తర్వాత లిస్ట్ లో నాగచైతన్య, సూర్య సినిమాలు సెట్స్ మీదున్నాయి
This post was last modified on August 12, 2022 6:03 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…