ఈ మధ్య సినిమాలో విషయంతో సంబంధం లేకుండా వేరే అంశాలతో ముడిపెట్టి కొత్త చిత్రాలను టార్గెట్ చేయడం ఒక ట్రెండ్గా మారిపోయింది. తాజాగా ఇలా విడుదలకు ముందు విపరీతమైన నెగెటివిటీతో దెబ్బ తిన్న సినిమా ‘లాల్ సింగ్ చడ్డా’. ఆమిర్ బ్లాక్బస్టర్ మూవీ ‘పీకే’లో ఒక సీన్లో హిందూ దేవుడిని అవమానించారని.. ఒక ఇంటర్వ్యూలో దేశంలో అసహనం పెరిగిపోతోందని వ్యాఖ్యానించాడని.. ఇలాంటి కారణాలేవో చూపించి ఇప్పుడు ఈ చిత్రాన్ని టార్గెట్ చేశారు. కొన్ని రోజుల నుంచి అదే పనిగా ‘బాయ్కాట్ లాల్ సింగ్ చడ్డా’ అనే హ్యాష్ ట్యాగ్ పెట్టి దీని గురించి నెగెటివిటీని స్ప్రెడ్ చేశారు.
సోషల్ మీడియా ఎఫెక్ట్ బయట జనాల మీద ఎంత ఉంటుందిలే అని తేలిగ్గా తీసిపారేయడానికి వీల్లేదు. ఆ ప్రభావం అడ్వాన్స్ బుకింగ్స్ మీద పడింది. ఆమిర్ ఏ సినిమాకు లేనంత దారుణంగా బుకింగ్స్ జరిగాయి. ట్రైలర్ ఆసక్తికరంగా లేకపోవడం, కొవిడ్ అనంతర పరిస్థితులు కూడా ఇందుకు కారణమే అయినప్పటికీ.. సోషల్ మీడియాలో నెగెటివ్ ప్రచారం కూడా చేటు చేసిందన్నది వాస్తవం. ఇక సినిమాకు బ్యాడ్ టాక్ వచ్చేసరికి ఈ బ్యాచ్ మరింత రెచ్చిపోయింది. సినిమాను ఇంకా దెబ్బ తీస్తోంది.
కట్ చేస్తే శుక్రవారం నితిన్ సినిమా ‘మాచర్ల నియోజకవర్గం’ థియేటర్లలోకి దిగుతోంది. ఈ సినిమాను కూడా బ్యాన్ చేయాలని, బాయ్కా్ చేయాలని కొన్ని రోజుల కిందట సోషల్ మీడియాలో గట్టి ప్రచారం జరగడం తెలిసిందే. కొన్ని కులాలను కించపరిచేలా ఈ చిత్ర దర్శకుడు ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి ట్వీట్లు వేశాడంటూ అతడి మీద యుద్ధం ప్రకటించారు. అత్యంత వివాదాస్పదంగా మారిన ట్వీట్ ఫేక్ అని రాజశేఖర్ రెడ్డి వాదించినప్పటికీ.. గతంలో అతను వేసిన అబ్యూజివ్ ట్వీట్లు కొన్ని అతడికి ఇబ్బందిగా మారాయి.
దీంతో నెగెటివ్ ట్రెండ్ చేసిన వాళ్లు తగ్గలేదు. మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకుని రిలీజ్ ముంగిట మళ్లీ సినిమాను టార్గెట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమాపై ఈ ప్రభావం ఎంత మేర పడుతుందో అన్న ఆందోళన చిత్ర బృందంలో నెలకొంది. రిలీజ్ రోజు అదే పనిగా ఈ బ్యాచ్ నెగెటివిటీ స్ప్రెడ్ చేస్తుందా.. ఒకవేళ టాక్ అటు ఇటుగా ఉంటే సినిమాను కిల్ చేసేస్తుందా అన్న భయాలు టీంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాళ్లకు అవకాశం ఇవ్వకుండా సినిమా మంచి టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర జెండా ఎగరేస్తుందేమో చూడాలి.
This post was last modified on August 12, 2022 11:53 am
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల క్రితం శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో జరిపిన పర్యటన…
ఒకపక్క విడుదల తేదీ మే 9 ముంచుకొస్తోంది. రిలీజ్ కౌంట్ డౌన్ నెల నుంచి 29 రోజులకు తగ్గిపోయింది. ఇంకోవైపు…
ముఖ్యమంత్రుల 'బ్రాండ్స్'పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి ముఖ్యమంత్రికి ఒక్కొక్క బ్రాండ్ ఉంటుందన్నారు. "రెండు…
బీఆర్ఎస్ నాయకుడు, బోధన్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే షకీల్ అరెస్టయ్యారు. రెండేళ్ల కిందట జరిగిన ఘటనలో తన కుమారుడిని సదరు…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యవహారంపై ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది. కాకాణిపై ఏపీ…
తప్పు ఎవరు చేసినా తప్పే.. అన్న సూత్రాన్ని పాటిస్తున్న టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు.. తన పార్టీవారిని కూడా వదిలి…