సూపర్ స్టార్ మహేష్ అభిమానుల మేనియా మామూలుగా లేదు కొన్ని రోజుల నుంచి. తెలుగు రాష్ట్రాల్లోనే కాక అమెరికాలో వాళ్లు చేసిన సందడి అంతా ఇంతా కాదు. స్టార్ హీరోల పుట్టిన రోజులు వచ్చినపుడు స్పెషల్ షోలు వేయడం మామూలే కానీ.. అవి పెద్ద సిటీల్లో ఒకటో రెండో ఉంటాయంతే. కానీ ఈసారి మహేష్ పుట్టిన రోజును పురస్కరించుకుని ముందు పదుల సంఖ్యలో పోకిరి సినిమా స్పెషల్ షోలు ప్లాన్ చేస్తే అవి కాస్తా వందల్లోకి వెళ్లిపోయాయి.
ఏదో కొత్త సినిమా కోసం ఎగబడ్డ తరహాలో ఈ సినిమా కోసం అభిమానులు వెర్రెత్తిపోయారు. వాళ్ల ఉత్సాహం, డిమాండ్ చూసి తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి పేరున్న సిటీ, టౌన్లో పోకిరి షోలు వేశారు. అమెరికాలో సైతం చెప్పుకోదగ్గ సంఖ్యలు షోలు పడ్డాయి. చెన్నై, బెంగళూరు లాంటి సిటీలకు కూడా ఈ ఫీవర్ పాకిపోయి అక్కడా స్పెషల్ షోలు వేశారు. అన్ని షోలకూ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. ఈ షోల గ్రాస్ కోటి రూపాయలు దాటిపోవడం విశేషం.
ఎప్పుడో 16 ఏళ్ల కిందట విడుదలైన సినిమా ఇప్పుడు ఇలా రీ రిలీజ్ అయి.. ఇంత డిమాండ్ తెచ్చుకోవడం, ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టడం అనూహ్యమైన విషయం. ఈ తరహా రేంజ్ మహేష్ అభిమానులు కూడా ఊహించనిది. ఇక సినిమా ప్రదర్శన సందర్భంగా థియేటర్ల ముందు, లోపల జరిగిన హంగామా గురించి ఎంత చెప్పినా తక్కువే. కొత్త సినిమా రిలీజ్ స్థాయిలో అభిమానులు సంబరాలు చేశారు. కటౌట్లు పెట్టి, డీజేలు పెట్టి డ్యాన్సులేశారు. బాణసంచాలు కాల్చారు. థియేటర్లలో అయితే ఎవ్వరూ కుదురుగా కూర్చున్నది లేదు.
ఇంట్రో సీన్లకు, ఎలివేషన్ సీన్లకు, యాక్షన్ ఘట్టాలకు, పంచ్ డైలాగులకు, పాటలకు.. ఇలా ఫ్యాన్స్కు హై ఇచ్చే ప్రతి మూమెంట్లోనూ థియేటర్లు దద్దరిల్లిపోయాయి. ప్రతి థియేటర్లోనూ పండుగ వాతావరణం నెలకొంది. ఆ సంబరాల తాలూకు వీడియోలు అభిమానులకు మామూలు కిక్ ఇవ్వట్లేదు సోషల్ మీడియాలో. ఈ సందడి చూశాక మిగతా స్టార్ హీరోల అభిమానులకూ ఇలాగే తమ హీరో పుట్టిన రోజుకు స్పెషల్ షోలతో సంబరాలు చేసుకోవాలని.. దీన్ని బీట్ చేసేలా హంగామా ఉండాలని కోరిక పుడుతోంది. కానీ ఈ యుఫోరియాను మ్యాచ్ చేయడం మాత్రం అంత తేలిక కాదు. ముందుగా సెప్టెంబరు 2న పవర్ స్టార్ పుట్టిన రోజు సందర్భంగా జల్సా స్పెషల్ షోలతో పవన్ ఫ్యాన్స్ రంగంలోకి దిగుతున్నారు. వాళ్ల హంగామా ఎలా ఉంటుందో చూడాలి మరి.
This post was last modified on August 11, 2022 3:07 pm
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…