నిన్న మహేష్ బాబు బర్త్ డే ని పురస్కరించుకొని సూపర్ స్టార్ ఫ్యాన్స్ పోకిరి , ఒక్కడు షోలను ప్లాన్ చేసుకున్నారు. నెల ముందే పండుగాడు మళ్ళీ వస్తున్నాడు అంటూ పోకిరి స్పెషల్ స్క్రీనింగ్ ని ప్రమోట్ చేసుకున్నారు. దీంతో నిన్న పోకిరి షోలు అభిమానులతో కిక్కిరిసిపోయాయి. కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ షోలకు బాగానే వచ్చారు. పుట్టిన రోజు ముందు రోజు అంటే ఆగస్ట్ 8న ‘ఒక్కడు’ షో వేశారు ఫ్యాన్స్.
ఐమ్యక్స్ లో ఆరోజంతా షోస్ పడ్డాయి. ఉదయం నుండి అర్థరాత్రి వరకూ ప్రసాద్స్ లో షోలు వేశారు. అంతే కాదు దర్శకుడు గుణశేఖర్ , హీరోయిన్ భూమిక ని కూడా ఇన్వైట్ చేశారు. ఇక పోకిరి గురించైతే చెప్పనక్కర్లేదు. నిన్న మహేష్ కొత్త సినిమా కంటే ఎక్కువ సందడే థియేటర్స్ దగ్గర కనిపించింది.
ఆంద్రప్రదేశ్ , తెలంగాణా మొత్తంగా దాదాపు 200లకు పైగా షోస్ పడ్డాయి. ఓవర్ సీస్ లో కూడా బాగానే షోలు పడ్డాయి. అన్ని చోట్లా హౌజ్ ఫుల్స్ అయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో పోకిరి తీవ్రత ఎక్కువ కనిపించింది. దీంతో ఈ వారం రిలీజై హిట్ టాక్ అందుకున్న ‘బింబిసార’, ‘సీతారామం’ ల కలెక్షన్స్ పై మహేష్ సినిమాల ఎఫెక్ట్ గట్టిగా పడింది.
పోకిరి ఎఫెక్ట్ తో నిన్న చాలా చోట్ల బింబిసార , సీతారామం కలెక్షన్స్ తక్కువ వచ్చాయి. ఏదేమైనా మహేష్ ఫ్యాన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా మళ్ళీ థియేటర్స్ కి రప్పించి ఓ రేంజ్ లో హంగామా చేశాడు పండుగాడు. మహేష్ ఇకపై సందేశాత్మక సినిమాలకంటే ఇలాంటి మాస్ సినిమాలే చేయాలని ‘ఒక్కడు’, ‘పోకిరి’ స్పెషల్ షోల రెస్పాన్స్ ద్వారా ఫ్యాన్స్ చెప్పకనే చెప్పారు. ఏదేమైనా నిన్న హిట్ సినిమాలపై మాత్రం మహేష్ సినిమా దెబ్బ గట్టిగానే పడింది.
This post was last modified on August 10, 2022 6:54 pm
తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల కేసు వ్యవహారం ఆసక్తి రేపిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ కు 10…
సోషల్ మీడియాలో చాలా అలెర్ట్ గా ఉండాలి. ముఖ్యంగా సెలబ్రిటీలు బిజీగా షెడ్యూల్స్ లో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా…
థియేటర్లకు సరైన సినిమాలు వస్తే రావడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. ఎటొచ్చి వాళ్ళను కనీస స్థాయిలో మెప్పించే కంటెంట్ ఉన్నవి…
తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డిలు..…
వంటగ్యాస్ కొరత కారణంగా దేశవ్యాప్తంగా చిన్న హోటళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. హోటళ్లకు సరఫరా అయ్యే కమర్షియల్ సిలిండర్ల పంపిణీని…
రాష్ట్రంలోని పలు మున్సిపల్ సంస్థల్లో పాలకవర్గాల గడువు ముగియడంతో అక్కడ స్పెషల్ ఆఫీసర్ల పాలన అమల్లోకి రానుంది. మున్సిపల్ కార్పొరేషన్లు,…