తెలుగులో తమిళ హీరోలు ఫాలోయింగ్ సంపాదించుకోవడం, వాళ్ల సినిమాలు మంచి క్రేజ్ మధ్య రిలీజ్ కావడం మామూలే. రజినీకాంత్, కమల్ హాసన్ల దగ్గర్నుంచి కార్తి వరకు చాలామంది తమిళ స్టార్లు ఇక్కడ మార్కెట్ సంపాదించుకున్నవారే. ఐతే మిగతా ఏ భాషలకు చెందిన హీరోలకూ తెలుగులో పెద్దగా మార్కెట్ లేదు. గతంలో హిందీ స్టార్ల సినిమాలు కొన్ని ఇక్కడ బాగా ఆడాయి. మలయాళ, కన్నడ స్టార్లు కూడా తెలుగులో నటించారు. కానీ ఎవరూ కూడా ప్రత్యేకంగా మార్కెట్ సంపాదించుకున్న వారు కాదు. ఐతే ఇప్పుడు ఒక మలయాళ హీరో తెలుగులో చాప కింద నీరులా తన పాలోయింగ్ను విస్తరిస్తున్నాడు.
యూత్కు బాగా చేరువ అవుతున్నాడు. అమ్మాయిలకు అయితే అతను హార్ట్ త్రోబ్ అనే చెప్పాలి. ఈ ఉపోద్ఘాతం అంతా దుల్కర్ సల్మాన్ గురించే. దుల్కర్ తండ్రి తెలుగులో స్వాతి కిరణం, యాత్ర లాంటి మంచి సినిమాల్లో నటించారు. త్వరలోనే ఏజెంట్ మూవీలోనూ ఆయన కనిపించబోతున్నారు. ఐతే ఆయనకంటూ ఇక్కడ మార్కెట్ అయితే క్రియేటివ్వలేదు. కానీ తెలుగు వరకు దుల్కర్.. తండ్రిని మించిన తనయుడు అనిపించుకుంటున్నాడు.
ఐతే అతను తండ్రి పేరు చెప్పుకునేమీ ఇక్కడ అడుగు పెట్టలేదు. తమిళ చిత్రం ఓకే కణ్మణి డబ్బింగ్ వెర్షన్తో అతను తొలిసారి తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. అది అతడికి మంచి గుర్తింపునిచ్చింది. తర్వాత మహానటిలో జెమిని గణేషన్ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించాడు. దీంతో అతడికి ఇక్కడ ఫాలోయింగ్ పెరిగింది.
ఆ తర్వాత తమిళ అనువాద చిత్రం కనులు కనులను దోచాయంటే మూవీ సర్ప్రైజ్ హిట్టయి దుల్కర్కు ఇంకా మంచి పేరు తెచ్చింది. ఇప్పుడిక సీతారామంతో అతను తెలుగులో విశేషమైన పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్నాడు. ఈ దెబ్బతో అతడికి తెలుగులో స్టార్ ఇమేజ్ వచ్చేసిందంటే అతిశయోక్తి కాదు. యూత్కు అతను విపరీతంగా నచ్చేస్తున్నాడు. అమ్మాయిలు తన కోసం పడి చచ్చిపోతున్నారు. అతను తెలుగులో చేసే తర్వాతి సినిమాకు బంపర్ క్రేజ్ వస్తుందనడంలో సందేహం లేదు.
This post was last modified on August 11, 2022 10:21 am
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…