మెగాస్టార్ చిరంజీవికి కొంత కాలంగా అస్సలు టైం కలిసి రావట్లేదు. రీఎంట్రీలో ‘ఖైదీ నంబర్ 150’తో ఘనవిజయం అందుకున్నప్పటికీ.. ఆ తర్వాత మాత్రం ఆయనకు చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. తన కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో, అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేసిన ‘సైరా నరసింహారెడ్డి’ అంచనాలను అందుకోలేకపోయింది. సినిమా బ్యాడ్ అని కాదు కానీ.. అంతిమంగా అది కాస్ట్ ఫెయిల్యూర్ అనిపించుకుంది. ఇక తర్వాతి చిత్రం ‘ఆచార్య’ గురించి చెప్పాల్సిన పనే లేదు.
బాక్సాఫీస్ దగ్గర తన కెరీర్లోనే అత్యంత ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్నాడు చిరు. తన సినిమాలు పోవడమే కాక.. చిరు ఎవరికి, ఏ రకంగా సపోర్ట్ చేసినా ఫలితం తిరగబడుతుండటంతో అదే పనిగా సోషల్ మీడియాలో కాచుకుని ఉండే బ్యాచ్కు ఆయన దొరికిపోతున్నారు. విపరీతంగా ట్రోల్ అవుతున్నారు. తన స్వార్థం ఏమీ లేకుండా ఇండస్ట్రీ మంచి కోరి ఆయన చేస్తున్న ప్రయత్నాలు కూడా వరుసగా బెడిసి కొడుతుండటం విచారకరం.
తనకు ఎంతో ఇచ్చిన తెలుగు సినీ పరిశ్రమకు మంచి చేద్దామని ప్రకాష్ రాజ్ గత ఏడాది ‘మా’ ఎన్నికల్లో బరిలోకి దిగగా.. ఇందులో తన ప్రయోజనం ఏమీ లేకపోయినా చిరు పరోక్ష మద్దతు ఇచ్చారు. కానీ ఆయన ఓడిపోయారు. చిరు బహిరంగ మద్దతు ఇచ్చి, ప్రచారం చేసి ఉంటే కథ వేరుగా ఉండేదేమో. కానీ తెరవెనుక మద్దతు ఇవ్వడం వల్ల ఆశించిన ఫలితం దక్కలేదు. అక్కడ కట్ చేస్తే.. చిరు పెద్ద మనసుతో వేరే వాళ్ల సినిమాల వేడుకలకు ముఖ్య అతిథిగా రావడం, అలాగే ఏ స్వార్థం లేకుండా ప్రమోట్ చేయడం చేస్తుంటే వాటికీ ఆశించిన ఫలితాలు రావట్లేదు. మిషన్ ఇంపాజిబుల్, పక్కా కమర్షియల్ లాంటి చిత్రాల వేడుకలకు వచ్చి వాటి గురించి చాలా మంచిగా మాట్లాడాడు చిరు.
కానీ అవి దారుణమైన ఫలితాలందుకున్నాయి. ఇక బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ వ్యక్తిగతంగా అడిగాడని, తన మిత్రుడైన నాగార్జున కొడుకు నాగచైతన్య ఇందులో ప్రత్యేక పాత్ర చేశాడని చిరు పెద్ద మనసుతో ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించడమే కాదు.. ఒకటికి రెండుసార్లు స్పెషల్ ప్రిమియర్లలో సినిమా చూశాడు. ఆమిర్తో కలిసి స్పెషల్ ఇంటర్వ్యూల్లో పాల్గొన్నాడు. సోషల్ మీడియా ద్వారా ఆ చిత్రాన్ని బాగా ప్రమోట్ చేశాడు. కానీ ఈ సినిమా కూడా బ్యాడ్ టాక్తో మొదలై డిజాస్టర్ దిశగా అడుగులు వేస్తుండటంతో చిరును ఓ వర్గం సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తోంది.
This post was last modified on August 12, 2022 1:00 pm
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…