ఫిలిం ఇండస్ట్రీలో లింగ వివక్ష, అమ్మాయిలపై లైంగిక వేధింపులు, పారితోషకాల్లో తేడా గురించి హీరోయిన్లు ఎవరిని అడిగినా స్టాండర్డ్ ఆన్సర్స్ ఇస్తుంటారు. తమకూ ఈ విషయాల్లో చేదు అనుభవాలున్నాయని చెబుతారు. ముఖ్యంగా పారితోషకాల్లో తేడా గురించి అడిగితే.. ఏమిటీ వివక్ష అని మాట్లాడతారు. ఫిలిం ఇండస్ట్రీలో ఈ అన్యాయం గురించి విమర్శలు గుప్పిస్తారు. కానీ శ్రుతి హాసన్ మాత్రం ఇందుకు భిన్నంగా మాట్లాడింది.
ఇండస్ట్రీలో లింగ వివక్ష లేదని అనలేదు కానీ.. ఈ విషయంలో సినీ పరిశ్రమను తప్పుబట్టడానికి వీల్లేదని శ్రుతి స్పష్టం చేసింది. సమాజంలో ఎప్పట్నుంచో పురుషాధిక్యత అనేది ఉందని.. అన్ని రంగాల్లోనూ ఇది సహజమే అని, కాబట్టి సినిమా పరిశ్రమలో మాత్రమే పురుషాధిక్యత ఎక్కువ అని, పారితోషకాల విషయంలో పురుషులకు, మహిళలకు తేడా ఉందని అనడంసరికాదని శ్రుతి అభిప్రాయపడింది.
సినిమా అనేది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వాటికి ప్రతిబింబం మాత్రమేనని, అందువలన సినీ పరిశ్రమను మాత్రమే నిందించడంలో అర్థం లేదని ఆమె తేల్చి చెప్పింది. శ్రుతి స్వయంగా దిగ్గజ నటుడైన కమల్ హాసన్ కూతురు. ఆయన అండతోనే ఆమె సినిమాల్లోకి అడుగు పెట్టింది. స్టార్ స్టేటస్ సంపాదించింది. ఇప్పుడొచ్చి పురుషాధిక్యత గురించి, పారితోషకాల్లో తేడా గురించి మాట్లాడితే తండ్రిని కూడా విమర్శించినట్లు అవుతుంది.
అందుకేనేమో చాలామంది హీరోయిన్లలా కాకుండా ప్రాక్టికల్గా మాట్లాడే ప్రయత్నం చేసినట్లుంది. ఒక టైంలో మంచి ఊపులో ఉన్న శ్రుతి కెరీర్ మధ్యలో బాగా డల్ అయింది. ఒక దశలో ఆమె కెరీర్ ముగిసిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.. కానీ గత ఏడాది క్రాక్, వకీల్ సాబ్ చిత్రాలతో తన పునరాగమనాన్ని ఘనంగా చాటిందామె. ప్రస్తుతం బాలయ్య, చిరంజీవిల కొత్త సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది కమల్ తనయ.
This post was last modified on August 12, 2022 7:55 am
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష(ప్రధాన కాదు) నాయకుడు, వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అన్యాయంగా…